వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా పట్టా రిజిస్ట్రేషన్: మంత్రి నారా లోకేశ్..
వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. నేడు మొత్తం 1030 పేద…

