పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాలపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో…

