AP

AP

ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం..

బెట్టింగ్ యాప్ లు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. వీటి బారిన పడిన ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యాప్ లను సినీ నటులు, యూట్యూబర్లు, క్రీడాకారులు ప్రమోట్ చేస్తుండటంతో… ఎంతోమంది వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారి బెట్టింగ్ వలలో పడ్డారంటే… ఇక బయట పడటం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం కలకలం రేపుతోంది. ఈ యాప్ లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు కేసులు ఎదుర్కొంటున్నారు.   తాజా పరిణామాల…

AP

నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు సమావేశం జరగనుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ల సమావేశంలో సీసీఎల్ఏ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.   తొలి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…

AP

ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ ఎంపీ..

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించిపోయిందని, దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరపాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు.   లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతేనని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.99 వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని, అందులో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం…

AP

ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏప్రిల్ 3న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలను మార్చి 27వ తేదీలోగా పంపాలని వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదేశాలు జారీ చేశారు.   ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే…

AP

డీలిమిటేషన్ కు మేం వ్యతిరేకం… దక్షిణాది రాష్ట్రాలకు విలువలేకుండా పోతుంది: కేటీఆర్..

డీలిమిటేషన్ పై కాసేపట్లో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభంకానుంది. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్ లో ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్… బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. వీరంతా…

AP

ప్రధాని మోదీకి జగన్ లేఖ..

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ కారణంగా పార్టమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుందని… అందుకే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరుతున్నామని…

AP

ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య కీలక ఒప్పందం..

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌ను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. 40 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్, సంక్షేమం కోసమై గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించారు.   చంద్రబాబు ఉంటే టెక్నాలజీ గురించి మాట్లాడకుండా ఉంటారా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ సాంకేతిక వినియోగంపై ఆలోచనలు పంచుకున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో టెక్నాలజీ వాడకంపై గేట్స్, బాబుల మధ్య చర్చ జరిగింది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 పై బిల్ గేట్స్‌కు తన…

AP

ఏపీకి ప్రభుత్వానికి కొత్త సలహాదారులు..

ఏపీలో కూటమి సర్కార్ ప్రభుత్వానికి కొత్తగా సలహాదారులను నియమించింది. వైసీపీ మాదిరిగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఎంపిక జాగ్రత్త వహించారు. ఎంపికైనవారు ఉన్నత రంగాలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులు. ప్రభుత్వం సైతం ఆయా రంగాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో వారి ఎంపిక ప్రభుత్వానికి తేలికైందని ప్రభుత్వ వర్గాల మాట.   కూటమి సర్కార్ కీలకమైన సలహాదారులు   వైసీపీ ప్రభుత్వంలో సలహాదారులకు కొదవలేదు. ప్రతీ శాఖకు, అలాగే ప్రభుత్వానికి దాదాపు 90…

APNationalTELANGANA

ప్రాజెక్టులపై తెలంగాణ పిటిషన్.. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు..

కృష్ణా నదీ ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్లు దాఖలైన వారం రోజుల్లో రిజాయిండర్ ఫైల్ చేయాలని కూడా ఆదేశించింది.   కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం…

AP

మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు..

కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సీఐడీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయసాయిని సీఐడీ అధికారులు ఓసారి ప్రశ్నించారు. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు పంపించారు. మార్చి 25న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మంగళగిరి సీఐడీ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.   గత బుధవారం నాడు విజయసాయిరెడ్డిని బెజవాడ సీఐడీ కార్యాలయంలో దాదాపు 5 గంటల పాటు…