AP

AP

మరో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ.. 9న అన్నదాత పోరు..

రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్ధమైంది. ‘అన్నదాత పోరు’ పేరిట ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.   ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రైతులను…

AP

ఏపీలో డిస్నీ వరల్డ్ సిటీ ఏర్పాటు..! ఎక్కడంటే..?

అమెరికా నుంచి నేరుగా మన దగ్గరికి వస్తే.. ఎలా ఉంటుందో ఊహించారా? కలల్లో మాత్రమే అనిపించే ఆ డిస్నీ వరల్డ్ ఇప్పుడు మన ఆంధ్రాలో అడుగుపెట్టబోతుందట. పిల్లల నుంచి పెద్దలవరకు అందరినీ ఆకట్టుకునే ఈ మ్యాజిక్ సిటీ ప్రాజెక్ట్ ఏపీలో ఓ కొత్త యుగానికి నాంది పలకనుంది. పర్యాటక రంగానికి ఇది గేమ్ చేంజర్ అవుతుందని చెబుతున్నారు.   ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన సృజనాత్మక ఆలోచనలతో చర్చల్లో నిలిచారు. రాష్ట్ర అభివృద్ధి,…

AP

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య భద్రత పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..! 25 లక్షల వరకు ఉచిత వైద్యం..!

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య భద్రత దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.   ‘ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం కింద ఈ కొత్త విధానాన్ని…

AP

ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై వేటు..!

దేవాదాయ శాఖలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సహాయ కమిషనర్ (ఏసీ) కె. శాంతిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఆమెపై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో నిర్బంధ ఉద్యోగ విరమణ (కంపల్సరీ రిటైర్మెంట్) చేయించాలని శాఖాపరంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి.గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు కె. శాంతి ఇటీవల వివరణ సమర్పించారు. అయితే, ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా…

AP

వైసీపీ ఫేక్ పార్టీ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

వైసీపీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, నేరాలను నమ్ముకుని కేవలం విషప్రచారంతోనే మనుగడ సాగిస్తోందని ధ్వజమెత్తారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలను, ఎందరో నాయకులను చూశానని, కానీ ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం అబద్ధాలు ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని, నేరాలను నమ్ముకున్న పార్టీ అని, అందుకే ఆ పార్టీని తాను ‘విషవృక్షం’ అని పిలుస్తానని…

AP

ఏపీ టూరిజంపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త రూపునిచ్చి, ప్రపంచ పటంలో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, అనంతపురంలో ప్రపంచ ప్రఖ్యాత ‘డిస్నీ వరల్డ్ సిటీ’ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, ఆ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించాల్సిన కార్యాచరణపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటకులను ఆకర్షించేందుకు కేవలం…

AP

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి సుగాలి ప్రీతి కేసు..

2017లో తెలుగు రాష్ట్రాల్లో సంచలం రేపిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలతో ఈ కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి ఇచ్చినా దర్యాప్తు ముందుకు సాగలేదు. అయితే ప్రీతి కుటుంబానికి న్యాయం…

AP

ఏపీలో విద్యుత్ ప్రమాదాల నివారణకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు..

విద్యుత్ ప్రమాదాల శాశ్వత నివారణే లక్ష్యంగా ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు పనిచేయాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.   మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా కొందరు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.…

AP

ఎటుచూసినా అమరావతి ఆకర్షణీయంగా ఉండాలి: సీఆర్డీఏకి చంద్రబాబు దిశానిర్దేశం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాజధానిలో చేపట్టాల్సిన ప్రధాన ప్రాజెక్టులను సకాలంలో, పూర్తిచేయడమే లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (స్పెషల్ పర్పస్ వెహికల్ – ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 52వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. మొత్తం 7 కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి,…

AP

బీఆర్ఎస్ కు పట్టిన గతే జనసేనకు పడుతుంది!: సీపీఐ నారాయణ హెచ్చరిక..

బీజేపీతో జతకట్టే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బీజేపీ అందించేది అభయహస్తం కాదని, అది పార్టీలను నాశనం చేసే ‘భస్మాసుర హస్తం’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.   ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి, వాటిలో చీలికలు తీసుకురావడమే బీజేపీ వ్యూహమని నారాయణ ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. బీజేపీకి…