ఈవీఎంలోని డేటాను తొలగించవద్దు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు..
ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించద్దని దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలను పాటిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించవద్దని, ఏ డేటాను రీలోడ్ చేయవద్దని ఎన్నికల సంఘాన్ని కోరింది. వాటిని పరిశీలించాల్సి ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం…