National

National

ఆగని రైతు నిరసనలు.. మార్చి 6న ఢిల్లీ చలో, 10న దేశ వ్యాప్త రైల్ రోకోకు పిలుపు ..

మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. మార్చి 6న ఢిల్లీలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని రైతులు సంఘాలు కోరాయి. అంతేగాక, మార్చి 10న దేశ వ్యాప్తంగా రైల్ రోకో చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతు సంఘాల నేతలు సర్వన్ సింగ్ పంధేర్, జగ్జీత్ సింగ్ డాల్లేవాల్ ఇటీవల ఘర్షణలో మృతి చెందిన రైతు స్వగ్రామం బల్లోహ్‌లో మీడియాతో మాట్లాడారు.   ప్రస్తుతం ఉన్న నిరసన కేంద్రాల…

National

టికెట్ ధరలు తగ్గించిన రైల్వే..

కరోనా సమయంలో భారతీయ రైల్వే ప్యాసింజర్ రైళ్లనన్నింటినీ ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మారుస్తూ వాటి చార్జీలను కూడా భారీగా పెంచింది. చిన్న చిన్న స్టేషన్లలో రైళ్లను నిలుపుదల చేయడం కూడా నిలిపివేసింది. పెద్ద పెద్ద స్టేషన్లలోనే ఆపేలా చర్యలు తీసుకుంది. దగ్గరలోని నగరాలు, పట్టణాల మధ్య తిరిగే మెము, డెముతోపాటు ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరలను కూడా పెంచింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. కనిష్టంగా రూ.10 ఉండే టికెట్ ధరలను కూడా రూ.35 నుంచి రూ.55కు…

National

భారత రక్షణ వ్యవస్థలో మరో ఆయుధం..!

హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ఉనికిని పెంపొందించే ప్రయత్నంలో, భారత నావికాదళం లక్షద్వీప్‌లోని మినీకాయ్ దీవులలో INS జటాయు అనే కొత్త స్థావరాన్ని స్థాపించాలని యోచిస్తోంది. అంతేకాకుండా, ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు ఐఎన్ఎస్ విక్రాంత్ అనే జంట విమాన వాహక నౌకల్లో భారత నావికాదళం తన కమాండర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో, ఒక క్యారియర్ నుండి టేకాఫ్ అయి మరొకదానిపై ల్యాండింగ్ వంటి హై-టెంపో కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో ఒకే క్యారియర్ గ్రూప్‌కు…

National

సూర్యఘర్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ. 78 వేల సబ్సిడీ..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’కు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంతో కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది.   కేబినెట్ నిర్ణయాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. రూ. 75,021…

National

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం..

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఖచ్చితమైన సంఖ్యను అధికారులు ప్రకటించాల్సి ఉంది.   అనసోల్ పరిధి జంతారా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని అంబులెన్స్‌ల్లో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. సహాయక…

National

ఎన్నికల వేళ.. ఆ వివాదాస్పద చట్టం అమలుకు కేంద్రం చర్యలు..

గతంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.   ఇంకొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే…

NationalTechnology

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌ పదవికి విజయ్ శేఖర్ శర్మ గుడ్‌బై..

ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌‌‌కు చెందిన పేటీఎం ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి స్పందించింది. కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ ప్రకటన తరువాత పేటీఎం షేర్ల ధరలు ఢమాల్ అయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన…

National

నేడు 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన..

అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీలో 34, తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి.   169 కోట్ల రూపాయలతో చేపట్టే ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సహ 16 అండర్ పాస్ బ్రిడ్జిల పనులకు నేడు ప్రధాని…

National

సీట్లను పంచుకున్న ఆ రెండు ప్రధాన పార్టీలు.. .

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య పొత్తుల వ్యవహారాలు ఒక్కటొక్కటిగా తేలుతున్నాయి.   ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా…

National

‘ఢిల్లీ ఛలో’లో ఉద్రిక్తత.. వారి ఆస్తులు సీజ్..

‘ఢిల్లీ ఛలో’లో భాగంగా పంజాబ్-హరియాణా సరిహద్దులో ఇటీవల జరిగిన ఉద్రిక్త ఘటనలపై హరియాణా పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద చర్యలకు సిద్ధమయ్యారు. ముందుస్తుగా హెచ్చరించిన విధంగా పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసానికి పాల్పడినందుకుగాను.. పరిహారం కింద బాధ్యుల బ్యాంకు అకౌంట్లు, ఆస్తులు సీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు చనిపోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డినట్లు తెలిపారు.