AP

AP

జగన్ కు మరో భారీ షాక్..

ఏపీలో జనసేనలో చేరికలు పెరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో గెలుపొందే పార్టీలపై నేతలు ఫోకస్ పెట్టారు. భవిష్యత్తును వెతుక్కుంటూ ఆ పార్టీల చెంతకు చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలు పెరుగుతుండడం విశేషం. ఇప్పటికే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు బలంగా వినిపిస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరుతారని తెలుస్తోంది. జనసేన అగ్ర నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్…

AP

గుంటూరు బరిలో అంబటి రాయుడు…

ఏపీ సీఎం వైఎస్ జగన్ సిట్టింగ్ మార్పిడి వ్యవహారం ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఈ మార్పులు చేర్పుల కార్యక్రమం మధ్యలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చి రాగానే ఆయనకు జగన్ బంపరాఫర్ కూడా ఇచ్చారట. అదే గుంటూరు లోక్‌సభ స్థానం. అయితే గుంటూరు లోక్‌సభపై సీనియర్ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు

AP

బిజెపికి 6 లోక్ సభ, 12 అసెంబ్లీ సీట్లు.. పొత్తుపై ఫుల్ క్లారిటీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చనున్నట్లు సంకేతాలు పంపారు. మరోవైపు జగన్ ను గద్దె దించాలని చంద్రబాబు పవన్ తో చేతులు కలిపారు. తమ వెంట బిజెపి వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ బిజెపి నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. అయితే బిజెపిని ఒప్పించే పనిలో పవన్ పడినట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి…

AP

ఏపీ విషయంలో కాంగ్రెస్ ఆలోచన కరెక్టేనా..?

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రజల్లో లేదు. విభజనతో ఏనాడో ప్రజలకు దూరమైంది. అది నేతలపై ప్రభావం చూపింది. అందుకే వారంతా తమ భవిష్యత్తును వెతుక్కుని వెళ్ళిపోయారు. అయితే ఆ భవిష్యత్తు ఇచ్చే పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉందా? కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకునే ఛాన్స్ ఉందా? లేదనే సమాధానం వినిపిస్తోంది. అటువంటప్పుడు ఎలా మనుగడ అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ జీరో పొజిషన్లో ఉంది. మళ్లీ ప్రారంభం నుంచి ఆ పార్టీని…

AP

సీనియర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు.. వారికి టిక్కెట్లు లేనట్టే

వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకం. ఒక విధంగా చెప్పాలంటే చావోరేవో లాంటివి. అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపారు. జనసేన తో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఈసారి సీనియర్లకు షాక్ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి టికెట్ అని తేల్చి చెప్పారు.…

AP

జనసేనకు 40-50 సీట్లు.. చంద్రబాబుకు జాబితా అందించిన పవన్..

పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడ్డారా? ఆయనపై ఒత్తిడి పెరుగుతోందా? సీట్ల కేటాయింపు, పవర్ షేరింగ్ విషయంలో కొత్త డిమాండ్ పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. జనసేనలో జరుగుతున్న పరిణామాలతో కాపులు నిరుత్సాహానికి గురవుతున్నారు. టిడిపితో జనసేన పొత్తును చాలామంది వ్యతిరేకించారు. అయితే సీట్లు పెంచుకోవడంతో పాటు పవర్ షేరింగ్ విషయంలో పవన్ కు ఛాన్స్ వస్తుందని ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా లోకేష్ ఏకపక్షంగా చంద్రబాబు మాత్రమే…

AP

వైసీపీకి షాక్.. జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ..

గత కొంతకాలంగా వైసీపీ హై కమాండ్ పై వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంశీ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురయ్యింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు. కానీ జగన్ మొండి చేయి చూపారు. విశాఖ కార్పొరేషన్…

AP

జగన్ ఓకే చెబితేనే.. చంద్రబాబు వెయిటింగ్..

టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను పన్నుతున్నారు. ఈసారి విజయం కీలకం కావడంతో ప్రతి అడుగు ఆచీతూచీ వేస్తున్నారు. తప్పటడుగులు వేస్తే మూల్యం తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ తో చేతులు కలిపారు. జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు. జగన్ కు గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. అయితే జగన్ ఆ అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి. అయితే ఏ చిన్న అవకాశం ఇచ్చిన చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో…

AP

షర్మిల గిఫ్ట్.. లోకేష్ కామెంట్స్..

రాజకీయాలన్నాకా ఏవైనా జరుగుతాయి. ఇందులో తర్కం వెతుక్కోకూడదు. అందుకే కదా స్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదనేది. ఫర్ సపోజ్ ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు.. అతడు జైల్లో ఉన్నప్పుడు.. అతని సోదరి షర్మిల పాదయాత్ర చేసింది. ఏపీలో పార్టీని బతికించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదు. పైగా ఆమె తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చింది.. ఆంధ్రలో కాదనుకొని తెలంగాణలో రాజన్న రాజ్యం…

AP

జనసేన ఆషామాషి కాదు..

ఉమ్మడి ఏపీని సుదీర్ఘకాలం పాలించిన వ్యక్తిగా చంద్రబాబు కు గుర్తింపు లభించింది. ఆయన పూర్వాశ్రమం సైతం కాంగ్రెస్ పార్టీయే. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పూర్వాశ్రమం కూడా కాంగ్రెస్ పార్టీయే. కెసిఆర్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వారు. ఈ లెక్కన తెలంగాణ, ఏపీకి పాలించిన సీఎంలలో ముగ్గురుని అందించింది కాంగ్రెస్ పార్టీయే. అలాగని వారు చెప్పుకోవడం లేదే. పార్టీలు అన్నాక నాయకులు తయారవుతారు. వారి ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు మారుతారు. దానిని మన గొప్పతనంగా చెప్పుకోవడం…