News

TELANGANA

పోలీసులకు సెర్చ్ వారెంట్లు ఇచ్చే అధికారం ఎక్కడిది? – తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో పోలీస్ అధికారులు తమంతట తాముగా సెర్చ్ వారెంట్లు జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీపి (ACP), కమిషనర్ స్థాయి అధికారులు వారెంట్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అస్సలు పోలీసులకు సెర్చ్ వారెంట్లు ఇచ్చే అధికారం ఎక్కడిదని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. పిటిషనర్ విజయగోపాల్ వాదనలు వినిపిస్తూ.. కేవలం…

TELANGANA

దేవుడి మీద ఒట్టు.. తెలంగాణకు అన్యాయం జరగనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు మరియు కృష్ణా జలాల పంపకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలే తనకు అత్యంత ప్రాధాన్యత అని, తన ప్రాంత హితం కోసమే గతంలో పార్టీని వీడానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా తాను ఎన్నడూ వ్యవహరించబోనని, ఒకవేళ అన్యాయం జరిగే పరిస్థితి వస్తే పదవి కంటే తెలంగాణే ముఖ్యమని స్పష్టం చేస్తూ “దేవుడి మీద ఒట్టు” వేసి తన కమిట్‌మెంట్‌ను…

AP

యువతి మిస్సింగ్, కేసు నమోదు…

యువతి మిస్సింగ్, కేసు నమోదు… కదిరి టౌన్ అమీన్ నగర్ నందు కాపురం ముందు షేక్ మహబూబ్ జాన్ వయస్సు 40 సంవత్సరాలు, భర్త షేక్ మసూద్ అను ఆమె కూతురు షేక్ అప్స, వయస్సు 19 సంవత్సరాలు, ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో తాను మెడికల్ షాపుకు మందులు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో , తన కూతురు ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిందని, అయితే తన కూతురు కనిపించకపోవడానికి కారణము నల్లచెరువు మండలం…

AP

కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల గైర్హాజరు: గంటల తరబడి రోగుల నిరీక్షణ

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శనివారం ఉదయం 11:20 గంటలు దాటినా సంబంధిత విభాగానికి చెందిన డాక్టర్లు ఎవరూ విధులకు హాజరుకాకపోవడం పట్ల రోగులు మరియు వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఓపి (OP) నమోదు చేసుకున్న పేషెంట్లు డాక్టర్ల కోసం గంటల తరబడి ఆసుపత్రి ఆవరణలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన…

AP

కుల గణన వివరాలు బహిర్గతం చేయాలి: అగ్రకుల మీడియాపై బీఎస్పీ నేత గోవిందు ధ్వజం

బీహార్ రాష్ట్రంలో జరగని గొడవలు, తెలంగాణ, ఏపీలో మాత్రమే జరుగుతాయా? రాధాకృష్ణ గారు: బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు. ——————————————— 3.1.2026న శ్రీసత్యసాయి జిల్లా, కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు గారి అధ్యక్షతన “క్రాంతి జ్యోతి, చదువుల తల్లి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే (3.1.1831-10.3.1897) గారి196వ జయంతి” సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల సమర్పించి ఘనంగా జయంతి వేడుకలను…

CINEMA

శ్రీవారి సేవలో ‘అన్నమయ్య’ వేంకటేశ్వరుడు: తిరుమలలో నటుడు సుమన్ సందడి.. ఫోటోలు వైరల్!

ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. సుమన్‌ను చూడగానే భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు, దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దర్శనానంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోసం…

AP

వల్లభనేని వంశీకి హైకోర్టులో భారీ ఊరట: అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు.. హత్యాయత్నం కేసులో ఊపిరి పీల్చుకున్న మాజీ ఎమ్మెల్యే!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. విజయవాడలోని మాచవరం పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వంశీని ప్రస్తుతం అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను వెకేషన్ బెంచ్‌కు వాయిదా వేసింది. ఈ వివాదం నూతక్కి సునీల్ అనే…

National

వైద్యరంగం తలదించుకునే ఘోరం: కడుపులో కత్తెరకు మహిళ బలి.. 18 నెలల నరకం తర్వాత విషాదాంతం!

వైద్యం చేసి ప్రాణాలు కాపాడాల్సిన చేతులే అజాగ్రత్తతో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బీహార్‌లోని మోతిహారీ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 18 నెలల క్రితం ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఉషాదేవి (25) అనే మహిళకు వైద్యులు సిజేరియన్ చేశారు. ఆ సమయంలో శస్త్రచికిత్సకు వాడిన 12 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను పొరపాటున ఆమె కడుపులోనే మరిచిపోయి కుట్లు వేశారు. ఆ అజాగ్రత్తే ఆ తల్లి పాలిట కాలపాశంగా మారింది.…

AP

రైతులకు చంద్రబాబు నూతన సంవత్సర కానుక: కొత్త పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభం.. భూ వివాదాల రహిత రాష్ట్రమే లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నూతన సంవత్సర కానుకగా కొత్త పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భూమే ప్రాణంగా జీవించే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన, మంత్రులు మరియు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ పథకం పురోగతిపై సమీక్షించారు. ప్రజలకు భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే మన ప్రథమ కర్తవ్యమని ఆయన…

AP

కదిరిలో గంజా బ్యాచ్ పై ఉక్కు పాపం మోపుతున్న పోలీసులు…

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో గంజాయి బ్యాచ్ తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చిన కదిరి పోలీసులు కదిరి పట్టణంలో నడిరోడ్డుపై నడిపిస్తూ స్టేషన్ తీసుకెళ్లిన పోలీసులు గంజాయి కేసులో పలుమార్లు అరెస్టు చేసినప్పటికీ బెయిల్ పై వచ్చి తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్న గంజాయి బ్యాచ్ గంజాయి వృత్తిని మానుకోవాలని పోలీసులు పలుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ గంజాయి వేపాలని కొనసాగిస్తున్న వారిపై పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు కదిరి పట్టణంలోని జడలయ్య కాలనీ చిన్న…