AP

AP

వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..!

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోందంటూ ఆయన కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు. హత్యకేసులో కీలక నిందితులు తప్పించుకోవాలని చూస్తున్నారని, తమకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరిపై ఒత్తిడి తెచ్చారని అంటున్నారు. ఈ బెదిరింపులపై ఆమె చేసిన ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జైలులో దస్తగిరిని బెదిరించిన విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్…

AP

పీ4 కార్యక్రమంపై స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 (ప్రజా-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమంపై వస్తున్న కొన్ని కథనాల నేపథ్యంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు లేదా ప్రభుత్వ శాఖలకు ఎలాంటి కోటాలు విధించడం లేదని, ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు ఒక ప్రకటనలో తెలిపారు.   పీ4 కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన ఒక ప్రజా ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా…

AP

మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ ..! త్వరలో డీజీపీ చేతికి ‘ఆడుదాం ఆంధ్రా’ స్కామ్‌పై విజిలెన్స్ నివేదిక..

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ నివేదికను విజిలెన్స్ విభాగం అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు. వైసీపీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయి.   క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర…

AP

వీటిని ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉంది: జడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ స్పందన..

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విరుద్ధంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నారని, కుట్రలు, దాడులు, అబద్ధాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎన్నికలను హైజాక్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాలు, కొందరు అధికారులు, పోలీసులు కలిసి ఈ కుట్రను అమలు చేస్తున్నారని విమర్శించారు.   చంద్రబాబు కుట్రపూరిత ప్రణాళికలను అమలు చేస్తున్నారని మండపడ్డారు. “ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే…

AP

ఆగస్టు 15 నుంచి విజయవాడలో ‘యువ ఆంధ్ర ఛాంపియన్ షిప్’..

ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ అభిమానులకు శుభవార్త. రాష్ట్రంలోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ‘యువ ఆంధ్ర ఛాంపియన్‌షిప్ 2025’కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక తెలుగు కబడ్డీ లీగ్‌కు ముందు ఈ టోర్నమెంట్ ఒక ప్రవేశ ద్వారంలా పనిచేయనుంది.   ఆగస్టు 15వ తేదీ నుంచి విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో ఈ కబడ్డీ సమరం ప్రారంభం కానుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ…

AP

లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం..

ఏపీలో లిక్కర్ కేసు వ్యవహారంలో వెంకటేష్ నాయుడు చుట్టూ తిరుగుతోంది. ఆయన టీడీపీకి చెందిన నేత అంటూ వైసీపీ నేతలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన వైసీసీ నేత అంటూ కీలక విషయాలు బయటపెట్టింది టీడీపీ. తాజాగా విమానాల్లో నేతల జల్సాల గురించి బయటపెట్టారు ఆ పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి.   ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కొత్త కొత్త విషయాలు బయటపెట్టింది టీడీపీ. ఈ కేసులో వైసీపీ నేతలకు ప్రమేయముందని కుండబద్దలు కొట్టేశారు టీడీపీ…

AP

ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం….

ఏపీలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టినట్టు స్పష్టమవుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ భాగస్వామ్య సదస్సుకి ఏపీ సిద్ధమవుతోంది. విశాఖలో ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సు విజయవంతం కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం తాజాగా సమావేశమైంది. ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనే నినాదంతో పరిశ్రమలను ఆకర్షించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కొత్త పరిశ్రమలు రావడం ద్వారా, మరిన్ని పెట్టుబడులను తేవడం ద్వారా ఏపీలో ఉపాధి, ఆర్థిక…

AP

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది..!: మంత్రి లోకేష్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దీనికి నిదర్శనంగా జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయని రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు.   రాష్ట్రంలో 2017లో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నడూ లేనంతగా 2025 జూలై నెలలో రూ.3,803 కోట్లు వసూలైనట్లు లోకేశ్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే…

AP

కూటమి ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది..!: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పేట్రేగిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మద్యం వ్యాపారం, అక్రమ ఇసుక తవ్వకాలు, అమరావతి భూముల వ్యవహారాల్లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆయన మంగళవారం విమర్శించారు.   ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు ప్రమాదకర స్థాయికి చేరాయని అన్నారు. హైదరాబాద్,…

AP

కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం: పవన్ కల్యాణ్.

ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి రైతులను వేధిస్తున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన ‘ఆపరేషన్ కుంకీ’ విజయవంతమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం మొగిలి ప్రాంతంలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును.. శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు విజయవంతంగా అడవిలోకి తరిమికొట్టాయని వెల్లడించారు. ఈ ఆపరేషన్ సఫలం కావడంతో సరిహద్దు ప్రాంతాల రైతులకు భరోసా లభించినట్లయిందని పేర్కొన్నారు.…