News

AP

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ .. మూడు ప్రధాన సమస్యలపై వినతి..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న సమావేశమయ్యారు. రాష్ట్ర రైతుల సమస్యలపై చర్చించేందుకు ఆయన ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ప్రధానంగా మూడు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.   2014-19 సంవత్సరాల మధ్య ఉపాధి పథకం కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల సమస్యను త్వరితగతిన పరిష్కరించి నిధులు విడుదల చేయాలని రామ్మోహన్ నాయుడు కోరారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ ఉత్పత్తి చేసే…

AP

ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి..

పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్మిక భద్రత అంతే ముఖ్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మిక భద్రతా ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు, బీఐఎస్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం మరియు గట్టి భద్రతా ఆడిట్ శిక్షణ (IS 14489:2018 ప్రకారం)’ కార్యక్రమాన్ని నిన్న విజయవాడలోని హయత్ ప్లేస్ హోటల్‌లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సుభాష్, కర్మాగార శాఖ ఏపీసీఎఫ్ఎస్ఎస్ సహకారంతో రూపొందించిన ‘factories’ యాప్‌ను ప్రారంభించారు.…

TELANGANA

మిల్లెట్స్ హబ్‌గా హైదరాబాద్.. గ్లోబల్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ – భారత సిరిధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) ప్రాంగణంలో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’కు ఆయన శంకుస్థాపన చేశారు.   సిరిధాన్యాల రంగంలో పరిశోధన, అభివృద్ధి, శిక్షణతో పాటు వాటి ప్రాచుర్యం కల్పించే దిశగా ఈ కేంద్రం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను మరింతగా పెంపొందించేందుకు ఈ…

AP

భవిష్యత్ టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతి..!

అమరావతిలో పెద్ద ప్రాజెక్ట్ మొదలైంది. దీనితో మూడు నగరాలకు ఊహించని కనెక్టివిటీ పెరగనుంది. అంతేకాదు ఇక్కడ ఎందరో విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే చాలు, జై అమరావతి.. జైజై రాజధాని అనేస్తారు. ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏమిటో తెలుసుకోండి. మన రాజధాని అద్భుతాన్ని తెలుసుకొని, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిద్దాం.   రాష్ట్ర రాజధాని అమరావతిని ఇప్పుడు దేశానికి గర్వకారణంగా మార్చే పనిని ఏపీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నిర్మాణం ఆగిపోయిందని…

National

సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో.. నీటి సంక్షోభంతో పాక్ విలవిలా..!

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో పాకిస్థాన్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో, ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు సింధు నదీ వ్యవస్థ నుంచి అందే నీటిలో భారీగా కోత పడింది. జూన్ 5న సింధు బేసిన్ నుంచి పాక్ డ్యామ్‌లకు 1,24,500 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలైందని, గత ఏడాది ఇదే సమయానికి ఇది సుమారు 1,44,000 క్యూసెక్కులుగా…

TELANGANA

‘కాళేశ్వరం’ మరో దేశంలో నిర్మించి ఉంటే చరిత్రలో నిలచిపోయేది: కేటీఆర్..

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రజలకు తెలుసని, కేవలం కేసీఆర్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎదుట సోమవారం మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ ప్రభుత్వ వైఖరిని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు…

AP

బుద్ధి మార్చుకోని జర్నలిస్ట్ కృష్ణంరాజు.. ఆధారాలున్నాయంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే యత్నం..

సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే, ఆ తర్వాతైనా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. కానీ, అమరావతి మహిళలను ఉద్దేశించి గతంలో సాక్షి చానెల్‌లో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. పైగా, తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు మరింత వివాదాస్పద చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఆయన తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవిగోనంటూ కొన్ని పాత వార్తా కథనాలను చూపిస్తూ ఒక వీడియోను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   గతంలో…

National

హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు..

హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక తన కోడలు సోనమ్ హస్తం ఉందని, ఆమె కిరాయి హంతకులతో తన కుమారుడిని చంపించిందని ఆరోపించారు. ఒకవేళ తన కోడలు దోషిగా తేలితే, ఆమెకు మరణశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.   ఇటీవల వివాహం చేసుకున్న రాజా రఘువంశీ, తన భార్య సోనమ్‌తో కలిసి…

National

అదానీ పోర్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక..

భారత సముద్ర వాణిజ్య రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక ‘ఎంఎస్‌సీ ఇరినా’ ఈ రోజు అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న కేరళలోని విళింజం అంతర్జాతీయ ఓడరేవుకు చేరుకుంది. ఈ భారీ నౌక మంగళవారం వరకు ఇక్కడే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పరిణామం అత్యంత భారీ కంటైనర్ నౌకలను (అల్ట్రా-లార్జ్ కంటైనర్ వెసెల్స్ – యూఎల్‌సీవీ) నిర్వహించడంలో విళింజం పోర్టుకున్న అపార సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.   ప్రపంచంలోనే అత్యధిక టీఈయూ…

TELANGANA

సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్న రాజాసింగ్..! మరోసారి..

సొంత పార్టీ నాయకుడినే లక్ష్యంగా చేసుకుని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో మరోసారి పరోక్షంగా కిషన్ రెడ్డిపై ఆయన విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.   హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..…