బాలికపై అత్యాచారం నిందితుడు నారాయణరావు ఆత్మహత్య: చెరువులో దూకి మృతి
కాకినాడ జిల్లా తునిలో 8వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు నారాయణరావు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో బాత్రూం అవసరమని చెప్పి జీపు దిగాడు. అయితే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న నారాయణరావు సమీపంలోని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆకస్మిక ఘటనతో పోలీసులు,…

