News

National

ఉత్తరప్రదేశ్‌లో కుల రాజకీయాలకు చెక్.. సమావేశాలపై నిషేధం..!

ఉత్తరప్రదేశ్‌లో కుల వివక్ష నిర్మూలనే లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. సమాజంలో కుల ప్రస్తావనలకు తావులేకుండా చేసేందుకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై పోలీసు రికార్డులు మొదలుకొని వాహనాలపై రాసే నినాదాల వరకు ఎక్కడా కులం కనిపించకూడదని స్పష్టం చేస్తూ జిల్లా అధికారులకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.   తాజా…

AP

‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ’పై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్..

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై గత కొంతకాలంగా నెలకొన్న ఆందోళనలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలి వేదికగా తెరదించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రణాళిక ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కర్మాగారం పునరుద్ధరణ కోసం రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో…

TELANGANA

పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లభిస్తుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: హరీశ్ రావు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హామీ ఇచ్చారు. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి ఆధ్వర్యంలో మాజీ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడించాలని సూచించారు.   ఎన్నికల సమయంలో…

AP

సంచలన పరిణామం… మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైసీపీ..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన ఓ కీలక తీర్మానం సభలో సంచలనం సృష్టించగా, ప్రతిపక్ష వైసీపీని ఇరకాటంలో పడేసింది. అనూహ్యంగా, ఆ తీర్మానానికి వైసీపీ మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది.   విశాఖ స్టీల్ ప్లాంట్…

National

కులగణన తేల్చాకే స్థానిక పోల్స్.. తెలంగాణ ప్రభుత్వానికి కవిత డిమాండ్..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందే, రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే వివరాలను ప్రతి గ్రామ పంచాయతీ వారీగా బయటపెట్టాలని ఆమె మంగళవారం డిమాండ్ చేశారు.   కులగణన సర్వే వివరాలను రహస్యంగా ఉంచి, బీసీ రిజర్వేషన్లను తమకు అనుకూలంగా ఖరారు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా ఆమె ఒక…

AP

మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు పీపీపీ నిర్ణయం..!

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసే నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇది ప్రైవేటీకరణ కాదని, బెదిరింపులకు భయపడి మంచి నిర్ణయాలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.   పీపీపీ విధానం వల్ల ఎవరికీ నష్టం జరగదని సీఎం భరోసా ఇచ్చారు. “హైవేలను పీపీపీ…

TELANGANA

రాజీనామా పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెన్సేషనల్ కామెంట్స్..!

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీల అంశం ముగిశాక తన ఎమ్మెల్సీ రాజీనామా గురించి ఆలోచిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటకి రాలేదని.. కావాలనే కాంగ్రెస్ బయటికి పంపిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.   సీఎం రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి..   కాంగ్రెస్ పార్టీని తమ పార్టీలో విలీనం చేస్తామంటే ఒప్పుకుంటామని అన్నారు.…

TELANGANA

ఈ నెల 22న చత్తీస్‌ గఢ్‌ ‌కు మంత్రి ఉత్తమ్‌, సీఎం శ్రీ విష్ణుతో భేటీ.. ఎందుకంటే..?

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ నెల 22న ఛత్తీస్‌ గఢ్‌ కు ‌వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయితో సమావేశం కానున్నారు. సమ్మక్క సారక్క సాగర్‌ ప్రాజెక్టుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నీటిపారుదల ప్రణాళికతోపాటు పలు అంశాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్ర జలవనరుల సంఘం (CWC) 23న తెలంగాణ అధికారులతో సమావేశం కానుంది. ఈలోగా NOC తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.   చత్తీస్…

AP

ఏపీలో నో ప్లాస్టిక్..! సర్కార్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌ ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టేందుకు త్వరలోనే పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించబోతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి శాసనసభలో అడిగిన ప్రశ్నకు ఆయన కీలక సమాధానం చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, గ్రౌండ్ లెవల్ లో అది సరిగా అమలు కావడం లేదన్నారు.   ప్లాస్టిక్…

CINEMA

పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్..! ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా నుంచి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 21వ తేదీన ఉదయం 10:08 గంటలకు ‘ఓజీ’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.   ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానుల సందడి…