అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ: 2500 ఎకరాల్లో నిర్మాణం – రెండో దశ ల్యాండ్ పూలింగ్కు రైతుల మద్దతు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో, అమరావతిని గ్లోబల్ రాజధానిగా తీర్చిదిద్దడంలో భాగంగా 2,500 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ పల్నాడు జిల్లా యండ్రాయిలో రైతులతో సమావేశమైన సందర్భంగా వెల్లడించారు. ఈ భారీ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతం దశ…

