AP

AP

ఆక్వా రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షలాది రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల్ని భారీగా పెంచేసిన నేపథ్యంలో ఎగుమతులు జరగక ఇబ్బందులు పడుతున్న వేళ రొయ్యల రైతులు అడిగిన ఓ డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో రాష్ట్రంలో రొయ్యల తయారీ రైతులకు ఊరట దక్కబోతోంది. ఈ మేరకు రొయ్యల మేత తయారీ దారుల నుంచి ప్రకటన వెలువడింది.   రాష్ట్రంలో ఓవైపు అమెరికాకు ఎగుమతులు ఆగిపోయి రొయ్యల…

AP

వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా పట్టా రిజిస్ట్రేషన్: మంత్రి నారా లోకేశ్..

వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. నేడు మొత్తం 1030 పేద…

APNational

ఇన్ స్టా ప్రేమాయణం..! అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. !

అమ్మాయిదేమో అమెరికా.. అబ్బాయి ఉండేదేమో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఇద్దరి మధ్యా వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని ఇన్ స్టాగ్రామ్ చెరిపేసి ఆ ఇద్దరినీ కలిపింది. హాయ్ అనే మెసేజ్ తో మొదలైన పరిచయం పెళ్లి పీటల వరకూ చేరుకుంది. 14 నెలల పాటు ఆన్ లైన్ లోనే ప్రేమించేసుకున్న ఈ జంట త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. పెళ్లి కోసం తల్లితో కలిసి ఆ యువతి అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చింది. ప్రస్తుతం…

AP

పురందేశ్వరికి కొత్త బాధ్యతలు..! మోదీ మార్క్ రాజకీయం..!

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కూటమిలో మూడు పార్టీలు భాగస్వాములుగా కొనసా గుతూనే.. సొంతగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వరుసగా మూడో సారి కేంద్రం లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఈ సారి దక్షిణాది పైన ప్రత్యేకంగా గురి పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా తెలుగు వ్యక్తి కి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో వైపు…

AP

విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై కీలక అప్డేట్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ విజయవాడకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన రెండు మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరంలో ఏలూరు, బందర్ రోడ్డుల వైపు సేకరించాల్సిన భూమిని అధికారులు గుర్తించారు. దీంతో త్వరలో ఈ భూసేకరణ ప్రారంభం కాబోతోంది.   విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టును రెండు…

AP

హోంవర్క్ చేయలేదని విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్..

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదని ముగ్గురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టారు. స్థానిక జీనియస్ పాఠశాలలో జరిగిందీ ఘటన. రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయురాలు అనిత వారిని చెప్పుతో కొట్టారు. విషయం తెలిసిన బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని అనితను ప్రశ్నిస్తూ దాడి చేశారు.   విద్యార్థులను చెప్పుతో కొట్టడం ఏమిటని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో…

AP

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! ప్రతి నియోజకవర్గంలోనూ వంద పడకల ఆసుపత్రి..

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 100 పడకలకు పైగా సామర్థ్యం ఉన్న ఆస్పత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం…

AP

నూతన మైనింగ్ పాలసీతో సమస్యలకు చెక్: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర..

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మైనింగ్ పాలసీతో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గొల్లపల్లిలో బిల్డింగ్ మెటీరియల్ సెజ్‌లో రవీంద్ర పర్యటించారు. గ్రానైట్ కటింగ్, క్వార్జ్ నుంచి భవన సామాగ్రి తయారీ యూనిట్లను ఆయన స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.   ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో 1,500 పైగా మైనింగ్ సంస్థలు ఉన్నాయన్నారు. ఒంగోలు సెజ్‌లో వందకు పైగా ప్లాంట్లు వస్తున్నాయని చెప్పారు. ప్రాసెసింగ్…

AP

ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం..! ఏ బ్లాక్‌లో ఘటన జరిగిందంటే..?

ఏపీ రాజధాని అమరావతిలో ఏం జరిగింది? జరుగుతోంది? సచివాలయంలో అగ్నిప్రమాదం వెనుక కారణమేంటి? ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? కేవలం రెండో బ్లాక్‌లో మంటలు ఎగిసిపడడంపై పాత్ర సూత్రదారులు ఎవరైనా ఉన్నారా? ఇది ప్రమాదమా? లేదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో విచారణ మొదలైపోయింది.   ఏ బ్లాక్‌లో ఘటన జరిగింది?   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే…

AP

ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ సంస్థ ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను అమరావతికి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు. భారతదేశం ఏఐకి త్వరగా అలవాటుపడిందని, భారతీయుల సృజనాత్మకత అద్భుతమని ఆల్ట్‌మన్ చేసిన ట్వీట్ కు చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆయనను ఏపీకి ఆహ్వానించారు.   ఏఐలో భారత్ దూసుకుపోతోందని శామ్ ఆల్ట్ మన్ చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్…