National

National

ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం

ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు చేసింది మొదలు.. అనేక మంది బడా వ్యాపారవేత్తలు రుణాలు ఎగ్గొట్టడం, తద్వారా దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి అనేక సంస్కరణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏటీఎం చార్జీలని, యూజర్‌ చార్జీలు, మినిమం బ్యాలెన్స్‌, ట్రాన్జాక్షన్‌ చార్జీలు.. ఇలా ఒక్కటేమిటి.. అనేక మార్గాల్లో వినియోగదారులను బ్యాంకులు పిండేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితి అసలే బాగోలేదు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం…

National

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ

ఢిల్లీ (Delhi) లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ అధికారులు కవితను దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. లిక్కర్‌ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ సాగింది. అమిత్‌ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. సిసోడియా, అరోరా, అభిషేక్‌ విషయంలో ఎక్కువగా ఆమెను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ సాగింది.…

National

2019 పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. భారత్​- పాక్​ మధ్య బంధం కనిష్ఠ స్థాయికిి

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సాధారణ విషయంగా పరిగణించవద్దని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్​ పునరుద్ఘాటించారు. క్రీడా టోర్నమెంట్లు వస్తూనే ఉంటాయి, కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండదని తేల్చిచెప్పారు. 2023 ఆసియా కప్​పై బీసీసీఐ- పీసీబీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో జైశంకర్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2023 ఆసియా కప్​ పాకిస్థాన్​లో జరగనుంది. భారత్​- పాక్​ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈ టోర్నమెంట్​కి తమ ఆటగాళ్లను పంపడం లేదని బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. బీసీసీఐ వైఖరిపై…

National

రూ. 19వేల కోట్లకు రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ

రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో భారత దేశం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2021-22లో ఎన్నడూ లేని విధంగా రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ. 14వేల కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. మిలిటరీ హార్డ్​వేర్​ను మిత్రపక్షాలకు ఎగుమతి చేసే విషయంలో ప్రభుత్వం చేపట్టిన సరళమైన విధానాల వల్ల ఈ రికార్డు సాధ్యమైందని అన్నారు. రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతులు.. 2014లో కేవలం రూ. 900కోట్లుగా ఉండేవని, ఇప్పుడు రూ. 14వేల కోట్లకు…

National

దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం

గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో తెలిపింది. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడగా, తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా రైతులు…

National

అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి సీఎం సీటు

అదృష్టమో, ఆనవాయితీయో.. హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కథ మాత్రం మొదటికే వచ్చింది. సీఎం పదవి కోసం నేతల మధ్య రగడ రాజకుంది. ఓవైపు ఎమ్మెల్యేలు జారిపోతారేమో అనే భయాలు హైకమాండ్‌ను వెంటాతుంటే.. మరోవైపు సిమ్లాలో సీఎం కుర్చీ కోసం లడాయి చెలరేగింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం నేతలు తన్నుకు చస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హిమాచల్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్‌,…

APNationalPOLITICSTELANGANA

“భారత్ రాష్ట్ర సమితి” (BRS)గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ (KCR) అధికారికంగా లేఖ

తెలంగాణ (Telangana) రాష్ట్ర సమితి పేరును “భారత్ రాష్ట్ర సమితి” (BRS)గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పార్టీ అధినేత సీఎం కెసిఆర్ (KCR) అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు “భారత రాష్ట్ర సమితి” (BRS) ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బిఆర్ఎస్ (BRS) అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్…

National

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi – MCD) ఫలితాలు

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi – MCD) ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 250 సీట్లకు గానూ, 134 సీట్లను ఆప్, 104 స్థానాలను బీజేపీ గెల్చుకున్నాయి. కాంగ్రెస్ 9 స్థానాలకు పరిమితమైంది. Women winners: మహిళలే మెజారిటీ.. ఈ ఎన్నికల్లో ఆప్ తరఫున విజయం సాధించిన వారిలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. ఆప్ నుంచి గెలిచిన 134 మందిలో 55% వరకు…

NationalTELANGANA

ఈ నెల 11న MLC కవితను విచారించనున్న CBI.!

నేడే సీబీఐ ముందుకు ఎమ్మెల్యే కవిత వెళ్ళి వుండాల్సింది. కాదు కాదు, ఆమె ఇంటికే సీబీఐ వెళ్ళి విచారణ చేసి వుండాల్సింది.! కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కవిత.. తనకు కొంత గడువు కావాలని సీబీఐని అభ్యర్థించారు. దాంతో, సీబీఐ ఆమె అభ్యర్థనను మన్నించక తప్పలేదు. ఈ నెల 11న అందుబాటులో వుండాలంటూ సీబీఐ నుంచి సమాచారం వెళ్ళింది ఎమ్మెల్సీ కవితకి. ఈ నెల 11న ఉదయం 11 గంటల సమయంలో హైద్రాబాద్‌లోని కవిత…

NationalWorld

రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత : ప్రధాని నరేంద్ర మోదీ

భారత అధ్యక్షతన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనలను కోరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీల సహకారాన్ని ఆయన కోరగా, ప్రతిపక్ష నాయకులు దేశ ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇది యావత్ దేశం గర్వించదగ్గ సందర్భమని, దీని విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని…