భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా ‘డ్యామ్’!
భారత సరిహద్దుల్లో చైనా చేసిన మరో పని తలనొప్పిగా మారింది! ఇండియా- నేపాల్ సరిహద్దుల్లో ఓ డ్యామ్ను నిర్మిస్తోంది చైనా. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. డ్యామ్.. ఎందుకు- ఎక్కడ? టిబెట్లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో.. ఇండియా- నేపాల్తో సరిహద్దును పంచుకుంటోంది చైనా. కాగా.. ఈ ట్రై-జంక్షన్కు కొంత దూరం నుంచి గంగా నదికి చెందిన ఉపనది మబ్జా జాంగ్బో ప్రవహిస్తోంది. ఈ మబ్జా జాంగ్బో.. నేపాల్లోని కర్నాలీ నదిలో కలుస్తుంది. చివరికి అది…

