కీచకులుగా మారిన టీచర్లు.. 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లే కీచకులుగా మారారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ముగ్గురు ఉపాధ్యాయులు 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… తమిళనాడు కృష్ణగిరి సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో 13 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా విద్యార్థిని స్కూల్కి రావడం లేదు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు, తోటి విద్యార్థినులు ఆరా తీయగా దాటవేత ధోరణితో సమాధానం చెప్పుకొచ్చింది.…

