AP

AP

జగన్‌కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీ నేతలు, కౌన్సిలర్లపై ప్రతిపక్షాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగానే నందిగామ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీ గూటికి చేరారు. కేశినేని చిన్ని సమక్షంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నపిఠాపురం నియోజకవర్గంలో 8 మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది.…

AP

జగన్ కామెంట్స్ కు సునీత కౌంటర్- మళ్లీ సానుభూతి డ్రామా-ఓటేయొద్దని పిలుపు..!

ఏపీలో ఎన్నికల వేళ మరోసారి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం తెరపైకి వస్తోంది. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా వివేకా హత్యను కొలిక్కి తీసుకురాలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం వైఎస్ జగన్ నిన్న ప్రొద్దుటూరులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యంగా వివేకా హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తూ వివేకా హంతకులు బయటే తిరుగుతున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.   జగన్ కామెంట్స్ పై ఇవాళ…

AP

ఏపీలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా విడుదల-సుజనాకు చోటు-సోముకు నిరాశ..!

ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ఇవాళ విడుదలైంది. ఇప్పటికే దీనిపై పలు దఫాలుగా కసరత్తు చేసిన అధిష్టానం పెద్దలు.. ఇవాళ సాయంత్రం 10 పేర్లలో లిస్ట్ విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఇందులో కీలకమైన పేర్లు ఉన్నాయి.   గతంలో ఎంపీ సీట్లకు పోటీ చేసిన పలువురికి ఈసారి అసెంబ్లీ జాబితాలో చోటు దక్కింది. అలాగే 11వ సీటును కూడా బీజేపీ తీసుకుంటుందని ప్రచారం జరిగినా అలాంటిదే లేదని…

AP

వివేకా హత్యపై మౌనం వీడిన జగన్..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కడప జిల్లా ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగుస్తుంది.   ఇడుపులపాయలో బస్సు యాత్రను ప్రారంభించిన అనంతరం కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల,…

AP

వైఎస్ జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు.   175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి ముహూర్తం సమీపించింది. బుధవారం మధ్యాహ్నం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇడుపులపాయలో…

AP

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి–:ఈసీ..

రాజకీయ పార్టీల ఇంటింటి ప్రచారానికీ అనుమతి తీసుకోవాల్సిందేనని ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్ Suvidha.eci.gov.in వినియోగించాలని సీఈవో తెలిపారు.   రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇంటింటి ప్రచారానికి, సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.   ఇక,…

AP

పురందేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ కలిశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పురంధేశ్వరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 35 డిమాండ్లతో కూడిన మెమోరాండంను పురందేశ్వరికి అందించారు. ఈ డిమాండ్లలో ఎస్సీ వర్గీకరణ కూడా ఉంది.   ఎస్సీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంద కృష్ణకు పురందేశ్వరి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కూడా కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు. ఏపీలో ఎన్డీయేకు పూర్తి స్థాయిలో మద్దతుగా…

AP

6 గ్యారంటీలు ప్రకటించిన పవన్ కల్యాణ్..

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ.. రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. కొన్ని సీట్లు మాత్రమే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.   కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయబోతోన్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. ఇక నియోజకవర్గంలో ప్రచారానికి సిద్ధపడుతున్నారు. ఈ నెల చివరివారంలో…

AP

ఏపీ లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు..

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కూటమిలో ఉన్న మూడు పార్టీల మధ్య సీట్ల ఖరారు పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇదే సమయంలో కొన్ని మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. బిజెపి తమ పార్టీ నుంచి పోటీ చేసే పదిమంది ఎమ్మెల్యేలు అభ్యర్థులను ఫైనల్ చేసింది. బిజెపి ఎంపిక చేసిన అభ్యర్థుల పైన కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   హోరా హోరీ పోరు : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా…

AP

18 మందితో జనసేన అభ్యర్థుల జాబితా.. పవన్ కళ్యాణ్ సహా నేతలకు టికెట్ ఖరారు..

పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా స్థానాలకు టికెట్లు ప్రకటించారు. అయితే, అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.   తాజాగా ప్రకటించిన జనసేన అసెంబ్లీ అభ్యర్థులు:   పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నెల్లిమర్ల నుంచి లోకం మాధవి…