National

National

ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ రాణాకు 18 రోజుల కస్టడీ..

ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణాకు ఎన్ఐఏ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రాణాను గత రాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ వాదనలు వినిపించారు.   రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్‌దేవా వాదించారు. రాణాను తమకు 20 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా…

National

తాలిబన్ల మరో వికృత చర్య.. జుట్టు అందంగా అలంకరించుకున్నా జైలుకే..!

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా కత్తిగట్టారు. ఆధునిక పోకడలు పోయి జుట్టును అందంగా కత్తిరించుకుంటే ఇక ఊచలు లెక్కపెట్టుకోవాల్సిందే. జుట్టును అందంగా కత్తిరించుకున్న పురుషులతో పాటు, వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.   కట్టుబాట్ల పేరుతో ఇప్పటి వరకు మహిళలపై అనేక ఆంక్షలు విధించిన తాలిబన్లు ఇప్పుడు పురుషులపైనా పడ్డారని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్ ప్రభుత్వంలోని ‘సదాచార, దురాచార నిరోధ మంత్రిత్వశాఖ’ చర్యల వల్ల…

National

అమెరికా రోడ్ల కంటే మన రోడ్లను అందంగా తీర్చిదిద్దుతాం: నితిన్ గడ్కరీ..

మన దేశంలోని రోడ్లను అమెరికా రహదారుల కంటే అందంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగుంటాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని… కానీ, రోడ్లు బాగున్నందుకే అమెరికా ధనిక దేశం అయిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఒక సందర్భంలో అన్నారని చెప్పారు. దేశ అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రోడ్లు బాగున్న…

National

వక్ఫ్ సవరణ బిల్లు-2025పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, మజ్లిస్..

వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఆమోదం పొందిన విషయం విదితమే.   ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బిల్లు (సవరణ) లోని నిబంధనలు ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వం…

National

మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు భారీ షాక్..! ఏమైందంటే..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ పరిధిలో ఉద్యోగాలు పొందిన 25 వేల మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా, కళంకితమైనదిగా ఉందని పేర్కొంది. దానికి విశ్వసనీయత, చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది.   హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని సుప్రీంకోర్టు…

National

వెబ్ సిరీస్ చూసి బ్యాంకులో చోరీ..

సినిమాల్లో క్రైమ్ స్టోరీలు చూడడం అంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే అవి చాలా ఆసక్తి కరంగా.. సస్పెన్స్ తో ఉంటాయి. కానీ అలాంటి ఘటనలు నిజజీవితంలో జరుగుతుంటే అందరూ భయపడతారు. అయితే థ్రిల్లర్ సినిమాకంటే ఎక్కువ ట్విస్టులతో కూడిన ఒక రియల్ లైఫ్ ఘటన కొన్ని నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయిదు నెలల క్రితం రాష్ట్రంలోని దావణగెరె జిల్లాలో జరిగిన ఒక హై ప్రొఫైల్ బ్యాంక్ చోరీ (Bank Robbery) కేసుని…

National

వక్ఫ్ బిల్లుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన..!

లోక్ సభ ముందుకు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి రేపటి సభా సమావేశాలపై ఉంది. అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడు ఆమోదం పొందాయి. ఈ మేరకు ‘ఇండియా టుడే’ కథనం వెల్లడించింది.   ఆమోదం పొందిన సవరణలు: 1. ‘వక్ఫ్ బై యూజర్’గా నమోదైన ఆస్తుల పునఃపరిశీలనకు…

National

లోక్ సభ ముందుకు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు.. పాసయ్యేనా..?

పార్లమెంటులో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలలో వక్ఫ్ బిల్లును బుధవారం లోక్ సభలో ప్రవేశ పెట్టాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. లోక్ సభ ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత.. అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశమై సభలో ఈ బిల్లును అడ్డుకోవాలని తీర్మానించాయి. ఇండియా కూటమి మొత్తం ఈ బిల్లుకు…

National

మయన్మార్‌కు మరోసారి భారత్ ఆపన్న హస్తం..!

మయన్మార్‌కు మరోసారి భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆదివారం భారీగా సాయం పంపించింది. శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా శనివారం ప్రధాని మోడీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించారు. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని పంపించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగోన్‌కు పంపించారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్‌ఎస్ కర్ముక్, ఎల్‌సీయూ 52లో 30 టన్నుల సాయాన్ని పంపించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్…

National

మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌లో పెను విప‌త్తు… 1000 దాటిన మృతుల సంఖ్య‌..

మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌ల‌ను శుక్ర‌వారం నాడు రెండు భారీ భూకంపాలు కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌కృతి విప‌త్తు కార‌ణంగా మృతుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. రెండు దేశాల్లో క‌లిపి మృతుల సంఖ్య 1000 దాటింద‌ని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఒక్క మ‌య‌న్మార్‌లోనే 1002 మంది చ‌నిపోయిన‌ట్లు మ‌య‌న్మార్ మిలిట‌రీ అధికారులు తెలిపారు. మ‌రో 2,370 మందికి గాయాలైన‌ట్లు వెల్ల‌డించారు. శిథిలాల కింద చిక్కుకున్న క్ష‌త‌గాత్రుల‌ను రెస్క్యూ సిబ్బంది ర‌క్షించి ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే…