మచిలీపట్నం పీఎస్ లో విచారణకు హాజరైన పేర్ని జయసుధ..
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అర్ధాంగి పేర్ని జయసుధ నేడు మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నారు. ఈ…

