National

National

విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు

ఈమధ్యకాలంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కామన్ అయిపోతోంది. సెలబ్రిటీలకు , విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల అధికారులు కూడా అలర్ట్ అవుతూ పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి పుణే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని టేకాఫ్ కు కొన్ని నిమిషాల…

National

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ

జనవరి 16, 17 తేదీల్లో బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ భేటీ (BJP national executive meet) జరగనుంది. పార్టీ అగ్రనేతలు పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. Cabinet reshuffle buzz: కేంద్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరున ప్రారంభమవుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ప్రధాని మోదీ (PM Modi) మంత్రివర్గ విస్తరణ (Cabinet reshuffle) చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరును బట్టి కొందరు మంత్రులకు…

National

గడ్డి కోసేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో మైనర్ బాలికపై పులి దాడి (Tiger Attacks) ఘటన చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (VTR)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకరం రేకెత్తించింది. గౌన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని బక్రి గ్రామానికి చెందిన దివ్య తన పనిలో నిమగ్నమై కట్టెలు సేకరిస్తోంది. ఈ…

National

జాతీయ వివాదంగా జగన్ ట్వీట్‌, RRR అభినందన రగడ

త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన గ్లోబల్ అవార్డుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు జాతీయ స్థాయిలో వివాదం( Jagan RRR dispute) అయింది. అయన అభినందనలు తెలుపుతూ తెలుగు జెండా(Flag) రెపరెపలాడుతుందని చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ అవార్డు తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. అయితే, ముఖ్యమంత్రి శుభాకాంక్షల సందేశం ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి మింగుడుపడలేదు. సోషల్…

National

పంజాబ్ లో అడుగుపెట్టిన భారత్ జోడో యాత్ర

హరియాణా నుంచి పంజాబ్ లో తన భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. పంజాబ్ లోని అమృతసర్ లో ఉన్న సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయం (Golden Temple) ను ఆయన సందర్శించారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు గడిపారు. సిక్కుల సంప్రదాయ తలపాగాలో రాహుల్ కనిపించారు. Bharat Jodo Yatra: స్వర్ణ దేవాలయం సందర్శన స్వర్ణ దేవాలయం(Golden Temple) నుంచి ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సర్హింద్ లో రాహుల్ మంగళవారం రాత్రి…

National

మరో వివాదంలో ఎయిరిండియా భోజనంలో రాళ్లు?

ఇటీవల విమానాల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. విమానాల్లో ప్రయాణికుల దాడులు, అనుచితంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. అలాగే విమానాల్లో సర్వ్ చేసే ఫుడ్ విషయంలో కూడా అనేక లోటుపాట్లు వెలుగుూస్తున్నాయి. నాసిరకం ఫుడ్ ను ప్రయాణికులకు అందిస్తున్నారు. దీంతో ప్రయాణికులు విమాన సంస్థలపై మండిపడుతున్నారు. తాజాగా ఎయిర్ ఇండియా విమానం భోజనంలో రాయి వచ్చింది. దీనిపై ప్యాసింజర్లు మండిపడుతున్నారు. ఓ ప్యాసింజర్ ఈ ఫోటోను సోషల్…

National

ఆధ్యాత్మిక పట్టణాన్ని కాపాడేందుకు కీలక నిర్ణయం

ఉత్తరాఖండ్‍ (Uttarakhand) లోని ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్ ప్రమాదంలో పడింది. ఏకంగా పట్టణమే (Sinking of Joshimath) కుంగిపోతోంది. వందలాది ఇళ్లకు ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. క్రమంగా రోడ్లపై కూడా పగుళ్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలో అక్కడి ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జోషిమఠ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం.. ఆదివారం కీలకమైన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా (PK Mishra) నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. జోషిమఠ్‍లో…

National

పోలీసులు ఇచ్చే టీలో విషం ఉందన్న అఖిలేష్ యాదవ్..

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు టీ ఇస్తే తాగలేదు. ఆ టీలో విషం కలిపి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మీడియా వ్యవహారాలు పర్యవేక్షించడంతోపాటు, పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను నిర్వహించే మనీష్ జగన్ అగర్వాల్‌ను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు…

National

జోషి మఠ్ పట్టణం ఎందుకు భూమిలోకి కుంగిపోతోంది?

ఉత్తరాఖండ్ లోని ప్రధాన పట్టణాల్లో ఒకటి జోషి మఠ్ (Joshimath). ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక, అడ్వెంచర్ ప్రయాణాలకు తొలి మెట్టు జోషిమఠ్ (Joshimath). హిమాలయాలపై ట్రెక్కింగ్, లేదా బద్రీనాథ్ తీర్థ యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. Why Joshimath is sinking?: నెమ్మది నెమ్మదిగా కుంగిపోతోంది.. జోషి మఠ్ (Joshimath) పట్టణం కుంగిపోతున్న విషయాన్ని గుర్తించి చాన్నాళ్లే అయింది. కానీ, ఆ ప్రక్రియ తీవ్రమవడం ఇటీవలనే ప్రారంభమైంది. ఇళ్ల గోడలపై, రోడ్ల పై పగుళ్లు కనిపించడం ప్రారంభమైంది.…

National

భారత్ లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావకాశాలు లభించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు

భారత్ లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావకాశాలు లభించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విదేశీ విద్యాసంస్థలు భారత్ లో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేసుకునేందుకు, వాటికి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. Foreign varsities in India: ఇకపై ఆ అధికారం కూడా.. భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేసే విదేశీ యూనివర్సిటీలు తమ అడ్మిషన్ విధానాన్ని, తమ ఫీజులను తామే నిర్ణయించుకునేందుకు అనుమతించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(University Grants Commission UGC)…