National

National

పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. పశ్చిమాసియాలో 27 రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. యుద్ధానికి అమెరికా తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సంఘర్షణ కొనసాగుతోంది.   సంక్లిష్ట పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం   పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ప్రధానమంత్రి…

National

మతం మారితే రిజర్వేషన్లు కట్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

రాజ్యాంగబద్ధంగా సంక్రమించే రిజర్వేషన్ ఫలాల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాలకు (SC) కేటాయించిన ప్రయోజనాలు కేవలం నిర్దేశిత మతాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేస్తూ, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు తమ ఎస్సీ హోదాను కోల్పోతారని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో మత మార్పిడి చేసుకున్న వారు ఇకపై ఎస్సీ రిజర్వేషన్ల కింద పొందే రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలకు అనర్హులవుతారని న్యాయస్థానం తేల్చి చెప్పింది.   అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన…

National

ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు..

పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడుకుతున్న సముద్ర మార్గంలో భారత నౌకాదళం పటిష్ట భద్రత నడుమ మూడు కీలక ఇంధన నౌకలు భారత్‌కు బయల్దేరాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠి తన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు.   విశ్వసనీయ వర్గాల సమాచారం…

National

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక ముందడుగు.. 50శాతం పెరగనున్న ఎంపీ సీట్లు..!

మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల (2029) నుంచి చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన రెండు బిల్లులను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఒక సరికొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం లోక్‌సభలోని ప్రస్తుత 543 స్థానాలను 50 శాతం పెంచి, మొత్తం 816కి చేర్చనున్నారు. కొత్తగా పెరిగే 273 సీట్లను పూర్తిగా…

National

అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు..

అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా పరిధిలోని మారుమూల కొండ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలింది. జోర్హాట్ ఎయిర్‌ బేస్ నుండి బయలు దేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. చొకిహోలా పరిధిలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందులోవున్న ఇద్దరు పైలట్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.   గురువారం సాయంత్రం అసొంలోని జోర్హాట్‌లోని వైమానిక బేస్ నుండి బయలు దేరింది సుఖోయ్-30…

NationalTechnology

ఆ వీడియోలు పోస్ట్ చేస్తే 90 రోజుల సస్పెన్షన్.. ‘ఎక్స్’ కొత్త నిబంధన..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) తమ కంటెంట్ క్రియేటర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన యుద్ధ సంబంధిత వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు, ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అలాంటి క్రియేటర్లను రెవెన్యూ-షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి 90 రోజుల పాటు సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించింది.   ఈ కొత్త నిబంధనలను ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బేర్ వెల్లడించారు. యుద్ధ సమయాల్లో తప్పుడు…

National

ఇరాన్‌పై యుద్ధంలో ఏఐ ఆయుధాలు రంగంలోకి దించిన అమెరికా..

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణలో అమెరికా సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన ఈ యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అటానమస్ వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం నాడు ధృవీకరించారు. పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ ఏఐ సామర్థ్యాలున్న డ్రోన్లు, ఇతర వ్యవస్థలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా వాటి పూర్తి వివరాలను వెల్లడించలేనని స్పష్టం చేశారు.  …

National

ఇరాన్‌పై యుద్ధం నిలిపివేయాలన్న రష్యా, చైనా… వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న అమెరికా..

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యా, చైనా చేసిన విజ్ఞప్తులను అమెరికా తోసిపుచ్చింది. ఈ ఘర్షణ పూర్తిగా టెహ్రాన్ అణు కార్యక్రమం, సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోందని, ఇందులో ఇతరుల ప్రమేయం అవసరం లేదని స్పష్టం చేసింది. బుధవారం నాడు పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మాట్లాడారు. ఈ విషయంలో బీజింగ్ లేదా మాస్కోతో తాము చర్చించడం లేదని, ప్రస్తుత ఘర్షణలో వారి ప్రమేయం ఏమాత్రం…

National

ఇరాన్‌పై దాడికి ముందు 74 సార్లు హెచ్చరించిన ట్రంప్..

ఇరాన్‌పై సైనిక చర్యల దిశగా ఆలోచన చేస్తున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మరోసారి ప్రపంచానికి స్పష్టం చేశారు. ఇరాన్‌ను అణ్వాయుధాలు కలిగి ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తాను దశాబ్దాలుగా చెబుతున్న మాటనూ గుర్తుచేశారు. ఈ విషయంలో ట్రంప్ మొదటి నుంచీ ఒకే వైఖరితో స్థిరంగా ఉన్నారని వైట్‌హౌస్ సోమవారం ప్రకటించింది. ఇందుకు నిదర్శనంగా గత 15 ఏళ్లలో ఆయన చేసిన 74 కీలక ప్రకటనల జాబితాను విడుదల చేసింది.  …

National

ఇరాన్ యుద్ధ విమానాలను కూల్చివేసిన ఖతార్..

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌ ల దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన దాడులు గల్ఫ్ దేశాలను వణికిస్తున్నాయి. ఈ క్రమంలో ఖతార్ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్‌కు చెందిన రెండు ఎస్ యూ-24 యుద్ధ విమానాలను ఖతార్ వైమానిక దళం కూల్చివేసింది. తమ దేశంపైకి దూసుకొస్తున్న ఇరాన్ యుద్ధ విమానాలను గుర్తించిన వెంటనే కూల్చివేసినట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు 7 బాలిస్టిక్ క్షిపణులను నావికా,…