National

National

అప్పటి వరకు ఆ నీళ్లు ఇచ్చేదేలే..! పాక్ కు మరో షాక్..!

కాల్పుల విరమణ అమలులోకి రావడంతో పాకిస్తాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ని క్షమించేది లేదని అంటున్నారు భారతీయ అధికారులు. పాకిస్తాన్ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదని, ఉగ్రవాదాన్ని పూర్తిగా పక్కనపెట్టే వరకు ఆ దేశంపై జాలి చూపేది లేదని తేల్చి చెబుతున్నారు. తాజాగా సింధు జలాల పంపిణీ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. పాకిస్తాన్ కి సింధు జలాలు వదిలేది లేదని తేల్చి చెప్పారు.   యుద్ధం…

National

దేశ భద్రత కోసం 10 శాటిలైట్లు నిరంతరం పనిచేస్తున్నాయి: ఇస్రో చైర్మన్..

దేశ పౌరుల భద్రత, సురక్షతో పాటు వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణ కోసం పది అత్యంత కీలకమైన ఉపగ్రహాలు నిరంతరం నిఘా నేత్రాలుగా పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. అగర్తలలో ఆదివారం జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (సీఏయూ) ఐదవ స్నాతకోత్సవంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపగ్రహాలు దేశ భద్రతకు కవచంలా నిలుస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు.   “దేశ భద్రతను కాపాడుకోవాలంటే, మనకున్న 7,000 కిలోమీటర్ల…

NationalSPORTS

టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై..!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్ మెంట్ ప్రకటిస్తూ ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు. భారత్‌ తరఫున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్‌ తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో…

National

ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ ఈ ఐదు లక్ష్యాలను నిర్దేశించారు: సంబిత్ పాత్రా..

పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’ వందకు వంద శాతం విజయవంతమైందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఉద్ఘాటించారు. ఈ ఆపరేషన్‌‍కు సంబంధించి మోదీ ఐదు లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండటంతో సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం…

National

సరిహద్దుల వైపు కదులుతున్న పాక్ సైన్యం..!

భారత్ పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పాకిస్థాన్ మరింత పెంచుతోందని ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ పై శనివారం ఉదయం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను మీడియా ముందు పెట్టింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ఈ…

National

పాకిస్తాన్ కు బిగ్ షాక్.. పట్టుబడ్డ పైలట్..!

రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ప్రాంతంలో భారత వైమానిక దళం పాకిస్తాన్ పైలట్‌ను సజీవంగా పట్టుకుంది. ఈ ఘటన మరింత ఆసక్తిని రేపుతోంది, ఎందుకంటే అదే సమయంలో కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ నుండి డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి.   ఢీకొన్న పాకిస్తాన్ విమానాలు.. జైసల్మేర్, అఖ్నూర్ ప్రాంతాల్లో రెండు పాకిస్తాన్ విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే, భారత వైమానిక దళం సమర్థవంతంగా స్పందించి, పాకిస్తాన్ పైలట్‌ను పట్టుకోగలిగింది. భారత వైమానిక దళం ఈ…

National

కరాచీ పోర్టుపై భారత్ దాడి.. పోర్టులో ఏడు భారీ పేలుళ్లు..

పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. భారత పౌరులను లక్ష్యంగా దాయాది దేశం దాడులు చేస్తోంది. పరిస్థితి గమనించిన భారత్ సైన్యం మూడు వైపులా పాకిస్తాన్‌ను చుట్టుముట్టింది. కేవలం ఎల్ఓసీ వెంబడి మాత్రమే కాకుండా ఆరేబియా సముద్రం వైపు భారత నేవీ రౌండప్ చేసింది. పాకిస్తాన్‌కు సమాచారం చేరుకునే లోపు కరాచీ పోర్టుపై మిస్సైల్ వర్షం కురిపించింది భారత నేవీ.   వార్ మొదలైంది?   పాకిస్థాన్‌ వాణిజ్యం కేంద్రానికి అత్యంత కీలకమైనది కరాచీ…

National

స్వదేశీ ఆకాశ్ క్షిపణి సత్తా.. పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్..

భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత లక్ష్యాలపై పాక్ చేసే కుయుక్తులను భగ్నం చేయడంలో ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ ఆయుధం కీలక పాత్ర పోషిస్తోందని ఏఎన్ఐ వార్తా సంస్థకు అధికారులు తెలిపారు.   భారత సాయుధ దళాలు “మేడ్ ఇన్ ఇండియా” ఆకాశ్ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే వాయు రక్షణ క్షిపణి…

National

బలూచిస్థాన్‌లో బీఎల్‌ఏ దాడి.. 14 మంది పాక్ సైనికుల మృతి..

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి నెత్తురు పారింది. వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 14 మంది పాకిస్థానీ సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు బలూచిస్థాన్‌లో తీవ్రమవుతున్న తిరుగుబాటును, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి.   బోలాన్ జిల్లాలోని మాచ్ ప్రాంతంలోని షోర్కాండ్ వద్ద సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీఎల్‌ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్‌టీవోఎస్) రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీతో దాడికి…

NationalTechnology

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు..!

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించే దిశగా కీలక ముందడుగు వేసింది. కేంద్ర టెలికం విభాగం నుంచి ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ అందుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో దేశంలో చౌక ధరలకే వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మరింత మెరుగయ్యాయి.   శాటిలైట్ కమ్యూనికేషన్ ఆపరేటర్ల కోసం నిర్దేశించిన నూతన జాతీయ భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని స్టార్‌లింక్…