National

National

మేం శాంతిని కోరుకుంటుంటే… పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికన్ ఏఐ రీసెర్చర్, ప్రముఖ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ నిర్వహించిన ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంటే, అందుకు బదులుగా పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయని అన్నారు.   2014లో తన ప్రమాణ స్వీకారానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని, తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఒక కొత్త ప్రారంభం…

National

ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె..

వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు పలు డిమాండ్లపై ఇండియన్ బ్యాంకు అసోసియేషన్స్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది.   ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగులు, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలన్న అంశాలు యూఎఫ్‌బీయూ డిమాండ్లలో ఉన్నాయి. ఆర్థిక సేవల విభాగం ఇటీవలి సూచనలను ఉపసంహరించుకోవాలని, ఇవి ఉద్యోగ…

National

మరో మైలురాయి సాధించిన ఇస్రో.. స్పేడెక్స్ డీ-డాకింగ్ ప్రక్రియ సక్సెస్..

అంతరిక్ష ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అద్భుతమైన ఘనతను సాధించింది. ఇస్రో గురువారం తన స్పేడెక్స్ డీ-డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే ఈ మిషన్‌ను ఇస్రో చేపట్టింది. భవిష్యత్ లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రకు అవసరమైన ఈ కీలక పరిజ్ఞానాన్ని ఇస్రో ఒడిసిపట్టింది.భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4, గగన్‌యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలకు ఇస్రో మార్గం సుగమం చేసినట్లు.. భారత అంతరిక్ష సంస్థకు…

National

యూపీఐ యూజర్లకు భారీ షాక్..! ఇకపై చెల్లింపులపై ఛార్జీలు వసూల్..

యూపీఐ (UPI) అనేది భారతదేశంలో రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థ, ఇది మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి బ్యాంకు ఖాతాల మధ్య డబ్బును తక్షణమే బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది.యూపీఐ లావాదేవీలు తక్షణమే జరుగుతాయి.అయితే ఇప్పటి వరకు ఫ్రీగా ఈ సేవలు అందించడం జరిగింది. యూపీఐ చెల్లింపుల అధిక మొత్తంలో జరగడంతో వీటిపై వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేయాలని చాలా కాలం నుంచి ప్రతిపాదన కొనసాగుతున్న సంగతి…

National

కన్నడ నటి బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి..

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యా రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల విచారణలో రన్యా రావు గతేడాది 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిందని తేలింది. దుబాయ్ వెళ్లిన ప్రతిసారీ తిరిగి వస్తూ కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లను రహస్యంగా దాచి తెచ్చిందని బయటపడింది. కిలో బంగారానికి రూ. లక్ష చొప్పున కమీషన్ అందేదని నటి వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఓ కానిస్టేబుల్ సాయంతో ప్రత్యేక…

CINEMANational

14 కిలోల బంగారంతో పట్టుబడిన కన్నడ నటి…

బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ హీరోయిన్ రన్యారావును బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆమె నుంచి 14 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె తను సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్తెనని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినప్పటికీ పోలీసులు ఆమెపై అక్రమ బంగారం రవాణా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.   సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ డీజీ డాక్టర్ కె రామచంద్రరావు…

National

అసెంబ్లీలోనే పాన్ మసాలా ఉమ్మేసిన ఎమ్మెల్యే..! ఎక్కడంటే..?

పరిసరాల పరిశుభ్రత ఎలాగూ పాటించని నేతలున్న దేశం మనది… అలాంటిది చట్టాలు చేసే సభలను అయినా గౌరవంగా చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పరిశుభ్రత పాటించడం అంటే కోట్ల మంది ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నట్లే.. కానీ, బుద్ధిలేని ఓ ఎమ్మెల్యే ఏకంగా చట్టసభలోనే పాన్ నమిలి ఉమ్మేశాడు. సభ అనుకున్నారో లేక తానుండే ఇళ్లు అనుకున్నారో కానీ కనీసం ఆలోచన లేకుండా.. విధాన సభ ఎంట్రీ దగ్గర పాన్ నమిలి ఉమ్మేసి.. చట్టం గురించి, ప్రజల గురించి చర్చించేందుకు…

National

యూఏఈలో భారత మహిళకు మరణశిక్ష అమలు..! ఏం జరిగిందంటే..?

నాలుగేళ్ల చిన్నారి మృతి కేసులో భారతీయ మహిళకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరణశిక్ష అమలయింది. గత నెల 15వ తేదీన శిక్షను అమలు చేసినప్పటికీ, ఆ విషయాన్ని సోమవారం విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ లోని జందా జిల్లాకు చెందిన మహిళ (30) నాలుగు నెలల చిన్నారిని చంపిన ఆరోపణలపై అబుదాబీలో మరణ శిక్షను ఎదుర్కొంది. యుఏఈ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15న షహజాదీ ఖాన్‌కు మరణశిక్షను అమలు చేశారని విదేశాంగ…

National

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక మహిళ ఆత్మహత్య.. ఎక్కడంటే..?

మరణించిన పెంపుడు పిల్లి మళ్లీ బతుకుతుందని మూడు రోజులపాటు వేచి చూసిన మహిళ.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మొహల్లా కోట్‌కు చెందిన పూజాదేవి (36) పదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి హసాన్‌పూర్‌లో తన తల్లి, ఇద్దరు సోదరులతో కలిసి ఉంటోంది.   మూడేళ్ల క్రితం రోడ్డుపై కనిపించిన ఓ పిల్లిని తెచ్చి పెంచుకుంటోంది.…

National

కేంద్రంపై పోరుకు స్టాలిన్ కీలక నిర్ణయం..

వచ్చే ఏడాది చేపట్టే నియోజకవర్గాల పునర్ విభజన, హిందీ వివాదాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో విభేధిస్తున్న తమిళనాడు ప్రభుత్వం ఇక అమీతుమీకి సిద్ధమైంది. ఇందుకోసం మిగతా అన్ని పార్టీల్ని పోగేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే ఛీఫ్ ఎంకే స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.ఇందులో పాల్గొనాలని అన్ని పార్టీల నేతలకు సందేశాలు పంపుతున్నారు.   దేశవ్యాప్తంగా 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఇందులో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లను భారీగా పెంచేస్తున్న కేంద్రం..…