బీహార్ ఎన్డీయే విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం ముంగిట నిలబడడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు బీజేపీ మరియు జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన లేదా ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయానికి ప్రధాన కారణం, కూటమి అందిస్తున్న ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న నిరంతర విశ్వాసం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత భారత్’ దార్శనికత…

