National

National

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు అంతా రెడీ

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, మాజీ మంత్రి పరుషోత్తమ్‌ సోలంకి, ఆప్‌ సీఎం అభ్యర్థి ఈశుదాన్ గఢ్వి, ఆప్ గుజరాత్ చీఫ్‌ గోపాల్ ఇటాలియా, మోర్బీ నుంచి కాంతిలాల్‌ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఫస్ట్ ఫేజ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోదీషా సొంత రాష్ట్రం గుజరాత్‌లో.. వరుసగా ఏడోసారి కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళూరుతోంది బీజేపీ. అభివృద్ధి అజెండాతో ప్రచారం…

National

గుజరాత్ లో ఆప్ కార్యకర్తలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ బహిరంగసభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముఖ్యనేతలంతా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్ లో రోడ్డు షోలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను కారులోకి ఎక్కించారు. మీడియాపై కూడా దాడి…

NationalWorld

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు పై కేరళలో ఆందోళనలు

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు(Vizhinjam Port) పై కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ట్రాన్స్ షిప్‍మెంట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలంటూ వేలాది మంది ప్రజలు.. కేరళలోని విజిన్‍జమ్ పోలీస్ స్టేషన్‍ (Vizhinjam Police Station) ను ముట్టడించారు. కేరళ రాజధాని తిరువనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‍పై దాడి చేశారు. దీంతో…

National

అదానీ NDTV ఆఫర్‌కు స్పందన అంతంతే!

న్యూఢిల్లీ టీవీలో (NDTV)లో 26 శాతం అదనపు వాటా కోసం అదానీ గ్రూప్‌ చేసిన ఓపెన్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఓపెన్‌ ఆఫర్‌ ధరకన్నా… మార్కెట్‌లో అధిక ధర పలుకుతుండటంతో ఇన్వెస్టర్లు ఎవరూ షేర్లు అమ్మడానికి ముందుకు రావడం లేదు. మంగళవారం ప్రారంభమైన ఈ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 5తో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు 28 లక్షల షేర్లకు మాత్రం ఆఫర్స్‌ వచ్చాయి. ఓపెన్‌ ఆఫర్‌ కింద…

National

మరో 15 రోజుల్లో గుజరాత్ ఎన్నికలు

గుజరాత్ ఎన్నికలు మరో 15 రోజుల్లో జరగబోతున్నాయి.. డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు.. మూడు పార్టీలు బరిలో ఉన్నాయి. 2017 దాకా కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ ఉండేది.. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో ఆరున్నర కోట్ల జనాభా ఉంది.. ఇందులో 11 శాతం ముస్లింలు ఉన్నారు.. మొత్తం 182 నియోజకవర్గాలు ఉన్నాయి.. అయితే ఈసారి ఇక్కడ జరిగే ఎన్నికలు 2024లో ఢిల్లీ పీఠం…

National

INCOME TAX DEPT పై కేంద్రానికి నోటీసులు పంపిన కోర్టు..

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.2,50,000 వార్షికాదాయం దాటినవారు ఆదాయపు పన్ను చెల్లించాలి. ఇక రూ.8,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇటీవల సుప్రీం కోర్టు సమర్థించింది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం రూ.8,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తిస్తూ, మరోవైపు రూ.2,50,000 కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారి నుంచి పన్నులు వసూలు చేయడం ఏంటన్న వాదనలు చాలాకాలంగా ఉన్నాయి. అందుకే ఆదాయపు…

National

లెహంగా నచ్చలేదని పెళ్లి రద్దు చేసుకున్న వధువు

భారతీయుల వివాహాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పెళ్లి భోజనం నుంచి ఆచారాల వరకు ఏమాత్రం తేడా రాకుండా చూసుకుంటారు. వధువు అయితే తన అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. పెళ్లిలో దగదగమెరిసిపోవాలనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే పెళ్లి చీర నుంచి చేతులకు పెట్టుకునే మెహందీ వరకు ప్రతిఒక్కటి ప్రత్యేకంగా ఉండాలని కోరకుంటుంది. అయితే ఉత్తరాఖండ్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కాబోయే కోడలికి అత్తగారు లెహెంగా తీసుకువచ్చారు. అయితే ఆ లెహెంగా పెళ్లికూతురికి…

NationalTRENDING

వెలుగులోకి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయితే చాలామంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు దస్నా…

NationalPOLITICSTELANGANA

ఎక్కడైతే కేంద్ర సంస్థలు దాడులు చేస్తాయో అక్కడే ధర్నాలు…..సీఎం కేసీఆర్..

తెలంగాణభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షత టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నకున్నట్లుగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్, పార్టీ మారాలని ఒత్తిళ్లు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తన కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ మారాలని అడిగినట్లు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు జరగబోవని తేల్చి చెప్పారు. తన కూతురుని బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారంటూ వ్యాఖ్యానించారు. దీనికంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని…

National

మైనింగ్ లీజు వ్యవహారంలో జార్ఖండ్ CM హేమంత్ కు సుప్రీంకోర్టు భారీ ఊరట

హేమంత్ సోరెన్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంతకూ మునుపు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసాడు. అయితే మైనింగ్ లీజు వ్యవహారంలో ఇతనికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఝార్ఖండ్ ప్రభుత్వం, హేమంత్ సొరేన్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది.…