National

National

2036 ఒలింపిక్స్ భారత్‌లోనే..!

ఒలింపిక్స్‌ క్రీడలు 2036 సంవత్సరంలో ఇండియాలో జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2023 డిసెంబరు చివరివారంలో తన గుజరాత్ పర్యటన సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకోగలిగితే.. అవి అహ్మదాబాద్‌లోనే ఉండొచ్చనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకీ ఒక దేశం.. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలంటే ఏ అర్హతలను కలిగి ఉండాలి? ఆతిథ్య దేశం విషయంలో ఒలింపిక్స్ కమిటీ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది? వంటి అంశాలను…

National

అయోధ్య రాముడు.. ఇక ‘బాలక్‌ రామ్‌’గా దర్శనం..

శతాబ్దాల స్వప్నం సాకారమై అయోధ్య (Ayodhya Ram Mandir)లోని నవ నిర్మిత భవ్య మందిరంలో శ్రీరాముడు కొలువుదీరాడు. ప్రధాని చేతులమీదుగా గర్భగుడిలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక చూసి భక్తజనం పులకించిపోయింది. అయితే, ఈ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన రామ్‌లల్లాను ఇకపై ‘బాలక్‌ రామ్‌ (Balak Ram)’గా పిలవనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ట్రస్ట్‌ పూజారి అరుణ్‌ దీక్షిత్‌ వెల్లడించారు.   జనవరి 22న ప్రతిష్ఠించిన శ్రీరాముడి విగ్రహానికి ‘బాలక్‌ రామ్‌’గా పేరు పెట్టామని అరుణ్…

National

రామజ్యోతి వెలిగించిన ప్రధాని మోడీ..

చారిత్రక అయోధ్యలో సోమవారం మధ్యాహ్నం రామమందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకను పురస్కరించుకుని రాత్రికి ఇళ్లలో దీపాలు వెలిగించాలని.. దీన్ని దీపావళి పండగలా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ.. దీపాలు వెలిగించారు. శ్రీరాముడి చిత్రపటానికి హారతి ఇచ్చారు.   ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రామజ్యోతి(Ram Jyoti) అంటూ మోడీ పేర్కొన్నారు. రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట…

National

రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠోత్సవం ఆరంభం..

ఇంకొన్ని గంటలు. 500 సంవత్సరాల నాటి భారతీయుల కల సాకారం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో.. సరయూ నదీ తీరం ఒడ్డున నిర్మితమైన రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదలుకానుంది.   ఈ కార్యక్రమం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలు, ప్రధాన మార్గాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం…

APNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలనుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తాయని.. వీటిలో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్- అయోధ్య ప్రయాణ ఛార్జీ (స్లీపర్) రూ.1500 ఉంటుందని పేర్కొన్నారు.

National

మంత్రముగ్ధం రాములోరి రూపం..అయోధ్యలో ప్రాణం పోసుకోనున్న విగ్రహం ఇదే

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో మూడు రోజులు మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆరంభమౌతుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులో రానుంది.   ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు,…

National

అయోధ్య బాల రాముడు.. విగ్రహం ఫొటోలు విడుదల…

అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలయంలో పూజలు, యాగాలు, క్రతువులు కొనసాగుతున్నాయి. బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు సమయం దగ్గరపడుతుండటంతో ఆ మహా ఘట్టానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పరిశీలిస్తోంది.   ఈ క్రమంలోనే మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. పూజలు, మంత్రాల మధ్య రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి…

NationalTELANGANA

అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి భారీ లడ్డు..

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతన్నాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటికే రామ మందిరానికి తలుపులు, పాదుకలు ఇక్కడ్నుంచే అయోధ్యకు తరలివెళ్లాయి.   తాజాగా, అయోధ్య రామయ్యకు హైదరాబాద్ నుంచి మరో కానుక అందనుంది. ప్రాణప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్దలతో తయారు చేసిన భారీ…

National

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. యోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.500 కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీకి బదులు రాముడి బొమ్మను ముద్రించినట్లుగా సోషల్ మీడియాలో ఓ నోట్ వైరల్ అవుతోంది. అయితే, నోట్‌పై ఎర్రకోట స్థానంలో అయోధ్య రామమందిరం, స్వచ్ఛ భారత్ లోగో ముద్రించినట్లు తెలుస్తోంది.

National

ప్రజలకు టెలికాం శాఖ హెచ్చరిక..

దేశ ప్రజలకు టెలికాం శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. టెలికామ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలాంటి వాటికి స్పందించొద్దని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) వెల్లడించింది. ఇది ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు వేస్తున్న మరో ఎత్తుగడ అని తెలిపింది. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్లిపోతాయని పేర్కొంది.