వైఎస్సార్పై అనుచిత వ్యాఖ్యలు తొలగించండి: అసెంబ్లీ వేదికగా ఏపీ సర్కార్పై షర్మిల ఆగ్రహం
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్) పేరును ప్రస్తావించడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ చేసిన తప్పులను వైఎస్సార్కు ఆపాదించడం సరికాదని ఆమె హితవు పలికారు. అసెంబ్లీ రికార్డుల నుంచి ఆయనపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ, కూటమి ప్రభుత్వం ‘అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు’ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్…

