రాత్రి రోడ్డుపై నడిచినందుకు దంపతులకు రూ.3,000 ఫైన్..
సాధారణంగా రాత్రివేళల్లో రోడ్లపై చాలా మంది తిరుగుతుంటారు. డిన్నర్లకో, ఫంక్షన్లకో వెళ్లినప్పుడు లేట్ అయితే రోడ్లపై నడిచివెళుతుంటారు. బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఇది సర్వసాధారణం. అయితే ఇలాగే రాత్రి వేళ నడిచి వెళుతున్న దంపతులకు బెంగళూరులో వింత అనుభవం ఎదురైంది. పోలీసులు తమను వేధించారని కార్తీక్ పత్రీ అనే వ్యక్తి వెల్లడించారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై నడిచినందుకు పోలీసులు రూ.3,000 ఫైన్ వేశారని, చివరికి రూ.1,000 వసూలు చేసుకొని పంపించారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.…

