National

National

భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్..!

భారత రక్షణ రంగం మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగానే అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేసుకునే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదముద్ర వేశారు. చైనా తన వైమానిక శక్తిని వేగంగా విస్తరించుకోవడమే కాకుండా, పాకిస్థాన్‌కు కూడా అత్యాధునిక యుద్ధ విమానాలను అందించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ సరికొత్త యుద్ధ విమానం రెండు ఇంజన్లతో, ఐదో తరం (ఫిఫ్త్…

National

సీఆర్పీఎఫ్ జవాన్ గూఢచర్యం కలకలం.. ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..!

దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. మోతీరామ్ జాట్ అనే ఈ జవాను పహల్గామ్‌లో ఉగ్రదాడికి ఆరు రోజుల ముందు వరకూ అక్కడే విధులు నిర్వర్తించాడు.   అధికారల కథనం ప్రకారం.. మోతీ రామ్ జాట్ 2023 నుంచి పాకిస్థాన్ గూఢచార సంస్థలకు సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నాడు. అతడి…

National

కొత్త టోల్ పాలసీ తీసుకువస్తున్న కేంద్రం..

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌లతో ఇబ్బందులు పడే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఖర్చు తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.   తాజా ప్రతిపాదనలో భాగంగా, వాహనదారులు త్వరలో రూ.3 వేల వార్షిక రుసుము చెల్లించే అవకాశం రావచ్చు. తద్వారా వారు ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేలపై…

National

రూ.840 కే నెలంతా అపరిమిత ఇంటర్నెట్ ఆఫర్ తో స్టార్ లింక్ ఎంట్రీ..!

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సహా ప్రముఖ అంతర్జాతీయ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆకర్షణీయమైన ప్రణాళికలు రచిస్తున్నాయి. వినియోగదారులను వేగంగా ఆకట్టుకునేందుకు, ప్రారంభంలో నెలకు రూ. 840 రూపాయలకే అపరిమిత డేటా ప్లాన్లను అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతో మధ్య, దీర్ఘకాలంలో సుమారు కోటి మంది వినియోగదారులను చేర్చుకోవాలన్నదే ఈ సంస్థల టార్గెట్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధిక స్పెక్ట్రమ్ ఖర్చులను పెద్ద సంఖ్యలో యూజర్లతో భర్తీ చేసుకోవచ్చనే వ్యూహంతో మార్కెట్…

National

ఢిల్లీకి పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్..! భారీ ఉగ్రకుట్ర భగ్నం..!

దేశంలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. నిఘా సంస్థల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నేరుగా యుద్ధం చేసే సత్తా లేక ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ దాడులు చేయాలనే దాయాది ప్లాన్‌కు చెక్‌ పెట్టాయి భారత నిఘా సంస్థలు. ఈసారి వారి ఎత్తులకు పైఎత్తు వేయడంతో దేశ రాజధానిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇందుకోసం మూడు నెలల పాటు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాయి ఇండియన్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీస్. ఓ పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌తో పాటు.. అతడికి సహకరించిన మరో…

NationalTechnology

గూగుల్ ఏఐ మోడ్… ఏదైనా చిటికెలోనే..!

ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసే దిశగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కీలక అడుగులు వేస్తోంది. తన వార్షిక డెవలపర్ల సమావేశం ‘గూగుల్ I/O 2025’లో భాగంగా, వినియోగదారుల కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత షాపింగ్ ఫీచర్లను ఆవిష్కరించింది. ఈ నూతన ఆవిష్కరణలు కొనుగోలు ప్రక్రియను మరింత వ్యక్తిగతంగా, సౌకర్యవంతంగా మార్చనున్నాయి.   గూగుల్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ AI షాపింగ్ ఫీచర్లకు జెమినీ AI సాంకేతికత మరియు గూగుల్ షాపింగ్ గ్రాఫ్…

National

పాక్ ఏజెంట్ కు పెళ్లి ప్రపోజల్ చేసిన యూట్యూబర్ జ్యోతి..!

దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూ సంచలనం సృష్టిస్తోంది.   గత వారం అదుపులోకి తీసుకున్న జ్యోతి మల్హోత్రాను అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు…

National

జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు..!

దేశ ద్రోహి,పాక్‌ గూఢచారి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ టూర్ కు సంబంధించిన వివరాలను పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పాకిస్థాన్ జర్నీ ఆహ్లాదకరంగా సాగిందని.. అక్కడ ఆతిథ్యం బాగుందని రాసుకొచ్చింది.   ఈ మేరకు జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ ను పొగుడుతూ రాసుకున్నట్లు పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు.…

National

ఇండియాలో పెరుగుతున్న కరోనా జేఎన్.1 కేసులు… వ్యాధి లక్షణాలు ఇవే..!

దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటం గమనార్హం.ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే, హాంకాంగ్,…

National

భారత సైన్యానికి కీలక అధికారాలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం..

పాకిస్థాన్ తో ఇటీవలి ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలకు కీలక అధికారాలను అప్పగించింది. అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సుమారు రూ.40,000 కోట్ల పరిమితితో అత్యవసర ఆయుధ సేకరణ (ఎమర్జెన్సీ ప్రొక్యూర్‌మెంట్ – ఈపీ) అధికారాలను త్రివిధ దళాలకు కల్పిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) కొద్ది రోజుల క్రితమే ఆమోదముద్ర వేసినట్లు…