రాష్ట్రపతి భవన్లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత : ప్రధాని నరేంద్ర మోదీ
భారత అధ్యక్షతన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనలను కోరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రపతి భవన్లో అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీల సహకారాన్ని ఆయన కోరగా, ప్రతిపక్ష నాయకులు దేశ ప్రయోజనాల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇది యావత్ దేశం గర్వించదగ్గ సందర్భమని, దీని విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని…

