News

National

ఫాస్టాగ్ వన్ ఇయర్ పాస్… వివరాలు ఇవిగో..!

వాహనదారులకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక శుభవార్త అందించింది. టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ‘ఫాస్టాగ్ వార్షిక పాస్’ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పథకం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి పదేపదే రీఛార్జ్ చేసుకునే శ్రమను తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.   ఈ వార్షిక పాస్ ధరను రూ. 3,000గా నిర్ణయించారు.…

CINEMA

బిగ్ బాస్ సీజన్-9 ప్రోమో రిలీజ్..!

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ మళ్లీ వచ్చేస్తోంది. వరుసగా ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 9వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ సీజన్‌కు ‘డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. ఈసారి షో ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.   తాజాగా విడుదల చేసిన ప్రోమోలో…

AP

ఆగస్టు 15 నుంచి విజయవాడలో ‘యువ ఆంధ్ర ఛాంపియన్ షిప్’..

ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ అభిమానులకు శుభవార్త. రాష్ట్రంలోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ‘యువ ఆంధ్ర ఛాంపియన్‌షిప్ 2025’కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక తెలుగు కబడ్డీ లీగ్‌కు ముందు ఈ టోర్నమెంట్ ఒక ప్రవేశ ద్వారంలా పనిచేయనుంది.   ఆగస్టు 15వ తేదీ నుంచి విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో ఈ కబడ్డీ సమరం ప్రారంభం కానుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ…

National

భారత పర్యటనకు వస్తున్న పుతిన్..!

రష్యా నుంచి ముడిచమురు కొంటున్నారనే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఏదో ఒక విధంగా భారత్ ను రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకుండా చూడాలనే యోచనలో ట్రంప్ ఉన్నారు. అయితే, ఇవేవీ భారత్-రష్యా స్నేహ బంధంపై ప్రభావం చూపలేకపోయాయి. రష్యా అధినేత ట్రంప్ త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెల్లడించారు. ప్రస్తుతం దోవల్…

National

అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్ గా భారత్..

నాణ్యమైన వైద్య సేవలకు భారతదేశం ప్రపంచస్థాయి చిరునామాగా మారుతోంది. వైద్యం కోసం మన దేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్ వరకు) 1,31,856 మంది విదేశీయులు వైద్య చికిత్సల నిమిత్తం భారత్‌ను సందర్శించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గురువారం నాడు పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.   ఈ ఏడాది…

National

ఈసీ పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సంస్థగా కాకుండా, దాన్ని ఓ క్రమపద్ధతిలో కూల్చివేయడానికి సహకరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తారుమారు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.   ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా విశ్వసనీయతపై ఆయన తీవ్ర అనుమానాలు వ్యక్తం…

National

పద్మనాభస్వామి ఆలయం బి-నేలమాళిగపై ఉత్కంఠ.. పూజారిదే తుది నిర్ణయం..!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో అత్యంత రహస్యమైన ‘బి-నేలమాళిగ’ తెరిచే అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తెరపైకి వచ్చిన ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యతను ఆలయ తంత్రికే (ప్రధాన పూజారి) అప్పగించారు. దీంతో ఈ మిస్టరీ వీడుతుందా లేదా అనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది.   గురువారం తిరువనంతపురంలో ఆలయ పాలక మండలి, సలహా మండలి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…

National

అప్ప‌టివ‌ర‌కు భారత్‌తో చర్చల్లేవ్.. తేల్చిచెప్పిన ట్రంప్..

అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. భారత దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు జరిపేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, రైతుల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు తీవ్ర స్థాయికి చేరినట్లయింది.  …

TELANGANA

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ తో దాడి చేసిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే..!

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యక్రమం రసాభాసగా మారింది. రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఏకంగా అదనపు కలెక్టర్ చూస్తుండగానే ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యామ్‌నాయక్‌పై వాటర్ బాటిళ్లు విసిరే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ ఘటనతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.   వివరాల్లోకి వెళితే, జిల్లాలోని…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్..

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా? శుక్రవారం సిట్ ముందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరవుతున్నారా? ఆయన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వారిని విచారించిన కేసుకు ముగింపు ఇవ్వాలన్నది సిట్ అధికారుల ఆలోచనగా చెబుతున్నారు.   తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నత్తనడకగా సాగుతోంది. ఈ కేసు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి…