National

National

ఉత్తరాఖండ్ భారీ వరదలు..! ఊరు గల్లంతు.. భారీ ప్రాణ నష్టం..!

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదలు పెను బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరకాశీలోని ధరాలీలో కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా, తాజాగా దాదాపు పది మంది సైనికులు వరదనీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.   వరదకు తీవ్రంగా ప్రభావితమైన ధరాలీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. హర్షిల్ ఆర్మీ క్యాంపస్‌కు దిగువన ఉన్న సైనికులు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.…

National

అందుబాటులోకి రానున్న ‘పాన్ 2.0’..

దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ శుభవార్త చెప్పింది. పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), టాన్ (పన్ను తగ్గింపు, సేకరణ ఖాతా సంఖ్య) సంబంధిత సేవలను మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ‘పాన్ 2.0’ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రస్తుతం మూడు వేర్వేరు పోర్టళ్లలో అందుబాటులో ఉన్న ఈ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రముఖ ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్‌ట్రీకి అప్పగించినట్లు ఓ ఉన్నతాధికారి సోమవారం వెల్లడించారు.…

National

జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా.. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల..

నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9న నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయగా, దానిని రాష్ట్రపతి ఆమోదించడంతో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.   ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల, 21న నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ, 22న స్క్రూటినీ ఉంటుంది. ఆగస్టు 25వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 9న…

National

ట్రంప్ 25 శాతం సుంకాలపై కేంద్రం స్పందన..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం భారత ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అయినప్పటికీ దీనిని ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలను రూపొందిస్తామని తెలిపింది.   ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకం వల్ల భారత్ నుంచి ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్…

National

నాతో డీల్ చేయండి..! అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు..

‘ఆపరేషన్ సిందూర్’పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో డీల్ చేయాలని, ప్రధానమంత్రి వస్తే ఇంకా ఇబ్బందిపడతారంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.   చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనకపోవడాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించారు. అమిత్ షా ప్రసంగిస్తుండగా విపక్షాలు వాకౌట్ చేశాయి.   అమిత్ షా మాట్లాడేందుకు నిలబడగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో ప్రధానమంత్రి…

National

నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్16… విజయవంతంగా కక్ష్యలోకి ‘నైసార్’..

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ, భారత వాహన నౌక జీఎస్ఎల్వీ-ఎఫ్16 నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్ ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఈ ఉపగ్రహం బరువు 2,393 కిలోలు.   నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. ఇందులో ఉండే రెండు భారీ డిష్ ల వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియో వేవ్…

NationalSPORTS

భార‌త్‌, పాక్ సెమీస్ పోరుపై నీలినీడ‌లు.. త‌ప్పుకున్న స్పాన్స‌ర్‌..!

వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌) 2025లో భాగంగా నిన్న‌ వెస్టిండీస్ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియ‌న్స్ విజ‌యం సాధించి సెమీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక‌, సెమీస్‌లో దాయాది పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డాల్సి ఉంది. అయితే, ఈ సెమీస్ పోరుకు భారీ అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే పాక్‌తో భారత్ ఆడే విషయంపై సందిగ్దత నెలకొనగా.. తాజాగా ఈ టోర్నీ స్పాన్సర్స్ ఈజ్‌మైట్రిప్‌ ఈ మ్యాచ్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి త‌ప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం…

National

సింధూ జలాల ఒప్పందం… కీలక ప్రకటన చేసిన జై శంకర్ .

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత కొనసాగుతోందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ఆయన పునరుద్ఘాటించారు. బుధవారం నాడు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పారు.   సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్న పాలకులు భారత రైతుల ప్రయోజనాల కంటే పాకిస్థాన్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన…

National

పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ రచ్చ.. సహనం కోల్పోయిన అమిత్ షా..

లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ తీవ్ర రచ్చకు దారితీసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను విపక్షాలు పదేపదే అడ్డుకోవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహనం కోల్పోయారు. విపక్షాలు దేశ విదేశాంగ మంత్రిని నమ్మకుండా, విదేశీ వాదనలను నమ్ముతున్నాయని తీవ్రంగా విమర్శించారు.   పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కాల్పుల విరమణ వాదనలను జైశంకర్ ఖండించారు. మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఆయన స్పష్టం…

National

ఉగ్రవాదుల మతం చూసి బాధపడొద్దు.. అఖిలేశ్ యాదవ్ కు అమిత్ షా కౌంటర్..

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులను ఉగ్రవాదులు మతం అడిగి మరీ కాల్చి చంపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో వెల్లడించారు. ఇది అత్యంత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయని, ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించడంతో పాటు వారు దేశం దాటకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చేపట్టిన చర్చలో హోంమంత్రి అమిత్ షా ఈ రోజు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాదులను…