National

NationalTELANGANA

ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ పిలుపు..

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం సంభవించింది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి ఏర్పడింది.   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. విచారణలో భాగంగా ఉదయం తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని సూచించారు.  …

National

22న మద్యం దుకాణాలు, బార్‌లు బంద్‌..

ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాదినమైన జనవరి 22న రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు బంద్ పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ బంద్ పాటించాలని ఉత్తరాఖండ్ ఎక్సైజ్ కమిషనర్ హరిచంద్ర తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

National

చమురు ధరల భగ్గు.. 4% పెరుగుదల..

పశ్చిమదేశాలు, హౌతీ రెబెల్స్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో చమురు సహా అన్ని సరుకుల రవాణాకు తీవ్ర విఘాతం కలిగింది. హౌతీలను నిలువరించే లక్ష్యంతో అమెరికా, బ్రిటన్ యెమెన్‌లో వారి స్థావరాలపై ప్రతి దాడులు చేశాయి. పశ్చిమదేశాల సైనిక చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు హూంకరిస్తున్నారు.   ఈ నేప్యథంలో కొత్త ఏడాదిలో తొలిసారిగా చమురు ధరలు 4% పెరిగాయి.…

National

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రిసారిగా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఫిబ్ర‌వ‌రి 1న మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో మ‌హిళా రైతుల‌కు పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి కింద ఇచ్చే న‌గ‌దు సాయాన్ని రెట్టింపు చేస్తార‌ని భావిస్తున్నారు.

National

అయోధ్య రామ‌మందిర గ‌ర్భ‌గుడికి మొద‌టి బంగారు త‌లుపు ఏర్పాటు…..

అయోధ్య‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న రామ‌మందిరం ఈ నెల 22న ప్రారంభించ‌న‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. అయితే, అయోధ్య రామ‌మందిరానికి మొద‌టి బంగారు త‌లుపును ఏర్పాటు చేశారు. గ‌ర్భ‌గుడి మొదటి అంత‌స్తులో బంగారు త‌లుపును ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న బంగారు త‌లుపును అమ‌ర్చ‌డం జ‌రిగింది. మరో మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరప్రదేశ్…

National

కాంగ్రెస్ టార్గెట్ అంతసులువు కాదు..

వ్యూహాలు రచించినా.. ఒక్కోసారి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సహకరించాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితులు సహకరిస్తున్నాయా? రాష్ట్రాల్లో లెక్కలు ఏం చెబుతున్నాయి? ఒక వైపు మోడీ 400 సీట్లు టార్గెట్ అంటుంటే.. దాన్ని తగ్గించడంలో కాంగ్రెస్‌కు సహకరించే అంశాలు ఏమున్నాయి?   ఇటీవలి CVoter ఒపీనియన్ పోల్‌తో పాటు ఇతర విశ్వసనీయ డేటా విశ్లేషణ ప్రకారం, 2024 పోరాటంలో ప్రతిపక్షాలు ఏటవాలుగా ఉన్న పర్వతాన్ని ఎక్కాల్సి ఉంటుందన్నది స్పష్టం. అయితే, బీజేపీ గెలవాలని అనుకుంటున్న…

National

భారత్, మోడీపై అనుచిత వ్యాఖ్యలు: ముగ్గురు మాల్దీవుల మంత్రులపై వేటు, ప్రముఖుల కౌంటర్లు

భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. లక్షదీవుల అందాలను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా మాల్దీవుల మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జూనా అబ్రహాం, శ్రద్ధా కపూర్ వంటి వారు స్వదేశీ టూరిజానికి మద్దతుగా…

National

అయోధ్యా రాముడికి వెంకన్న చిరు కానుక..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం.   ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార…

National

భార‌త ఆర్థిక వృద్ధిపై రిపోర్టు ఇచ్చిన ఐక్య‌రాజ్య‌స‌మితి..

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఐక్యరాజ్యసమితి తన ఆర్థిక రిపోర్టులో పేర్కొంది. భారత ఆర్థిక వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ తన రిపోర్టులో తెలిపింది. ఉత్పత్తి, సర్వీసెస్ రంగంలో బలమైన వృద్ధి కారణంగా భారత ఆర్థిక వృద్ధి బాగుంటుందని యూఎన్ రిపోర్టు వెల్లడించింది.

National

శ్రీ‌రాముడు మాంసాహారి.. ఎన్సీపీ నేత జితేంద్ర సంచ‌ల‌న వ్యాఖ్యలు..

అయోధ్య రామాల‌యం ప్రారంభ వేడ‌క‌ను ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఎన్సీపీ నేత జితేంద్ర శ్రీ‌రామునిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌డు ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. శ్రీ‌రాముడు మాంసాహారి. రాముడు జంతువుల‌ను వేటాడి, వాటిని తినేవాడు అంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. మ‌రికొద్ది రోజుల్లో అయోధ్య రామ‌ల‌యం ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు కాస్త దుమారం రేపుతున్నాయి. కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి…