AP

AP

పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో కలకలం: లోపలికి చొరబడి కాన్వాయ్ వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తి!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నీలాద్రి అనే వ్యక్తి ఆటోలో నేరుగా కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించాడు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి, అక్కడే ఉన్న కర్రతో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని రెండు వాహనాల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యాలయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల ప్రాథమిక…

AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఎమ్మెల్యే శ్రావణి మరియు ADCC బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి

*ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే, శ్రావణి గారు, ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు,* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, MS రాజు గారితో పాటు కలసిన ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు* నియోజకవర్గం లోని పలు అంశాలపై చర్చించారు.

AP

తమ్ముడూ.. నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా: నూతలపాటి నాగభూషణం మృతిపై నారా లోకేశ్ భావోద్వేగం

తెలుగుదేశం పార్టీ యువజన విభాగమైన ‘తెలుగు యువత’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం అకాల మరణం పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందడం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగభూషణంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ లోకేశ్ సామాజిక మాధ్యమాల్లో అత్యంత భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. “తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా…

AP

కోటపల్లిలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ: డాక్టర్ ధర్మరాజు ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యక్రమం

26-02-2026 తేదిన తనకల్ మండలం, కొక్కంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కోటపల్లి సచివాలయం పరోధిలో. వున్న C.G ప్రాజెక్ట్…పాఠశాలలో డాక్టర్ ధర్మ రాజు గారి ఆధ్వర్యంలో 40..మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధర్మరాజు గారు, MPHEO… వెంకటరమణ గారు,C.G.. ప్రాజెక్ట్ స్కూల్ S.O గారు, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ గణేష్ కుమార్ రెడ్డి, MLHP/CHO అయేషా,సచివాలయం ANM పద్మావతి.. KGBV స్కూల్, anms..మరియు ఆశా కార్యకర్తలు..పాల్గొన్నారు సార్.

AP

ఏపీకి భారీ వర్ష సూచన: ఐఎండీ పిడుగుల హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) మరియు రాష్ట్ర వాతావరణ కేంద్రం ‘బిగ్ అలర్ట్’ జారీ చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరియు ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం..…

AP

గాయపడిన బిగ్ టీవీ రిపోర్టర్ చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన రామాంజి మరియు రాజేందర్ ప్రసాద్

తిరుపతిలో ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో బిగ్ టీవీ ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత ఆయన తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స (Surgery) చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన తన స్వగ్రామమైన చిన్నక్క గారి పల్లిలోని నివాసంలో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాక్షి టీవీ సీనియర్ రిపోర్టర్ రామాంజి మరియు వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన…

AP

వైఎస్సార్‌పై అనుచిత వ్యాఖ్యలు తొలగించండి: అసెంబ్లీ వేదికగా ఏపీ సర్కార్‌పై షర్మిల ఆగ్రహం

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పేరును ప్రస్తావించడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ చేసిన తప్పులను వైఎస్సార్‌కు ఆపాదించడం సరికాదని ఆమె హితవు పలికారు. అసెంబ్లీ రికార్డుల నుంచి ఆయనపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ, కూటమి ప్రభుత్వం ‘అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు’ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్…

AP

కదిరిలో వంద సౌర విద్యుత్ వ్యవస్థల స్థాపన పూర్తి: చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ మరియు రూ. 78,000 సబ్సిడీ జమ

**కదిరి, ఆంధ్రప్రదేశ్:** మన పట్టణంలో **PM సూర్య ఘర్ పథకం** కింద **100 సౌర విద్యుత్ వ్యవస్థల స్థాపన** విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా **Ahaskara** మరియు **LSgreensynce** సంస్థలు సామాజిక సేవ కార్యక్రమంగా కదిరిలోని రోడ్డుపై వ్యాపారం చేసే కార్ట్ వ్యాపారులకు **20 గొడుగులు** పంపిణీ చేశాయి. ఈ కార్యక్రమం సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా నిర్వహించబడింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రతిరోజూ పనిచేసే చిన్న వ్యాపారులకు సహాయం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ…

AP

త్రిశూలం ఆకారంలో ముల్లంగి.

అరుదైన ఆకృతిలో ముల్లంగి: అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కత్తివారిపల్లి గ్రామంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రైతు నాగభూషణ తన పొలంలో సాగు చేసిన ముల్లంగి పంటను తీస్తుండగా, ఒక ముల్లంగి వింత ఆకృతిలో కనిపించింది. సాధారణంగా పొడవుగా లేదా గుండ్రంగా ఉండే ముల్లంగికి భిన్నంగా, ఇది స్పష్టమైన త్రిశూలం ఆకారంలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తరలివచ్చిన గ్రామస్థులు: ఈ వింత ముల్లంగి వార్త దావాగ్నిలా గ్రామం మొత్తం వ్యాపించింది.…

AP

కదిరిలో నేరగాళ్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్: గజదొంగ పసుపులేటి సాయికి సంకెళ్లు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నేరాలకు పాల్పడాలంటే భయపడే విధంగా ముద్దాయిల పై కదిరి పోలీసుల ఉక్కు పాదం మోపారు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 28 కేసుల్లో ముద్దాయి అయినా తనకల్లు మండలం చెందిన పసుపులేటి సాయి అనే భయంకర నేరస్తుడిని తమదైన స్టైల్ లో నిందితుడు పసుపులేటి సాయికి కోటింగ్ ఇచ్చి చేతులకు బేడీలు వేసి మండే ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు ఆసక్తిగా తిలకించిన పట్టణ…