AP

AP

వైసీపీకి మరో షాక్..! సీమ నేత గుడ్‌బై ..

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు నాయకులు. పలు జిల్లాల్లో పార్టీ ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్‌బై చెబుతున్నారు. మాజీ మంత్రులు-ఎంపీలు- ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా బయటికెళ్తోన్నారు.   ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి రోజుల్లోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజీనామాల పర్వం…

AP

డెడ్ బాడీ పార్శిల్ కేసులో.. వెలుగులోకి సంచలన నిజాలు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరిగింది. సినిమాను తలపించే సస్పెన్స్, థ్రిల్లింగ్ ట్వి్స్టులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలోని తన వదినకు.. చెక్కపెట్టెలో డెడ్ బాడీ పార్శిల్ చేశాడు శ్రీధర్ వర్మ. ఆస్తి కోసమే వదిన తులసిని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.   భార్య రేవతి, ప్రియురాలు సుష్మతో కలిసి శ్రీధర్…

AP

ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్ దిశగా పాఠశాల విద్యలో సంస్కరణలు..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్‌ను తెచ్చేందుకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయగా, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రిక్రూట్‌మెంట్…

AP

జగన్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న వైసీపీ అధినేత..

క్రిస్మస్ వేడుకల కోసం పులివెందులకు వెళ్లిన జగన్ వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజల నుంచి ప్రస్తుతం జగన్ వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వినతుల స్వీకరణ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడే…

AP

వర్సిటీలకు వీసీల నియామకంపై దృష్టి సారించిన మంత్రి నారా లోకేశ్..

గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా తయారైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనివర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ మేరకు అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.   ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యావంతులను వైస్-చాన్స్ లర్లుగా నియమించేందుకు నోటిఫికేషన్లు ఇచ్చి, సెర్చి కమిటీలను ఏర్పాటు చేశారు. అంతేకాదు, సమర్థ్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అన్ని…

AP

నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు .. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక భేటీలు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఈరోజు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవ్వనున్నారు. అలాగే మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలు, ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు .. ఈ ఉదయం వాజ్‌పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు.   మధ్యాహ్నం 12.30…

AP

పేర్ని నానికి మరో షాక్-రేషన్ దందాపై సిట్ దర్యాప్తు..?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్ గా ఉంటూ దాదాపు 4 వేల టన్నుల బియ్యం మాయం చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్నినాని భార్య జయసుధతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఇప్పటికే విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు నిన్న వాళ్ల ఇంటికి వెళ్లి లుక్ అవుట్ నోటీసులు కూడా అంటించి వచ్చారు.   గతంలో రేషన్ డీలర్ గా…

AP

ఎస్సీ వర్గీకరణపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ కోటా వర్గీకరణ డిమాండ్ పై సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఏడాది కీలక తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వాలు ఇంకా తడబడుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు వంటి నేతలు కూడా తమ రాష్ట్రాల్లో ఇంకా సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం…

AP

ఉచిత బస్సు ప‌థ‌కం… ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..!

ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్‌డీఏ కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీలలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ ప‌థ‌కం ఒక‌టి. దాంతో ఈ స్కీమ్ అమ‌లు ఎప్పుడెప్పుడా అని మ‌హిళ‌లు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర‌ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.   ఈ ప‌థ‌కం అమ‌లు తీరుతెన్నుల ప‌రిశీల‌న‌కై ప్ర‌భుత్వం కేబినెట్ స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు మంత్రుల‌తో ఈ స‌బ్‌ క‌మిటీని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్త‌ర్వులు…

AP

తెనాలిలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి నాదెండ్ల..

క్రీడలను ప్రోత్సహిస్తూ తెనాలిలో సువిశాలమైన స్టేడియంను నిర్మించనున్నామని ఏపీ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 1.76 ఎకరాల మున్సిపల్ భూమిని సేకరించి రూ. 3 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అందులోనే వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.   పట్టణ అభివృద్ధి కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నామని తెలిపారు. ప్రధాన రహదారుల విస్తరణ, మెరుగైన వైద్య…