ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన..!
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాదులోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మావిగన్’ వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని, ప్రముఖ పాత్రికేయుడు రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో…

