News

National

సింధూ జలాల కోసం పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి.. భారత్‌కు వరుస లేఖలు..!

సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ పాకిస్థాన్ ఇప్పటివరకు నాలుగు సార్లు భారత్‌కు లేఖలు రాసింది. మే నెల ఆరంభంలో ఒక లేఖ పంపగా, ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం మరో మూడు లేఖలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ లేఖలు పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు అందినట్లు సమాచారం.   సింధూ నదీ జలాలను నిలిపివేస్తే…

AP

ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. శుక్రవారం నాడు సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన అజెండాగా ఈ భేటీ సాగింది.   ఈ సందర్భంగా, 8 జిల్లాలను కలుపుతూ విశాఖపట్నం కేంద్రంగా…

National

బంగ్లాదేశ్ చొరబాటుదారుల చేతికి చిక్కిన భారత సైనికుడు..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు దుండగులు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్‌ను అపహరించి, కొన్ని గంటల పాటు బందీగా ఉంచుకున్నారు. బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో చర్చలు జరపడంతో ఆ జవాన్ సురక్షితంగా విడుదలయ్యాడు.   అసలేం జరిగింది? అధికారిక వర్గాల సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా పరిధిలో ఈ ఘటన…

AP

టీడీపీలోకి అవంతి రీఎంట్రీ..?

ఒక్కటేంటే ఒక్క ఘటన రాజకీయ నాయకుల తలరాతలను మార్చేస్తుంది. రాజకీయాల్లో ఒక్కోసారి తప్పు చేసినా చేయకపోయినా రాజకీయ పార్టీల్లో నెగిటివ్ టాక్ వస్తే దాని ప్రభావం పొలిటికల్ కెరీయర్‌పై రిఫ్టెక్ల్ అవుతుంది. అయితే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంలో పడిన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కొత్త ఆశలు చిగురింప చేస్తోందంట. టీడీపీలో తిరిగి జాయిన్ అవ్వడానికి దారులు మూసుకుపోయాయి అనుకుంటున్న తరుణంలో ఆయనకు అధిష్టానం డోర్లు తెరవడానికి సిద్దమైందంట. నాయకులకు అగ్ని…

APTELANGANA

కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో కొత్త కోణం..!

కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో ఏపీకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు.  తిరుపతిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గుణశేఖర్ ఒకరు. మరొకరు హెడ్‌కానిస్టేబుల్ రామచంద్ర. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు మూడురోజులుగా గాలింపు చేపట్టాయి. అరెస్టయిన వీరిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వీరిని తీసుకొచ్చారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు. అయినా మూడో కంటికి దొరక్కకుండా ఈ వ్యాపారం సీక్రెట్‌గా సాగుతోంది. మాదక ద్రవ్యాలను నిరోధించాల్సిన పోలీసులు, వాటితో…

TELANGANA

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..

తెలంగాణ టెట్ – 2025 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజైంది. జూన్ 18 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రోజూ రెండు సెషన్ లలో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 9 నుంచి హాల్ టెకెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. ఈ సారి టెట్ ఎగ్జామ్ కు 1,83,653 మంది అభ్యర్థులు అప్లై…

AP

అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబుకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలంతో విమర్శించారు.   అంబటి రాంబాబు ప్రవర్తనపై ఒక పోలీస్ అధికారి తీవ్రంగా స్పందించారు. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ, వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో…

TELANGANA

బీజేపీకి రాజా సింగ్ గుడ్ బై..? కారణం అదేనా..?

క్రమశిక్షణకు మారుపేరైన ఆ పార్టీకి కొరకరాని కొయ్య ఆ నేత. తన మాటలతోనే మంటలను రాజేస్తూ.. సొంత పార్టీ నేతలనే ఉక్కిరి బిక్కిరి చేయడం ఆయనకే చెల్లింది. ఒకసారి మేకప్‌మెన్స్‌ అంటారు. మరోసారి కుర్చీలు తుడిస్తే పదవులు వస్తాయంటారు. మరోసారి తనకు వ్యతిరేకంగా దొంగలంతా ఏకమయ్యాయంటారు. ఇక ఈసారి మాత్రం మరో అడుగు ముందుకేసి సొంత పార్టీ నేతలను ఏకంగా ట్రాన్స్‌జెండర్లతో పోల్చేశారు. ఇలా చాన్స్ దొరికిన ప్రతిసారీ బీజేపీ దుమ్ము దులుపుతున్న ఆ నేత ఎవరు?…

National

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. తేదీలు ఖరారు చేసిన కేంద్రం..

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మొత్తం 23 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతుల వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.   ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం…

TELANGANA

రాజోలిలో ఇథనాల్ చిచ్చు.. రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత..

జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు బుధవారం ఆందోళనను ఉద్ధృతం చేసి, నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.   పెద్ద ధన్వాడ వద్ద గాయత్రి కంపెనీ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ పరిశ్రమ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.…