National

National

బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసులు… ఐసీఎంఆర్ స్పందన..

కరోనా మహమ్మారి దెబ్బకు హడలిపోయిన ప్రపంచ దేశాలను మరో వైరస్ కలవరపెడుతోంది. దాని పేరు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్). చైనాలో ఈ వైరస్ తీవ్రస్థాయిలో ప్రబలుతోందంటూ ఇటీవల కథనాలు వచ్చాయి.   తాజాగా, భారత్ లోనూ హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేగింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆసక్తికరంగా స్పందించింది. ప్రపంచ దేశాల్లోనే కాకుండా, భారత్ లోనూ ఈ వైరస్ వ్యాప్తిలో…

National

దేశీయంగా ప్రభుత్వ బడుల్లో భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య..

దేశంలోని ప్రభుత్వ పాఠశాల్లలో విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైందని కేంద్ర పాఠాశాల విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రెండు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) నివేదికల్ని విడుదల చేసింది. ఇందులో 2018-19 తో పోల్చితే 2023-24 విద్యా ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యలోని తగ్గుదలను ప్రస్తావించింది.   UDISE+ అనేది ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచి హయ్యర్ సెకండరీ వరకు పాఠశాల విద్యార్థులకు సంబంధించిన అన్ని…

National

చైనాలో మరో వైరస్.. కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త.. భారత్ ప్రభుత్వం హెచ్చరిక..

కొవిడ్ తో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చైనాలో ఇప్పుడు మరో వైరస్ కేసులు నమోదవడం ఆందోళకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనాలోని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించాలని.. ఒకవేళ ఆ కేసులు భారత్ లోకి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు.. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డును కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది.   దేశంలో శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులతో ఆసుపత్రులకు…

NationalSPORTS

శుభ్ మన్ గిల్‌, సాయి సుదర్శన్‌లకు సీఐడీ సమన్లు..!

రూ. 6వేల కోట్ల‌ పోంజీ స్కామ్ గుజ‌రాత్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ కుంభ‌కోణం సెగ‌ క్రికెట‌ర్ల‌ను తాకింది. అధిక వ‌డ్డీ ఆశ‌చూపి ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి రూ.6వేల కోట్లు జ‌మ చేసిన బీజెడ్ గ్రూప్ అధినేత భూపేంద్ర సింగ్ ఝ‌లాను ఇప్ప‌టికే సీఐడీ అదుపులోకి తీసుకుంది.   కాగా, బీజెడ్ గ్రూపులో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాళ్లు పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, సాయి సుద‌ర్శ‌న్‌,…

National

తొలి రోజే దేశవ్యాప్తంగా రైతన్నలపై కేంద్రం వరాల జల్లు..

నూతన ఏడాది ప్రారంభమైన తొలి రోజే దేశవ్యాప్తంగా రైతన్నలపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి, కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతన్నలకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.   కొత్త సంవత్సరంలో కేంద్ర కేబినెట్ సమావేశాన్ని జనవరి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ, హాజరు కాగా రైతన్నలకు సంబంధించిన పలు పథకాలపై సుదీర్ఘ…

National

బంగాళాఖాతంపై గ్లాస్ బ్రిడ్జి- సూర్యోదయం ఇక మరింత అందం..

ఇంకొన్ని గంటల్లో ఈ ప్రపంచం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఎన్నో కొత్త ఆశలతో 2025 రాబోతోంది. కొత్త ఏడాదిని స్వాగతం పలకడానికి భారత్ సహా అన్ని దేశాలు సంసిద్ధం అయ్యాయి. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలో ఎంట్రీ ఇవ్వబోతోంది.   కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొత్త ఏడాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఈ క్రమంలో పలు ఆధ్యాత్మిక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో…

National

నేడు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: కేంద్ర హోంశాఖ..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.  ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరుగుతాయని తెలిపింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్టు ఈ మేరకు ఓ ప్రకటనలో కేంద్ర హోంశాఖ తెలిపింది.   కేంద్ర కేబినెట్ సంతాపం   మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం…

National

కెన‌డా నుంచి అమెరికాకు భార‌తీయుల అక్ర‌మ ర‌వాణా.. రంగంలోకి ఈడీ..

కెన‌డా నుంచి అమెరికాకు భార‌తీయుల అక్రమ రవాణా కేసులో కొన్ని కెనడా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భారత్‌కు చెందిన సంస్థల పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ద‌ర్యాప్తు చేప‌ట్టింది. కెనడా నుంచి భార‌తీయ పౌరులను అమెరికాలోకి పంపేందుకు కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. ఈ క్ర‌మంలో అనుకోని సంఘ‌ట‌న‌ల‌తో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. త‌ర‌చూ ఈ కోవ‌కు చెందిన‌ ఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నాయి.   ఇలాంటి ఓ ఘ‌ట‌న 2022 జనవరి 19న జ‌రిగింది. కెనడా-అమెరికా సరిహద్దును…

National

నో- డిటెన్షన్ రద్దు.. టీచర్లకు టెన్షన్..

ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. ముఖ్యంగా 5, 8 తరగతులకు మాత్రమే. పై తరగతులకు వెళ్లే ముందు కచ్చితంగా ఈ రెండు క్లాసుల్లో విజయం సాధించాలి. దీంతో విద్యార్థులు పాసయ్యే భారం ఇకపై ఉపాధ్యాయులపై పడనుంది. పాఠశాల విద్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. నో-డిటెన్షన్ విధానం రద్దు చేసింది. తొలి విడతగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలల్లో…

National

కేజ్రీవాల్, ఆప్ సర్కారుపై బీజేపీ ఛార్జిషీట్..

ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్.. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆప్ సర్కారు, కేజ్రీవాల్ లక్ష్యంగా బీజేపీ చార్జిషీట్‌‌ విడుదల చేసింది. కేజ్రీవాల్ అవినీతి కాలుష్యం నుంచి ఢిల్లీని రక్షించాలని ఓటర్లను కోరింది. గతంలో అన్నా హజారేను ముందుపెట్టి కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన కేజ్రీవాల్.. నేడు అవినీతికి కొత్త ప్రమాణాలను తీసుకొచ్చారంటూ…