పార్లమెంట్ డ్రామా కాదు, చర్చా వేదిక: ప్రధాని వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ ఘాటు కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీ చట్టసభల్లో ‘డ్రామాలు ఆడవద్దు’ అంటూ విసిరిన వ్యంగ్యాస్త్రాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. సమావేశాల్లో భాగంగా ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఢిల్లీ కాలుష్యం వంటి తీవ్రమైన అంశాలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. సీరియస్ అంశాలపై చర్చ లేకపోతే పార్లమెంట్ దేనికి? అని ఆమె ప్రశ్నించారు. ఆయా అంశాలపై మాట్లాడటమేమీ డ్రామా కాదని, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య చర్చలకు అనుమతించకపోవడమే నిజమైన…

