AP

AP

జనసేనలో చేరుతున్నా.. పవన్ కళ్యాణ్‌పై బాలశౌరి ఆసక్తికర వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలోకి మరో సీనియర్ నేత చేరిక ఖాయమైంది. ఇటీవల అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి త్వరలో మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు.   అనంతరం బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు తెలిపారు. పవన్ తో వివిధ అంశాలపై రెండు గంటలపాటు చర్చించినట్లు…

APNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలనుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తాయని.. వీటిలో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్- అయోధ్య ప్రయాణ ఛార్జీ (స్లీపర్) రూ.1500 ఉంటుందని పేర్కొన్నారు.

APCINEMA

త్వరలో ప్రజా సేవలోకి ప్రభాస్ – ఎన్నికల్లో పోటీ, కృష్ణంరాజు సతీమణి క్లారిటీ..!!..

కృష్ణంరాజు కుటుంబానికి ఎంపీ సీటు ఆఫర్ వచ్చింది. మూడు పార్టీల నుంచి కృష్ణంరాజు సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ ఎంట్రీ గురించి కృష్ణంరాజు సతీమణి శ్యామల క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ భవిష్యత్ కార్యక్రమాల గురించి తేల్చి చెప్పారు. గోదావరి జిల్లాల ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేసారు. ప్రభాస్ సైతం ప్రజాసేవలోకి వస్తున్నారని శ్యామల కీలక వ్యాఖ్యలు చేసారు.   రెబల్ స్టార్ స్వర్గీయ కృష్ణంరాజు జయంతి కావటంతో కుటుంబ…

AP

జగన్ ట్రాప్ లో చంద్రబాబు – ఎన్నికల వేళ సెల్ఫ్ గోల్..!! .

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ తన పార్టీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసారు. టీడీపీ, జనసేన అభ్యర్దుల ఎంపిక పైన చర్చలు కొనసాగిస్తున్నాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ కొత్త అస్త్రాలను ప్రత్యర్ధి పార్టీలను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.   జగన్…

AP

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పై సుప్రీంలో తాజా అప్డేట్..!!..

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో 53 రోజులు రిమాండ్ ఎదుర్కొన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని పైన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు.   సుప్రీంలో విచారణ చంద్రబాబుకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో హైకోర్టు బెయిల్‌…

AP

వైసీపీ ఐదో జాబితా విడుదలకు కసరత్తు..

ఏపీలో వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఐదో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్ని పిలిపించి చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు.   ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నాలుగు జాబితాల్లో…

AP

ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో కీలక పరిణామం..!!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసులో సుప్రీంలో విచారణకు కేసు లిస్టు అయింది. తెలంగాణ హైకోర్టు మే 31న ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటీషన్ ఫిబ్రవరి 5న విచారణకు రానుంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు…

AP

జనసేనకు మరో ఎంపీ అభ్యర్ధి…

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే ఓవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలో చేరికలు పెరుగుతుండగా.. ఇవాళ ఓ కీలక నేత ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన.. జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.   టీడీపీతో పొత్తులో భాగంగా దాదాపు 40…

AP

ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ..

విజయవాడలో అంబేద్కర్ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు తన సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న, అంబేద్కర్ గారి మహా శిల్పం మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని కితాబిచ్చారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. ఇది సామాజిక న్యాయ మహా శిల్పం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.   ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో…

AP

ఏపీలో ఎన్నికల ఎఫెక్ట్.. 21 మంది అధికారుల బదిలీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగి ఏర్పాట్లు ప్రారంభించింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జోన్-4 పలువురు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది అధికారులను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.   ఈ మేరకు సంబంధిత కలెక్టర్లకు తహసీల్దార్లు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. కర్నూలు జిల్లా.. పత్తికొండ తహసీల్దార్‌గా పద్మజ, కోసగికి పీ మురళి, కౌతాళంకు అలెగ్జాండర్, అనంతపురం…