పాకిస్థాన్ బండారం బయటపెట్టిన భారత్.. ఐరాసలో దిమ్మతిరిగే కౌంటర్..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూసిన పాకిస్థాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్థాన్ బూటకపు ప్రచారాన్ని తిప్పికొడుతూ, 1971లో బంగ్లాదేశ్లో పాక్ సైన్యం జరిపిన ‘సామూహిక అత్యాచార మారణహోమం’ గురించి గుర్తుచేసి దాని నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది. భద్రతా మండలిలో సోమవారం ‘మహిళలు, శాంతి, భద్రత’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ అనూహ్యంగా…

