AP

AP

వీటిని ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉంది: జడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్ స్పందన..

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విరుద్ధంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నారని, కుట్రలు, దాడులు, అబద్ధాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎన్నికలను హైజాక్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాలు, కొందరు అధికారులు, పోలీసులు కలిసి ఈ కుట్రను అమలు చేస్తున్నారని విమర్శించారు.   చంద్రబాబు కుట్రపూరిత ప్రణాళికలను అమలు చేస్తున్నారని మండపడ్డారు. “ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే…

AP

ఆగస్టు 15 నుంచి విజయవాడలో ‘యువ ఆంధ్ర ఛాంపియన్ షిప్’..

ఆంధ్రప్రదేశ్‌ కబడ్డీ అభిమానులకు శుభవార్త. రాష్ట్రంలోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ‘యువ ఆంధ్ర ఛాంపియన్‌షిప్ 2025’కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక తెలుగు కబడ్డీ లీగ్‌కు ముందు ఈ టోర్నమెంట్ ఒక ప్రవేశ ద్వారంలా పనిచేయనుంది.   ఆగస్టు 15వ తేదీ నుంచి విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో ఈ కబడ్డీ సమరం ప్రారంభం కానుంది. మొత్తం 11 రోజుల పాటు సాగే ఈ…

AP

లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం..

ఏపీలో లిక్కర్ కేసు వ్యవహారంలో వెంకటేష్ నాయుడు చుట్టూ తిరుగుతోంది. ఆయన టీడీపీకి చెందిన నేత అంటూ వైసీపీ నేతలు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన వైసీసీ నేత అంటూ కీలక విషయాలు బయటపెట్టింది టీడీపీ. తాజాగా విమానాల్లో నేతల జల్సాల గురించి బయటపెట్టారు ఆ పార్టీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి.   ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కొత్త కొత్త విషయాలు బయటపెట్టింది టీడీపీ. ఈ కేసులో వైసీపీ నేతలకు ప్రమేయముందని కుండబద్దలు కొట్టేశారు టీడీపీ…

AP

ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం….

ఏపీలో కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టినట్టు స్పష్టమవుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII) 30వ భాగస్వామ్య సదస్సుకి ఏపీ సిద్ధమవుతోంది. విశాఖలో ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సదస్సు విజయవంతం కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం తాజాగా సమావేశమైంది. ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనే నినాదంతో పరిశ్రమలను ఆకర్షించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కొత్త పరిశ్రమలు రావడం ద్వారా, మరిన్ని పెట్టుబడులను తేవడం ద్వారా ఏపీలో ఉపాధి, ఆర్థిక…

AP

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది..!: మంత్రి లోకేష్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దీనికి నిదర్శనంగా జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయని రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు.   రాష్ట్రంలో 2017లో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నడూ లేనంతగా 2025 జూలై నెలలో రూ.3,803 కోట్లు వసూలైనట్లు లోకేశ్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే…

AP

కూటమి ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది..!: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పేట్రేగిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మద్యం వ్యాపారం, అక్రమ ఇసుక తవ్వకాలు, అమరావతి భూముల వ్యవహారాల్లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆయన మంగళవారం విమర్శించారు.   ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు ప్రమాదకర స్థాయికి చేరాయని అన్నారు. హైదరాబాద్,…

AP

కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం: పవన్ కల్యాణ్.

ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడి రైతులను వేధిస్తున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన ‘ఆపరేషన్ కుంకీ’ విజయవంతమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం మొగిలి ప్రాంతంలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును.. శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు విజయవంతంగా అడవిలోకి తరిమికొట్టాయని వెల్లడించారు. ఈ ఆపరేషన్ సఫలం కావడంతో సరిహద్దు ప్రాంతాల రైతులకు భరోసా లభించినట్లయిందని పేర్కొన్నారు.…

AP

ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్..! ఈ రూల్స్ పాటించాల్సిందే..!

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఓ చక్కని స్వేచ్ఛ దక్కబోతోంది. పొద్దున్న బయటకి వస్తే.. బస్సు ఎక్కాలనిపిస్తే.. టికెట్ విషయంలో ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఏపీలో అమలు కానున్నది.. మహిళల ఉచిత బస్సు పథకం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ మహిళలకు నిజమైన ప్రయాణ స్వాతంత్ర్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.   ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. టికెట్ లేదు! ఈ పథకం ద్వారా రాష్ట్రంలో…

AP

త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ.. చంద్రబాబు కీలక ప్రకటన..

కష్టపడి పనిచేసిన వారికి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు తప్పకుండా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తనకు కార్యకర్తలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడతామని వివరించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కో-ఆర్డినేటర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.   ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో తాము చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పుకోలేక నష్టపోయామని అన్నారు. ప్రస్తుతం కూటమి…

AP

గిరిజనుల కోసం రగ్గులు పంపించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకవైపు అగ్ర నటుడిగా మూవీల్లో నటిస్తూనే, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తున్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో గిరిజనులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.   అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి, డుంబ్రిగూడ గ్రామాలను పవన్ కల్యాణ్ సందర్శించిన సమయంలో అక్కడి వారి బాధలు చూసి పాదరక్షలు పంపించారు. తన తోటలోని ఆర్గానిక్ పండ్లు…