భారత్ దాడిలో పీవోకేలోని జల విద్యుత్ కేంద్రం ధ్వంసం.. ..
భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కీలకమైన నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్టు (ఎన్జేహెచ్పీ)ను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు దాడులు చేశాయని, ఈ ఘటనలో ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని పాకిస్థాన్ ఆరోపించింది. మే 6, 7 తేదీల మధ్య రాత్రి ఈ దాడులు జరిగినట్లు పాకిస్థాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో పౌర ప్రాణనష్టం కూడా జరిగిందని పాక్ పేర్కొంది. పాకిస్థాన్ ప్రముఖ వార్తా సంస్థ ‘డాన్’ కథనం…

