National

National

‘భారత్ రైస్’ అమ్మకాలు నేటి నుంచే..

సామాన్యులకు ఊరట కలిగించే వార్త. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘భారత్ రైస్’ (Bharat Rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని మంగళవారం (ఫిబ్రవరి 8న) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.   రూ. 29కే కేజీ భారత్ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార…

National

పేటీఎం కథ ముగిసినట్లేనా…?

పేటీఎంపై ఆర్బీఐ పలు ఆంక్షాలు విధించడంతో పేటీఎం షేర్లు కుప్పకూలుతున్నాయి. అయితే పేటీఎం సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఆర్బీఐ ఆంక్షాలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఎలాంటి డిపాజిట్లు సేకరించ కూడా ఆర్బీఐ నిషేధం విధించింది. అంతేకాదు పేటీఎం నుంచి టోల్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయకుండా ఆదేశించింది. దీంతో పేటీఎం వాడే వారు ఏం చేయాలో అర్థం కాకా అయోమయంలో పడిపోయారు.   ఫిబ్రవరి 29 వరకు పేటీఎం పని చేస్తోంది.…

National

ఎల్ కే అద్వానికి భారతరత్న..

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి ఇవాళ కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించింది. వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్న ఆయనకు ఇవాళ భారత రత్న పురస్కారం అందిస్తున్నట్లు ప్రధాని మోడీ ఫోన్ చేసి తెలిపారు. అనంతరం ఎక్స్ లో ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టారు. దీంతో అద్వానీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు భారత రత్న అవార్డు ప్రకటించడంపై అద్వానీ కూడా…

National

వికసిత్‌ భారత్‌ టార్గెట్‌ 2047..

ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 1న) లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2024–25పై మాట్లాడారు. దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచుతూ వచ్చామని తెలిపారు. యువత ఉపాధికి పెద్దపీట వేశాన్నారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

National

మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్..

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుంటారు. అధికారులతో కలిసి అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు.   ఆ తర్వాత ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు.…

National

బడ్జెట్ సమావేశాలు.. ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత….

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మార్చి రెండో వారం నాటికి దీన్ని విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్/మేలల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది.   ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకొన్ని గంటల్లో లోక్‌సభ, రాజ్యసభలు సమావేశమౌతాయి. ఇవి- ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు. బుధవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి…

National

మరో 7 రోజుల్లో CAA అమలు: కేంద్ర మంత్రి..

కేంద్ర మంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా CAAని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల కాక్ ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో ఈ హామీ ఇచ్చారు.

National

మాల్దీవుల పార్లమెంటులో రగడ… కోడిపుంజుల్లా కలబడిన ఎంపీలు..

భారత పొరుగు దేశం, చిన్న చిన్న దీవుల సమూహమైన మాల్దీవ్స్ పార్లమెంటులో ఆదివారం ఎంపీల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు మధ్య మొదలైన వివాదం.. తన్నులు, ముష్టిఘాతాల వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   మాల్దీవ్స్‌లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు ఆదివారం పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. కానీ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం మొహమద్ సొలెహ్ అధ్యక్షుడిగా ఉన్న ప్రతి…

National

అయోధ్య‌లో ప్రారంభ‌మైన రాగ సేవ కార్య‌క్ర‌మం..45 రోజుల‌పాటు..

అయోధ్య రామమందిరంలో బాల‌క్ రామ్ విగ్ర‌హ ప్ర‌తిష్ట అనంత‌రం భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతూనే ఉంది. ఇక్క‌డి బాల రాముడికి అంకితమిస్తూ భక్తి సంగీత ఉత్సవం ప్రారంభ‌మైంది. అయోధ్య గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఈ సంగీత ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు అంటే 45 రోజులపాటు కొనసాగనుంద‌ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు వెల్ల‌డించారు.   ఈ సంగీత ఉత్స‌వం శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మంలో దేశంలోని…

National

భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌ జిల్లాలోకి గురువారం న్యాయ్ యాత్ర ప్రవేశించింది. ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా బెంగాల్ లోని ఉత్తరాది జిల్లాల నుంచి బీహార్‌లోకి ప్రవేశించేలా రూట్ ఛేంజ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలే ఇందుకు…