National

National

ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొందరు అడ్డదారులు

ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొందరు అడ్డదారులు వెతుకుతూ ఉంటారు. ఈక్రమంలో తప్పులు చేస్తారు. దానికి తగిన జరిమానాలు చెల్లించుకుంటారు. అయితే మీరు చట్టపరమైన మార్గంలో కూడా ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం అనేక ఆప్షన్లు ఇచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఈ చట్టబద్ధమైన పద్ధతులను ఉపయోగించడం ద్వారా పన్నును ఆదా చేసుకోవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ ఆర్థిక ప్రణాళికను…

National

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రైల్వేలో చేరేందుకు ఇది గొప్ప అవకాశం

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రైల్వేలో చేరేందుకు ఇది గొప్ప అవకాశం. సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులకు సంబంధించిన 2000 కంటే ఎక్కువ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. దీని చివరి తేదీ సమీపించింది. సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను నింపని అభ్యర్థులు ఇక దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ట్రేడ్‌లలో ముంబై, భుసావల్, పూణే, నాగ్‌పూర్, సోల్పూర్ క్లస్టర్‌ల పరిధిలో ఈ పోస్టుల భర్తీ జరుగుతోంది. వీటి పరిధిలో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్,…

National

ముంబైలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు చేసి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ముంబైలోని టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్, తెలంగాణలో టాటా గ్రూపు…

National

చివరి టోర్నీ ఇదేనంటూ.. రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ఎమోషనల్ నోట్!

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ అందం ‘సానియా మీర్జా’ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌తోనే టెన్నిస్ కెరీర్‌కి ముగింపు పలకబోతున్నట్టు గతంలో సానియా ప్రకటించినా.. గాయం కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక దుబాయ్ ఓపెన్‌ 2023 తర్వాత సానియా రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. అన్ని వార్తలకు చెక్ పెడుతూ ఆస్ట్రేలియా ఓపెన్‌ 2023 తోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు తాజాగా…

National

విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు

ఈమధ్యకాలంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కామన్ అయిపోతోంది. సెలబ్రిటీలకు , విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల అధికారులు కూడా అలర్ట్ అవుతూ పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి పుణే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని టేకాఫ్ కు కొన్ని నిమిషాల…

National

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ (BJP national executive meet) జరగనుంది. పార్టీ అగ్రనేతలు పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. Cabinet reshuffle buzz: కేంద్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరున ప్రారంభమవుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ప్రధాని మోదీ (PM Modi) మంత్రివర్గ విస్తరణ (Cabinet reshuffle) చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరును బట్టి కొందరు మంత్రులకు…

National

గడ్డి కోసేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో మైనర్ బాలికపై పులి దాడి (Tiger Attacks) ఘటన చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (VTR)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకరం రేకెత్తించింది. గౌన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్రి గ్రామానికి చెందిన దివ్య తన పనిలో నిమగ్నమై కట్టెలు సేకరిస్తోంది. ఈ…

National

జాతీయ వివాదంగా జగన్ ట్వీట్‌, RRR అభినందన రగడ

త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన గ్లోబల్ అవార్డుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు జాతీయ స్థాయిలో వివాదం( Jagan RRR dispute) అయింది. అయన అభినందనలు తెలుపుతూ తెలుగు జెండా(Flag) రెపరెపలాడుతుందని చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ అవార్డు తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. అయితే, ముఖ్యమంత్రి శుభాకాంక్షల సందేశం ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి మింగుడుపడలేదు. సోషల్…

National

పంజాబ్ లో అడుగుపెట్టిన భారత్ జోడో యాత్ర

హరియాణా నుంచి పంజాబ్ లో తన భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. పంజాబ్ లోని అమృతసర్ లో ఉన్న సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయం (Golden Temple) ను ఆయన సందర్శించారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు గడిపారు. సిక్కుల సంప్రదాయ తలపాగాలో రాహుల్ కనిపించారు. Bharat Jodo Yatra: స్వర్ణ దేవాలయం సందర్శన స్వర్ణ దేవాలయం(Golden Temple) నుంచి ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సర్హింద్ లో రాహుల్ మంగళవారం రాత్రి…

National

మరో వివాదంలో ఎయిరిండియా భోజనంలో రాళ్లు?

ఇటీవల విమానాల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. విమానాల్లో ప్రయాణికుల దాడులు, అనుచితంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. అలాగే విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ విషయంలో కూడా అనేక లోటుపాట్లు వెలుగుూస్తున్నాయి. నాసిరకం ఫుడ్ ను ప్రయాణికులకు అందిస్తున్నారు. దీంతో ప్రయాణికులు విమాన సంస్థలపై మండిపడుతున్నారు. తాజాగా ఎయిర్ ఇండియా విమానం భోజనంలో రాయి వచ్చింది. దీనిపై ప్యాసింజర్లు మండిపడుతున్నారు. ఓ ప్యాసింజర్ ఈ ఫోటోను సోషల్…