News

National

మా బంధం దౌత్యానికి మించినది.. సింగపూర్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు..

భారత్, సింగపూర్ మధ్య సంబంధాలు కేవలం దౌత్యపరమైన అంశాలకే పరిమితం కాదని, ఇరు దేశాల భాగస్వామ్యం సాంప్రదాయ రంగాలను దాటి అత్యాధునిక సాంకేతిక రంగాల వైపు శరవేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో కలిసి గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా, శాంతి, శ్రేయస్సు అనే ఉమ్మడి దార్శనికతతో ముందుకు సాగుతున్నాయని మోదీ అన్నారు.  …

TELANGANA

కవిత అబద్ధం చెప్పారు… హరీశ్ వల్ల కాదు, కేసీఆర్ వల్లే బీఆర్ఎస్‌ను వీడా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి..

బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలు బయటకు వెళ్లిపోవడానికి మాజీ మంత్రి హరీశ్ రావు కారణమంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత ఆరోపణల్లో వాస్తవం లేదని, తాను బీఆర్ఎస్‌ను వీడటానికి కేసీఆర్, కేటీఆరే కారణమని ఆయన స్పష్టం చేశారు. హరీశ్ రావు వల్ల తాను పార్టీని వీడలేదని తేల్చి చెప్పారు.   “కేసీఆర్, కేటీఆర్ అహంకారం, వారి…

TELANGANA

కలెక్టరేట్‌లో కలకలం.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన అధికారిణి..

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో ఒక మహిళా అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా మత్స్యశాఖ అధికారిణి (డీఎఫ్‌ఓ)గా పనిచేస్తున్న ఎం. చరితారెడ్డి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.   ఒక వ్యక్తి తన మత్స్యకార సహకార సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు అనుమతి కోసం డీఎఫ్‌ఓ చరితారెడ్డిని సంప్రదించారు. అయితే,…

AP

ఏపీలో డిస్నీ వరల్డ్ సిటీ ఏర్పాటు..! ఎక్కడంటే..?

అమెరికా నుంచి నేరుగా మన దగ్గరికి వస్తే.. ఎలా ఉంటుందో ఊహించారా? కలల్లో మాత్రమే అనిపించే ఆ డిస్నీ వరల్డ్ ఇప్పుడు మన ఆంధ్రాలో అడుగుపెట్టబోతుందట. పిల్లల నుంచి పెద్దలవరకు అందరినీ ఆకట్టుకునే ఈ మ్యాజిక్ సిటీ ప్రాజెక్ట్ ఏపీలో ఓ కొత్త యుగానికి నాంది పలకనుంది. పర్యాటక రంగానికి ఇది గేమ్ చేంజర్ అవుతుందని చెబుతున్నారు.   ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన సృజనాత్మక ఆలోచనలతో చర్చల్లో నిలిచారు. రాష్ట్ర అభివృద్ధి,…

AP

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య భద్రత పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..! 25 లక్షల వరకు ఉచిత వైద్యం..!

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య భద్రత దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.   ‘ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం కింద ఈ కొత్త విధానాన్ని…

AP

ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై వేటు..!

దేవాదాయ శాఖలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సహాయ కమిషనర్ (ఏసీ) కె. శాంతిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఆమెపై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో నిర్బంధ ఉద్యోగ విరమణ (కంపల్సరీ రిటైర్మెంట్) చేయించాలని శాఖాపరంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి.గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు కె. శాంతి ఇటీవల వివరణ సమర్పించారు. అయితే, ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా…

TELANGANA

కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నాయి..!:కేటీఆర్..

కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో కేటీఆర్ సమక్షంలో పినపాక నియోజకవర్గం, మణుగూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ప్రభాకర్ రావు, ఆయన అనుచరులు బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ 21 నెలల పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అన్నారు.   ప్రతి రైతూ అప్పటి రోజులే బాగుండేవని చెబుతున్నారని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల…

National

జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ.. ఏవి చౌక? ఏవి ప్రియం?.

పండగ సీజన్ సమీపిస్తున్న వేళ వినియోగదారులకు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు జరుగుతున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పినట్లుగా, ఈసారి ‘దీపావళి గిఫ్ట్’ రూపంలో పన్నుల తగ్గింపు ఉండవచ్చని మార్కెట్ వర్గాల్లో బలమైన అంచనాలు నెలకొన్నాయి.   ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శాతం…

TELANGANA

బీఆర్ఎస్ కు ఎక్స్ వేదికగా కవిత కౌంటర్..

మాజీ మంత్రి హరీశ్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్ ఇచ్చింది. నిజం మాట్లాడినందుకు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తే.. తెలంగాణ ప్రజల కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువైనా భరిస్తా అని ఆమె ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘సత్యమేవ జయతే… జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.   బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత…

AP

వైసీపీ ఫేక్ పార్టీ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

వైసీపీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, నేరాలను నమ్ముకుని కేవలం విషప్రచారంతోనే మనుగడ సాగిస్తోందని ధ్వజమెత్తారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలను, ఎందరో నాయకులను చూశానని, కానీ ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం అబద్ధాలు ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, నేరాలను నమ్ముకున్న పార్టీ అని, అందుకే ఆ పార్టీని తాను ‘విషవృక్షం’ అని పిలుస్తానని…