National

National

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ స్వీకారం

: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి సీఎం బాధ్యతలను చేపట్టారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ హెలీప్యాడ్ గ్రౌండ్‍లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర 18 ముఖ్యమంత్రిగా భూపేంద్రతో గవర్నర్ ఆచార్య దేవ్‍వ్రత్ ప్రమాణం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 16 మంది ఎమ్మెల్యేలు ఈ వేదికపైనే మంత్రులుగా…

National

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్‌ కార్డును క్లోనింగ్ చేసి ఆయన ఖాతా నుంచి రూ.50,00 డ్రా చేసినందుకు ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసుల సైబర్ బృందం అరెస్టు చేసింది. ఐఏఎస్ అధికారి శ్రీవాస్తవ ఈమెయిల్‌ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ముగ్గురిని అమిత్ ప్రతాప్ సింగ్, హార్దిక్ ఖన్నా, రజనీష్ నిగమ్ గా గుర్తించారు. ముగ్గురూ అనురాగ్…

National

170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ

ఢిల్లీ (Delhi) లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ అధికారులు కవితను దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. లిక్కర్‌ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ సాగింది. అమిత్‌ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. సిసోడియా, అరోరా, అభిషేక్‌ విషయంలో ఎక్కువగా ఆమెను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ సాగింది.…

National

రాత్రి రోడ్డుపై నడిచినందుకు దంపతులకు రూ.3,000 ఫైన్..

సాధారణంగా రాత్రివేళల్లో రోడ్లపై చాలా మంది తిరుగుతుంటారు. డిన్నర్లకో, ఫంక్షన్‍లకో వెళ్లినప్పుడు లేట్ అయితే రోడ్లపై నడిచివెళుతుంటారు. బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఇది సర్వసాధారణం. అయితే ఇలాగే రాత్రి వేళ నడిచి వెళుతున్న దంపతులకు బెంగళూరులో వింత అనుభవం ఎదురైంది. పోలీసులు తమను వేధించారని కార్తీక్ పత్రీ అనే వ్యక్తి వెల్లడించారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై నడిచినందుకు పోలీసులు రూ.3,000 ఫైన్ వేశారని, చివరికి రూ.1,000 వసూలు చేసుకొని పంపించారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.…

National

ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం

ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు చేసింది మొదలు.. అనేక మంది బడా వ్యాపారవేత్తలు రుణాలు ఎగ్గొట్టడం, తద్వారా దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి అనేక సంస్కరణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏటీఎం చార్జీలని, యూజర్‌ చార్జీలు, మినిమం బ్యాలెన్స్‌, ట్రాన్జాక్షన్‌ చార్జీలు.. ఇలా ఒక్కటేమిటి.. అనేక మార్గాల్లో వినియోగదారులను బ్యాంకులు పిండేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితి అసలే బాగోలేదు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం…

National

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ

ఢిల్లీ (Delhi) లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ అధికారులు కవితను దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. లిక్కర్‌ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ సాగింది. అమిత్‌ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. సిసోడియా, అరోరా, అభిషేక్‌ విషయంలో ఎక్కువగా ఆమెను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ సాగింది.…

National

2019 పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్​- పాక్​ మధ్య బంధం కనిష్ఠ స్థాయికిి

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సాధారణ విషయంగా పరిగణించవద్దని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​ పునరుద్ఘాటించారు. క్రీడా టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి, కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండదని తేల్చిచెప్పారు. 2023 ఆసియా కప్​పై బీసీసీఐ- పీసీబీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో జైశంకర్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 ఆసియా కప్​ పాకిస్థాన్​లో జరగనుంది. భారత్​- పాక్​ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ టోర్నమెంట్​కి తమ ఆటగాళ్లను పంపడం లేదని బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. బీసీసీఐ వైఖరిపై…

National

రూ. 19వేల కోట్లకు రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ

రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో భారత దేశం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2021-22లో ఎన్నడూ లేని విధంగా రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ. 14వేల కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. మిలిటరీ హార్డ్​వేర్​ను మిత్రపక్షాలకు ఎగుమతి చేసే విషయంలో ప్రభుత్వం చేపట్టిన సరళమైన విధానాల వల్ల ఈ రికార్డు సాధ్యమైందని అన్నారు. రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతులు.. 2014లో కేవలం రూ. 900కోట్లుగా ఉండేవని, ఇప్పుడు రూ. 14వేల కోట్లకు…

National

దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం

గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో తెలిపింది. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడగా, తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా రైతులు…

National

అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి సీఎం సీటు

అదృష్టమో, ఆనవాయితీయో.. హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కథ మాత్రం మొదటికే వచ్చింది. సీఎం పదవి కోసం నేతల మధ్య రగడ రాజకుంది. ఓవైపు ఎమ్మెల్యేలు జారిపోతారేమో అనే భయాలు హైకమాండ్‌ను వెంటాతుంటే.. మరోవైపు సిమ్లాలో సీఎం కుర్చీ కోసం లడాయి చెలరేగింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం నేతలు తన్నుకు చస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హిమాచల్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్‌,…