జగన్ కు టీడీపీ సవాల్… గోశాలలో కలుద్దామన్న భూమన..
తిరుమలలోని ఎస్వీ గోశాల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. గోశాలలో వందకు పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ రంగు పులుముకున్నాయి. భూమన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న భూమనపై కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, తాజాగా భూమనపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

