జనసేనలో చేరుతున్నా.. పవన్ కళ్యాణ్పై బాలశౌరి ఆసక్తికర వ్యాఖ్యలు..
పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలోకి మరో సీనియర్ నేత చేరిక ఖాయమైంది. ఇటీవల అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి త్వరలో మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసినట్లు తెలిపారు. పవన్ తో వివిధ అంశాలపై రెండు గంటలపాటు చర్చించినట్లు…