News

AP

ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ..!

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. ఈ మేరకు బిట్స్ పిలానీ ప్రతినిధులు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటైన బిట్స్ పిలానీ అమరావతిలో ఆధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.   ఈ ప్రాజెక్టు కోసం తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 70 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమికి సంబంధించిన…

AP

టీటీడీ కీలక నిర్ణయం..!

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. బయట మార్కెట్ ధరలతో పోలిస్తే టీటీడీ డాలర్ల ధరలు తక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎగబడటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విక్రయ కౌంటర్‌ను మూసివేశారు.   గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే, టీటీడీ నిబంధనల ప్రకారం డాలర్ల ధరలను వారానికి ఒకసారి…

National

ముడి చమురు రాజకీయం.. రష్యాకు భారత్ దూరం..!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ భారీ డిస్కౌంట్లకు రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై గతేడాది మార్చిలో భారీగా సుంకాలు విధించింది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడటంతో, న్యూఢిల్లీ ఇప్పుడు తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది.   గత జనవరిలో రోజుకు 12 లక్షల బారెళ్లుగా ఉన్న…

AP

కదిరిలో చిరుత కలకలం: కుమ్మరవాండ్లపల్లి శివారులో అడుగుజాడలు గుర్తింపు

కదిరి రూరల్,కుమ్మరవాండ్లపల్లి గ్రామ శివారులో గల SV constructions layout దగ్గర గల రాళ్లగుట్ట లో చిరుత సంచరిస్తుందని స్థానికుల సమాచారం ప్రకారం అటవీ శాఖ అధికారులు, చిరుత సంచరిస్తున్న ప్రదేశానికి వెళ్లి చూడగా చిరుత మరియు దాని పిల్లల యొక్క పాద ముద్రలు గమనించడం జరిగింది. గ్రామస్థులు చిరుత సంచరిస్తున్న ప్రదేశం లో పనులకు వెళ్లేటప్పుడు శబ్దం చేసుకుంటూ వెళ్ళాలని, ఒంటరిగా వెళ్లకూడదని, పిల్లలతో ఉన్న చిరుత తొ చాలా జాగ్రత్తగా ఉండాలని సమీప గ్రామస్థులకు,…

AP

ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు: కదిరి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక

గౌరవ జిల్లా కలెక్టరు మరియు గౌరవ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు కదిరి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర నాయక్ గారు కదిరి డివిజన్ పరిధిలో గల గైనకాలజీ సర్వీసెస్ గల వైద్యులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశం నందు ప్రభుత్వ నిబంధన మేరకు అన్ని వసతులు కలిగి ఉండాలని ప్రతి ఒక్క పేషెంట్ యొక్క వివరాలను నమోదు చేయాలని case sheets మైంటైన్ చేయాలని ధరల పట్టిక…

AP

మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన. పూల

ఈరోజు అనగా 30.01.26వ తేదీన కదిరిలోని మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి గారి స్వగృహం నందు గౌ” మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న *వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి గారు* అనంతరం నియోజకవర్గ ప్రస్తుత రాజకీయాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తల వెంకటరమణ గారు కూడా ఉన్నారు.

NationalSPORTS

భారత్-పాక్ మ్యాచ్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామ‌న్న శ్రీలంక‌..

టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ అనూహ్యంగా తొలగించింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. భద్రతా కారణాల రీత్యా తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చుతూ, ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.   భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ ప్రాథమిక దశలోని నాలుగు మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది. అయితే, భారత్‌లో భద్రతపై ఆందోళన…

AP

అరవ శ్రీధర్ మరొక కొత్త వీడియో..!

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ఏం జరుగుతోంది? ఆయనకు సంబంధించి రోజుకో కొత్త వీడియో వెలుగులోకి వస్తోందా? ఈ యవ్వారం వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారా? జరుగుతున్న పరిణామాలపై జనసేన పార్టీ ఏమంటోంది? ఇంతకీ కొత్త వీడియోలో వచ్చిన అసలు మేటరేంటి?   అరవ శ్రీధర్ మరొక కొత్త వీడియో   రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన్ని ఎవరో టార్గెట్ చేసినట్టు…

AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను టార్గెట్‌ చేశారు: చెవిరెడ్డి..!

మద్యం అక్రమాల కేసులో అరెస్టయిన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం రాత్రి ఆయన విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న వెంకటేశ్ నాయుడు (226 రోజుల తర్వాత), సజ్జల శ్రీధర్‌రెడ్డి (280 రోజుల తర్వాత) కూడా విడుదలయ్యారు.   జైలు నుంచి బయటకు రాగానే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్… కేసీఆర్ అభ్యర్థనకు అంగీకరించిన సిట్..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేనన్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థనకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అంగీకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం కేసీఆర్‌కు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే కేసీఆర్ లేవనెత్తిన పలు అంశాలపై సిట్ న్యాయ సలహా తీసుకోనుంది.   న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం తదుపరి తేదీ, విచారణ చేసే ప్రాంతాన్ని పేర్కొంటూ సిట్ మరోసారి నోటీసులు జారీ చేయనుంది.…