ఆ ‘నాటకాల రాయుడు’ వేషాలు ఇక సాగవు: తిరుమల లడ్డూ కల్తీ దోషులను వదిలేది లేదు – సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మహా పాపానికి బాధ్యులైన వారిని నడిరోడ్డుపై నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గుజరాత్లోని ఎన్డీడీబీ (NDDB) ల్యాబ్ నివేదిక ప్రకారం, ప్రసాదంలో వాడినది నెయ్యి కాదని, జంతువుల కొవ్వు అని తేలిందని ఆయన గుర్తుచేశారు. ఈ అక్రమాల నుండి తప్పించుకోవడానికే వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. వైఎస్…

