పాకిస్థాన్ ఉగ్రమూకలపై దాడులకు ‘సిందూర్’ పేరే ఎందుకు..?
భారతదేశంపై ఉగ్ర దాడులకు కుట్రలు పన్నుతున్న, వాటిని నిర్దేశిస్తున్న పాక్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేపట్టిన ఈ చర్యలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. భారత సాయుధ దళాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఇందులో భాగంగా, పాకిస్థాన్లోని బహవల్పూర్, మురిడ్కే, సియాల్కోట్ వంటి ప్రాంతాల్లో…

