National

National

విమాన ప్రమాదంలో 241 మంది మృతి.. ఒకరు మాత్ర‌మే బ‌తికారు: ఎయిరిండియా ప్ర‌క‌ట‌న‌..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన AI171 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ధ్రువీకరించింది. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.…

National

అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా విమానం… విమానంలో 242 మంది ప్రయాణికులు..!

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో గురువారం ఒక పెను విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్‌ పరిధిలోని ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.   అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరేందుకు సిద్ధమైన ఎయిరిండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ…

National

ఎయిరిండియా విమాన ప్రమాదం… మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్..

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఎయిరిండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ అండగా నిలిచింది. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన టాటా గ్రూప్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ప్రమాదంలో గాయపడిన వారి వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని స్పష్టం చేసింది.   ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.…

National

అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్..

రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజును భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం.   వైసీపీ అనుబంధ సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు…

National

సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో.. నీటి సంక్షోభంతో పాక్ విలవిలా..!

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో పాకిస్థాన్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో, ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు సింధు నదీ వ్యవస్థ నుంచి అందే నీటిలో భారీగా కోత పడింది. జూన్ 5న సింధు బేసిన్ నుంచి పాక్ డ్యామ్‌లకు 1,24,500 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలైందని, గత ఏడాది ఇదే సమయానికి ఇది సుమారు 1,44,000 క్యూసెక్కులుగా…

National

హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు..

హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక తన కోడలు సోనమ్ హస్తం ఉందని, ఆమె కిరాయి హంతకులతో తన కుమారుడిని చంపించిందని ఆరోపించారు. ఒకవేళ తన కోడలు దోషిగా తేలితే, ఆమెకు మరణశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.   ఇటీవల వివాహం చేసుకున్న రాజా రఘువంశీ, తన భార్య సోనమ్‌తో కలిసి…

National

అదానీ పోర్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక..

భారత సముద్ర వాణిజ్య రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక ‘ఎంఎస్‌సీ ఇరినా’ ఈ రోజు అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న కేరళలోని విళింజం అంతర్జాతీయ ఓడరేవుకు చేరుకుంది. ఈ భారీ నౌక మంగళవారం వరకు ఇక్కడే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పరిణామం అత్యంత భారీ కంటైనర్ నౌకలను (అల్ట్రా-లార్జ్ కంటైనర్ వెసెల్స్ – యూఎల్‌సీవీ) నిర్వహించడంలో విళింజం పోర్టుకున్న అపార సామర్థ్యాన్ని స్పష్టం చేస్తోంది.   ప్రపంచంలోనే అత్యధిక టీఈయూ…

NationalTechnology

ఇక ఉబెర్ హెలికాప్టర్ సేవలు..! ఎప్పుడు..? ఎక్కడంటే..?

టాక్సీ సేవలందించే ప్రముఖ యాప్ ఉబెర్ లో సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కార్, ఆటో, బైక్ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. తాజాగా హెలికాప్టర్ బుకింగ్ సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ సర్వీస్ కేవలం ఇటలీలో మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇటీవలి కాలంలో పర్యాటకుల రద్దీ పెరగడంతో ఇటలీలోని అమాల్ఫీ తీరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది.   కొద్ది దూరం ప్రయాణించాలన్నా చాలా సమయం…

National

సింధూ జలాల కోసం పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి.. భారత్‌కు వరుస లేఖలు..!

సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ పాకిస్థాన్ ఇప్పటివరకు నాలుగు సార్లు భారత్‌కు లేఖలు రాసింది. మే నెల ఆరంభంలో ఒక లేఖ పంపగా, ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం మరో మూడు లేఖలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ లేఖలు పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు అందినట్లు సమాచారం.   సింధూ నదీ జలాలను నిలిపివేస్తే…

National

బంగ్లాదేశ్ చొరబాటుదారుల చేతికి చిక్కిన భారత సైనికుడు..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు దుండగులు భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్‌ను అపహరించి, కొన్ని గంటల పాటు బందీగా ఉంచుకున్నారు. బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో చర్చలు జరపడంతో ఆ జవాన్ సురక్షితంగా విడుదలయ్యాడు.   అసలేం జరిగింది? అధికారిక వర్గాల సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా పరిధిలో ఈ ఘటన…