బీహార్ ఎన్నికల ఫలితాలతో లాలూ కుటుంబంలో చిచ్చు: రాజకీయాల నుంచి రోహిణి ఆచార్య ఔట్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ (RJD)-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం చవి చూసిన నేపథ్యంలో, ఆర్జేడీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లు మాత్రమే గెలుచుకుని భారీ ఓటమి చవిచూసిన మరుసటి రోజే ఆమె ఈ ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు, అంతేకాక తన కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు శనివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రోహిణి ప్రకటించారు.…

