AP

AP

గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా..? వైసీపీకి పవన్ కల్యాణ్ వార్నింగ్..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ… గౌరవ గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబునాయుడు గారు ఎలా తట్టుకుని నిలబడగలిగారా? అని నిన్నటి ఘటన తర్వాత నాకనిపించింది…

AP

కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు..? మరి వర్మ..?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. అయిదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. కూటమిలోని మూడు పార్టీలకు ఈ అయిదు స్థానాల్లో ఎవరికి ఎలా అవకాశం ఇవ్వాలనే దాని పైన సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు టీడీపీకి దక్కనుండగా.. బీజేపీ – జనసేనకు చెరో స్థానం కేటాయించేలా నిర్ణయం జరిగింద ని సమాచారం. ఇక, అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి జాబితాలో అనూహ్య ఎంపిక ఉండే…

AP

టీడీపీకి బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన జీవీ రెడ్డి..

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదంటూ కూడా జీవీ రెడ్డి విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించడం విశేషం.   ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి జీవీ రెడ్డికి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్…

AP

ఏపీ మిర్చీ రైతులకు మోదీ గుడ్ న్యూస్..

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటనలో కీలక ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మిర్చి ధరలు, మిర్చి రైతుల సమస్యపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌కి విన్నవించారు. మిర్చి ధర పెంపుతో పాటు ఎగుమతుల విషయంలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. గత రెండు రోజుల క్రితం శివరాజ్ సింగ్ మిర్చిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ ఇంటర్వర్షన్ స్కీమ్ కింద మిర్చి రైతులను ఆదుకునే విషయంపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు…

AP

మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ : ఏపీ హోంమంత్రి అనిత..

మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హెల్ప్ డెస్కుల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు.   మార్చి 8న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మహిళల…

AP

చెత్త పన్నుకు ముగింపు పలికిన ఏపీ ప్రభుత్వం..

వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్త పన్నును ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ విడుదల చేసింది. ఏపీలో ఇకపై చెత్త పన్ను ఉండదు.   వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నును విధించినప్పటి నుంచి అప్పుడు విపక్షంలో ఉన్న నేతలు విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతం…

AP

ఏపీని జగన్ అప్పులకుప్పగా మార్చడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి: పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల నేతలు సమన్వయంతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.   వెన్ను నొప్పి కారణంగానే రాష్ట్రంలో తాను కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని తెలిపారు. తనకు ఇప్పటికీ వెన్ను నొప్పి బాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి…

AP

మిర్చి ధర పతనంపై కేంద్రంతో మాట్లాడా… ఆందోళన వద్దు: ఢిల్లీలో చంద్రబాబు..

మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధరలు తగ్గడంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ధరలు భారీగా పడిపోయాయన్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో రైతులకు మంచి ధర వచ్చిందన్నారు.   ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయాయని, మిర్చి రైతుల సమస్యలను కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన అన్నారు. కేంద్రమంత్రి పర్యటనలో ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…

AP

నంద్యాల్ టు విజయవాడ ఆర్టీసీ బస్సులో 13 తులాల బంగారం అపహరణ..

ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి ఫ్యామిలీ తిరుణాల నిమిత్తం అహోబిలం వెళ్లి తిరిగి వస్తుండగా గాజులపల్లి సమీపంలో విజయవాడ బస్సులో గిద్దలూరు వరకు ప్రయాణం చేస్తుండగా 13 తులాల బంగారం అపహరణ అయిందని బాధితులు తెలిపారు..   పూర్తి వివరాలు పోలీసు ల విచారణలో తెలియాల్సింది…….

AP

ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు..

అమరావతి : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డిఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా లోకేష్ చర్చించారు.