News

TELANGANA

రంగరాజన్ దాడి కేసు, కీలక నిందితుడు అరెస్ట్, మరికొందరి కోసం గాలింపు..

తెలంగాణలో వీసాల వెంకన్నగా గుర్తింపు పొందింది ప్రముఖ ఆలయం చిలుకూరు బాలాజీ స్వామి. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన్ని కోర్టులో హాజరు పరిచారు మొయినాబాద్ పోలీసులు. వీర రాఘవ‌రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అక్కడి నుంచి వీర రాఘవ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.   ఇదిలావుండగా వీర రాఘవరెడ్డి…

TELANGANA

దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం – కేంద్రంపై అంతా కలిసి పోరాడాలి..

మెరుగైన కుటుంబ నియంత్రణ విధానాలను అవలభిస్తున్నందుకు దక్షిణాధి రాష్ట్రాలను శిక్షిస్తారా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక అంటూ మాట్లాడుతున్న మోదీ.. ఒకే వ్య‌క్తి – ఒకే పార్టీ అనే రహస్య అజెండాతో పని చేస్తున్నారని విమర్శించారు. మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి ఆధ్వర్యంలో కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్…

National

మెజారిటీ మార్క్ దాటేసిన బీజేపీ.. ఎర్రకోటపై కాషాయం జెండా..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయి మెజారీటీని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 36 గా ఉంది. బీజేపీ ఇప్పటికే 48 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ దేశరాజధానిలో కాషాయం జెండా ఎగురవేయనున్నట్లు తెలుస్తోంది.   2020 ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమిత మైంది. ఈ…

CINEMA

‘ఆర్‌సీ 16’ సినిమా క‌థ ఇదేనా..?

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ‘ఆర్‌సీ 16’ (వ‌ర్కింగ్ టైటిల్‌). ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. చ‌ర‌ణ్‌తో పాటు చిత్రంలోని ఇత‌ర ప్ర‌ధాన తారా‌గ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్నారు.   అయితే, ఈ చిత్రం క‌థ ఇదేనంటూ ఇప్ప‌టికే నెట్టింట ఊహ‌గానాలతో కూడిన‌ ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ సినిమాను కోడి రామ్మూర్తి జీవిత క‌థ ఆధారంగా తీస్తున్నార‌ని తొలుత ప్ర‌చారం కూడా…

National

ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై కేటీఆర్ సెటైర్..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టారు. ‘బీజేపీని మరోసారి గెలిపిస్తున్నందుకు రాహుల్ గాంధీకి అభినందనలు’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి 2024 లో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను కేటీఆర్ జతచేశారు.…

NationalTechnology

స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరో ముప్పు.. మరో కొత్త మాల్వేర్..?

స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరో ముప్పు వచ్చి పడిందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా స్పార్క్ క్యాట్ అనే వైరస్ స్మార్ట్ ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని కాజేస్తోందని, తద్వారా తీవ్ర నష్టం కలుగజేస్తోందని అంటున్నారు.   ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘కాస్పర్ స్కై’ చెబుతున్న వివరాల ప్రకారం… ఈ స్పార్క్ క్యాట్ వైరస్ మాల్వేర్ రకానికి చెందినది. ఇప్పటికే దీన్ని 28 యాప్ లలో గుర్తించారు. వీటిలో 10 ఆండ్రాయిడ్ యాప్ లు కాగా,…

AP

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైన విషయం విదితమే. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఈసారి అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన సభ్యుల సంఖ్య అధికంగా ఉండటంతో వీరికి అవగాహన తరగతులను నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు.   అసెంబ్లీ సమావేశాలకు ముందుగా ఈ నెల 22, 23…

AP

గృహ హింస కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు..

గృహ హింస కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులందరినీ భాగస్వామ్యం చేయడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి కేసుల్లో నిందితుడి కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని ఇరికించాలనే ధోరణి పెరుగుతోందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తనకు అండగా నిలవలేదనో, భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా చూస్తూ ఉన్నారన్న కోపంతోనో ఇలాంటి కేసుల్లో వారిని కూడా ఇరికిస్తున్నారని గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.…

AP

విశాఖ ప్రధాన కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..

శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో విశాఖ రైల్వే జోన్‌కు ఆమోదం లభించింది. విశాఖ రైల్వే జోన్ పరిధికి ఆమోదం తెలుపుతూ, విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు వాల్తేర్ డివిజన్‌గా ఉన్న దానిని విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.   దీంతో విభజన చట్టంలో ఉన్న ఒక ప్రధాన హామీ నెరవేరినట్లయింది. నూతనంగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి, దానిని…

TELANGANA

ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ..!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భారీ ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి భోజనం చేయకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని ముట్టించారు.   పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిలబస్ పూర్తవకుండానే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల వాయిదాపై యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో మాట్లాడినా…