News

National

జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ.. ఏవి చౌక? ఏవి ప్రియం?.

పండగ సీజన్ సమీపిస్తున్న వేళ వినియోగదారులకు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు జరుగుతున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పినట్లుగా, ఈసారి ‘దీపావళి గిఫ్ట్’ రూపంలో పన్నుల తగ్గింపు ఉండవచ్చని మార్కెట్ వర్గాల్లో బలమైన అంచనాలు నెలకొన్నాయి.   ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శాతం…

TELANGANA

బీఆర్ఎస్ కు ఎక్స్ వేదికగా కవిత కౌంటర్..

మాజీ మంత్రి హరీశ్ రావుపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్ ఇచ్చింది. నిజం మాట్లాడినందుకు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తే.. తెలంగాణ ప్రజల కోసం ఇంతకు వందరెట్లు ఎక్కువైనా భరిస్తా అని ఆమె ఎక్స్ వేదికగా బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘సత్యమేవ జయతే… జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.   బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత…

AP

వైసీపీ ఫేక్ పార్టీ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

వైసీపీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, నేరాలను నమ్ముకుని కేవలం విషప్రచారంతోనే మనుగడ సాగిస్తోందని ధ్వజమెత్తారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలను, ఎందరో నాయకులను చూశానని, కానీ ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం అబద్ధాలు ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, నేరాలను నమ్ముకున్న పార్టీ అని, అందుకే ఆ పార్టీని తాను ‘విషవృక్షం’ అని పిలుస్తానని…

AP

ఏపీ టూరిజంపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త రూపునిచ్చి, ప్రపంచ పటంలో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, అనంతపురంలో ప్రపంచ ప్రఖ్యాత ‘డిస్నీ వరల్డ్ సిటీ’ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు కేవలం…

National

సాంకేతిక రంగంలో భారత్ మరో భారీ ముందడుగు..! భారత్‌లో తొలి స్వదేశీ మైక్రోచిప్..

సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘విక్రమ్ 3201’ అనే 32-బిట్ మైక్రోప్రాసెసర్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.   ఢిల్లీలో జరిగిన సెమీకండక్టర్ పరిశ్రమల సమావేశంలో ఈ చిప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు.…

AP

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి సుగాలి ప్రీతి కేసు..

2017లో తెలుగు రాష్ట్రాల్లో సంచలం రేపిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి ఇచ్చినా దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే ప్రీతి కుటుంబానికి న్యాయం…

TELANGANA

గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు..! బెండాలపాడులో చారిత్రక ఘట్టం..! ప్రారంభించనున్న సీఎం రేవంత్..

ఏళ్ల తరబడి గుడిసెల్లోనే గడిపిన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన బెండాలపాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వేదిక కానుంది . ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది.   సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:20 గంటలకు హెలికాప్టర్‌లో బెండాలపాడుకు చేరుకుంటారు. గ్రామంలోని లబ్ధిదారులైన బచ్చల నర్సమ్మ, బచ్చల…

TELANGANA

వామనరావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు.. రంగంలోకి దిగిన సీబీఐ..!

తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారికంగా స్వీకరించింది. ఈ మేరకు ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.   సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లను నిందితులుగా…

AP

ఏపీలో విద్యుత్ ప్రమాదాల నివారణకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు..

విద్యుత్ ప్రమాదాల శాశ్వత నివారణే లక్ష్యంగా ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు పనిచేయాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.   మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా కొందరు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.…

TELANGANA

కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న కవిత..!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కవిత సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆమె దాదాపుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.   బీఆర్ఎస్ పార్టీ తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయకముందే, తానే స్వయంగా ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని కవిత యోచిస్తున్నారని ఆమె సన్నిహిత వర్గాలు…