విమాన ప్రమాదంలో 241 మంది మృతి.. ఒకరు మాత్రమే బతికారు: ఎయిరిండియా ప్రకటన..
గుజరాత్లోని అహ్మదాబాద్లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన AI171 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ధ్రువీకరించింది. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.…