AP

APSPORTS

ఏపీలోని అంతర్జాతీయ క్రీడాకారులకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.   చాలాకాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు విడుదల కావడంతో క్రీడాకారులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్‌) ఛైర్మన్‌ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు,…

AP

ఏపీలో ఇక ప్రతి ఇంటికి ఫ్యామిలీ కార్డు..! ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల పంపిణీని మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డు’ను జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఈరోజు ‘ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌’ వ్యవస్థపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని సూచించారు.   ఈ కొత్త ఫ్యామిలీ కార్డులో ఆ…

AP

అటవీశాఖ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి… పవన్ కల్యాణ్ ఫైర్..!

ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.   “శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి, దాడికి…

AP

కోవూరు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ‌..!

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డికి బెదిరింపు లేఖ రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్య‌క్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇంటికి వ‌చ్చాడు. అక్క‌డ ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. అనంత‌రం కార్యాల‌యం సిబ్బంది స‌ద‌రు వ్య‌క్తి ఇచ్చి వెళ్లిన ఆ లేఖ‌ను తెరిచి చూశారు.   ఆ లేఖ‌లో వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి త‌న‌కు రూ. 2కోట్లు ఇవ్వాల‌ని, లేదంటే…

AP

వెలుగులోకి వస్తోన్న రౌడీషీటర్ శ్రీకాంత్ హిస్టరీ..

అతడో కరడుగట్టిన నేరగాడు. హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక సమయంలో జైలు నుంచి పారి పోయాడు. నాలుగున్నరేళ్లుగా బయటే ఉండి నేర సామ్రాజ్యం విస్తరించాడు. హత్యలు, దాడులు, కిడ్నాపులు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్.. ఇలా అతడు చేయని నేరం లేదు. 4 జిల్లాల పరిధిలో సుమారు 200 మందితో ఒక గ్యాంగు ఏర్పాటు చేసుకున్నాడు.   జైల్లో ఖైదీగా ఉంటూ.. జైలర్ ఎవరుండాలో కూడా డిసైడ్.. ఏ కాంట్రాక్టు పనికి…

AP

పర్యాటక రంగంపై ఏపీ సర్కార్ ఫోకస్..! 280 కోట్లతో భారీ ప్రాజెక్టులు..

ఏపీ పర్యాటక రంగాన్ని జాతీయ స్థాయిలో మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు, పురాతన శిల్పకళ అన్నట్టుగా ఉన్న ఏపీలో ప్రతి జిల్లా తనదైన ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ శక్తిని ప్రపంచానికి చూపించేందుకు, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలిపేందుకు ఏపీ ప్రభుత్వం తాజా ప్రణాళికలతో ముందుకు వెళ్లింది. దాదాపు రూ. 280 కోట్ల విలువైన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టుల్లో లేపాక్షి,…

AP

ప్రిన్సిపల్ ఆడియో బయటకు.. అసలు విషయాలు వెల్లడించిన ఎమ్మెల్యే కూన రవికుమార్..

ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహారం కొత్త మలుపు తిరిగిందా? ఈ వ్యవహారం వెనుక వైసీపీ నేతలున్నారా? వెలుగులోకి వచ్చిన వెంటనే ఎందుకు సదరు ఎమ్మెల్యే నోరు విప్పలేదు? పార్టీ హైకమాండ్ సీరియస్ కావడంతో ప్రిన్సిపల్ ఆడియో బయటపెట్టారు ఎమ్మెల్యే కూన రవికుమార్.   ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కూన రవికుమార్ తొలిసారి రియాక్ట్ అయ్యారు. అసలు జరిగింది ఏంటి? అన్నీ పూసగుచ్చి మరీ వివరించారు. తాను ఏ…

AP

ఏపీకి కేంద్రం అండగా నిలవాలి.. అశ్విన వైష్ణవ్ కు నారా లోకేశ్ విజ్ఞప్తి..

ఆంధ్రప్రదేశ్‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను మంజూరు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్, భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఏపీ టెక్నాలజీ ప్రగతికి సంబంధించిన…

AP

ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్‌లోనే 700 సేవలు..

అమరావతి అంటే కేవలం ఓ రాజధానిగా మాత్రమే కాదు.. గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గానూ మార్చాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విజన్‌తోనే అభివృద్ధి వెలుగులు సాధ్యమని.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ చేపడుతున్నట్లు తెలిపారు. వాట్సాప్ మన మిత్ర ద్వారా.. 700 ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక.. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.   ఈ వారం.. స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వర్నెస్…

AP

విశాఖను ముంచెత్తిన వాన.. జీవీఎంసీ హై అలర్ట్..

సాగర నగరం విశాఖపట్నాన్ని ఆదివారం భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   విశాఖ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గాజువాక, పెద్ద గంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా గాజువాకలోని డైరీ కాలనీ, హెచ్‌బీ కాలనీ, రిక్షా కాలనీ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి సుమారు…