AP

AP

ఆ ఆడియో నాది కాదు… ఎన్టీఆర్ అభిమానులు బాధపడితే క్షమించాలి: ఎమ్మెల్యే ప్రసాద్..

సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియో క్లిప్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దూషిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. అది తన గొంతు కాదని, స్థానిక రాజకీయాల్లో తనపై గిట్టనివారే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.   ఈ వివాదంపై దగ్గుపాటి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. “సోషల్ మీడియాలో…

AP

అనంతపురం టీడీపీలో రచ్చ… ఎమ్మెల్యే Vs ప్రభాకర్ చౌదరి..

అనంతపురం టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా దగ్గుపాటికి ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. దగ్గుపాటి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని… ఇద్దరం ఎన్నికల్లో పోటీ చేద్దామని… ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దామని సవాల్ విసిరారు. సమాధులు ఆక్రమించిన వాళ్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన…

AP

ఏపీలో మొదలైన మహిళల ఫ్రీ బస్..!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మొదలయ్యాక, RTC బస్సులు ఇప్పుడు కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, సమాచారం పంచే మాధ్యమాలుగా కూడా మారిపోయాయి. కండక్టర్ చేతిలో మైక్ పట్టుకుని, మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఆధార్ చూపించి సద్వినియోగం చేసుకోండని బస్సు మొత్తం మార్మోగేలా చెబితే, ప్రయాణికుల ముఖాల్లో ఒక ఆసక్తి, ఒక సంతోషం కనబడుతోంది. గ్రామీణ రూట్లలో అయితే ఈ సన్నివేశం మరింత అందంగా, మరింత దగ్గరగా అనిపిస్తోంది.   ఏపీ…

AP

వైనాట్ పులివెందుల అంటూన్న టీడీపీ నేతలు..! జగన్ కు కౌంటర్ ..

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ నష్టపోయిందేంటి? పోనీ ఆ గెలుపుతో టీడీపీ సాధించిందేంటి? లాభ నష్టాల సంగతి బేరీజు వేసే కంటే, ఇగో శాటిస్ఫాక్షన్ కి ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అవును, వైనాట్ కుప్పం అంటూ గతంలో జగన్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ దెబ్బకొట్టిమరీ చూపించారు టీడీపీ నేతలు.   అలా మొదలైంది.. వాస్తవానికి పులివెందులలో గెలవాలని టీడీపీకి, కుప్పం ఏరియాలో గెలవాలని…

AP

కొత్త జిల్లాల ఏర్పాటుపై వినతులు స్వీకరిస్తాం: మంత్రి అనగాని..

గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను అస్తవ్యస్తంగా చేపట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. తొందరపాటు చర్యలు, ఒత్తిళ్లతో జిల్లాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా జిల్లాల ఏర్పాటు జరగలేదని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటులో సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.   మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు…

AP

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి మళ్లీ జరపాలి: జగన్ డిమాండ్..

పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక…

AP

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!

రాష్ట్రంలోని మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారబోయే ‘స్త్రీశక్తి’ పథకం ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఈ పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధిక రద్దీ ఉండే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భద్రత అంశంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం…

AP

వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..!

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోందంటూ ఆయన కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు. హత్యకేసులో కీలక నిందితులు తప్పించుకోవాలని చూస్తున్నారని, తమకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరిపై ఒత్తిడి తెచ్చారని అంటున్నారు. ఈ బెదిరింపులపై ఆమె చేసిన ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జైలులో దస్తగిరిని బెదిరించిన విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్…

AP

పీ4 కార్యక్రమంపై స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 (ప్రజా-ప్రైవేటు-ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమంపై వస్తున్న కొన్ని కథనాల నేపథ్యంలో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ స్పష్టత ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు లేదా ప్రభుత్వ శాఖలకు ఎలాంటి కోటాలు విధించడం లేదని, ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ చెరుకూరి కుటుంబరావు ఒక ప్రకటనలో తెలిపారు.   పీ4 కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన ఒక ప్రజా ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా…

AP

మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ ..! త్వరలో డీజీపీ చేతికి ‘ఆడుదాం ఆంధ్రా’ స్కామ్‌పై విజిలెన్స్ నివేదిక..

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ నివేదికను విజిలెన్స్ విభాగం అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు. వైసీపీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయి.   క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర…