National

National

కేంద్ర బడ్జెట్ 2025-26.. రైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం మరెన్నో..

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ బడ్జెట్‌లోని ముఖ్యమైన పథకాలు, నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.   * KCC ద్వారా లోన్ల పెంపు: కిసాన్ క్రెడిట్…

National

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. కీలక బిల్లుల ఎంట్రీ..?

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతోపాటు మొత్తం 16 ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.   ఈ పార్లమెంట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. తొలిరోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో…

National

మ‌హా కుంభ‌మేళాలో తొక్కిస‌లాట‌ ఘ‌ట‌న‌.. సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖ‌లు..

ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభ‌మేళాలో బుధ‌వారం తెల్ల‌వారుజామున తొక్కిస‌లాట చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. మౌని అమావాస్య సంద‌ర్భంగా కోట్లాది మంది భ‌క్తులు ఒకేసారి త‌ర‌లిరావ‌డంతో సంగం ఘాట్ వ‌ద్ద చోటుచేసుకున్న తొక్కిస‌లాట‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.   ఈ దుర్ఘ‌ట‌న‌పై యూపీలోని యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాలంటూ తాజాగా దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయింది. విశాల్ తివారీ అనే న్యాయ‌వాది ఈ వ్యాజ్యాన్ని వేయ‌డం జ‌రిగింది.   భ‌విష్య‌త్తులో ఇలాంటి…

National

ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోదీ వివరణ.. 2036 లో..

ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు సంబంధించి ప్రధానమంత్రి మోదీ కీలక ప్రకటన చేశారు. 38వ జాతీయ క్రీడలను డెహ్రాడూన్‌లో ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఒలింపిక్స్ వల్ల అనేక రంగాల్లో విస్తృత అవకాశాలు వస్తాయని అన్నారు.   భారత్‌లో 2036 ఒలింపిక్స్ నిర్వహణ హక్కుల కోసం తాము విశ్వప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇవి కేవలం క్రీడలకే పరిమితం కాదని, ఇవి జరిగిన ప్రదేశాలలో అన్ని రంగాలు లాభపడతాయని ఆయన అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణతో…

National

కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణకు భారత్-చైనా అంగీకారం..

2020లో కరోనా సమయంలో నిలిచిపోయిన కైలాస మానస సరోవర యాత్రను పునరుద్ధరించేందుకు భారత్-చైనా దేశాలు అంగీకరించాయి. అలాగే, ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి. విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో ఇరు దేశాల మధ్య రెండ్రోజుల పాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చర్చల కోసం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బీజింగ్‌లో పర్యటించారు.   భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య అక్టోబర్‌లో రష్యాలోని…

National

దేశంలో మరో మహమ్మారి.. వేగంగా పెరుగుతున్న కేసులు..

దేశంలో మరో ప్రాణాంతక మహమ్మారి ప్రబలుతోంది. మహారాష్ట్రలో గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసులు వేగంగా పెరుగుతుండటంతో పూణెలో తొలి మరణం సంభవించింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను ఆదివారం వెల్లడించింది. పూణే కేంద్రంగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి బ్యాక్టీరియా కారణంగా ఈ మరణం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.   జనవరి 9న జీబీఎస్‌ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడు ఒక చార్టర్డ్ అకౌంటెంట్. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాకు…

APNational

వందో ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం.. నావిక్-2 ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు శ్రీహరికోట సతీశ్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి నావిక్-2 ఉప గ్రహాన్ని ప్రయోగించనుంది. దాదాపు 2,500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా నింగిలోకి పంపనున్నారు.   శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం నిర్మించిన తర్వాత చేపడుతున్న వందో ప్రయోగం ఇది. అంతేకాదు, ఈ ప్రయోగానికి మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. నింగిలోకి…

National

ట్రంప్ తో చర్చలకు పుతిన్ రెడీ..

దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్చువల్‌‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఆయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. రష్యా, చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతు ఇస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.   ఈ తరుణంలో రష్యా నుంచి కీలక ప్రకటన వెలువడింది. డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారంటూ…

National

ఒకరినొకరు పెళ్లి చేసుకున్న మహిళలు.. యూపీలో ఘటన..

భర్త నిత్యం తాగి వచ్చి తిడుతూ కొడుతుండడంతో విసిగిపోయిందో మహిళ.. తనలాంటి బాధితురాలు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కావడంతో స్నేహం పెంచుకుంది. భర్తల ఆగడాలను ఇక భరించలేక ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు.   ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ వింత పెళ్లి గురించిన వివరాలు.. యూపీకి చెందిన మహిళలు కవిత, గుంజ అలియాస్ బబ్లూలకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకేరకమైన సమస్యతో…

National

మణిపుర్‌లో బిజెపికి జేడీయూ షాక్..

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారినట్లుగా కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజేపీ)కి ఇంతవరకు మద్దతు ప్రకటించిన జనతా దళ్ యునైటెడ్ (జేడియూ).. తాజాగా తన మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు జేడీయూ పార్టీ మణిపూర్ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ (ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కాదు) ప్రకటన జారీ చేశారు. మణిపూర్ లో తమ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతోందని.. తమ పార్టీకి…