National

National

ఢిల్లీలో రైతుల ఆందోళన, చలి తట్టుకోలేక కుప్పకూలిన రైతు, ఆసుపత్రిలో ప్రాణం పోయింది, అర్దరాత్రి..!

వివిధ డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు అడ్డుగోడ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ రైతు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఓరైతు మృతి చెందాడు. మరణించిన అన్నదాతను 78 ఏళ్ల జ్ఞాన్ సింగ్‌గా గుర్తించామని అధికారులు అంటున్నారు.   జ్ఞాన్ సింగ్‌ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నివాసి అని అధికారుల విచారణలో తెలిసింది. గురువారం రాత్రి విపరీతమైన చలితో బాధపడుతున్న జ్ఞాన్ సింగ్‌ శుక్రవారం తెల్లవారుజామున మృతి…

National

స్వలింగ వివాహాలకు గ్రీన్‌సిగ్నల్..

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే దిశగా గ్రీస్‌లో అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన బిల్లుకు తాజాగా గ్రీస్ పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. తద్వారా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్ నిలిచింది. దీంతో గ్రీస్ ప్రభుత్వానికి LGBT సమాజం ధన్యవాదాలు తెలిపింది. స్వలింగ వివాహాలకు ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాలు మద్దతు ఇస్తున్నాయి.

National

‘యువ విజ్ఞాని’కి ఇస్రో దరఖాస్తుల ఆహ్వానం..

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ పాఠశాల విద్యార్థుల కోసం యువ విజ్ఞాని కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ‘ఎక్స్‌’లో తెలిపింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ పేరిట రెండు వారాల పాటు అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 2024 జనవరి 1కి 9వ తరగతి చదువుతున్న విద్యార్ధులు అర్హులుని తెలిపారు.

National

పీఎం సూర్య ఘర్ .. 300యూనిట్ల ఉచిత సోలార్ విద్యుత్ కోసం ఇలా అప్లై చేసుకోండి..!!

భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ద్వారా దేశ ప్రజలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. 300 యూనిట్ల వరకు దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తీపి కబురు చెప్పారు. సౌరశక్తి వినియోగాని,కి సుస్థిర ప్రగతిని పెంచడానికి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనను ప్రారంభిస్తున్నట్టు నిన్న ప్రధాన నరేంద్ర మోడీ ప్రకటించారు.   ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద…

National

ఢిల్లీ ముట్టడికి లక్షలాదిగా రైతులు-మూడు రాష్ట్రాల నుంచి భారీ ర్యాలీలతో..

రాజధాని ఢిల్లీని ముట్టడించేందుకు మరోసారి ఉత్తరాది రైతులు సిద్ధమయ్యారు. ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ కు చెందిన లక్షలాది మంది రైతులు భారీ ర్యాలీలతో దేశ రాజధాని వైపుకు కదులుతున్నారు. దాదాపు 200 రైతుసంఘాల ఆధ్వర్యంలో వీరంతా గ్రూపులుగా విడిపోయి ర్యాలీలు చేపట్టారు. రేపు (మంగళవారం) ఢిల్లీలో మహా ధర్నా నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వారు పట్టుబడుతున్నారు.   సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా…

National

ఢిల్లీ వద్ద భారీ నిరసనకు అన్నదాతలు రెడీ..!

మూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీని భారీ సంఖ్యలో చుట్టుముట్టిన రైతులు.. మరోసారి నిరసనకు రెడీ అయ్యారు. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలుండగా.. ఇలాంటి నిరసనలు తమ ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చిపెడతాయని మోదీ నాయకత్వంలోని బిజేపీ ప్రభుత్వం భయపడుతోంది. అందుకే రైతు సంఘాలను నిరసన చేయకుండా ఆపేందుకు, అణిచివేసేందుకు.. అన్ని ప్రయత్నాలు చేస్తోంది.   ఫిబ్రవరి 13న దేశంలోని 200కు రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల వద్ద మహాధర్నాకు సన్నధమవుతున్నారు. ఈ ధర్నాలో పంజాబ్,…

National

ఎన్నికల వేళ.. ఈసీ కీలక నివేదిక విడుదల..

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.   ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా…

National

సైనిక బలగాలపై భారత్ కీలక నిర్ణయం..

మాల్దీవుల-భారత్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత విదేశి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్దీవులలో ఉండే భారత భద్రత బలగాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులలో ఉన్న మిలిటరీ బలగాల స్థానంలో నైపుణ్యంతో కూడిన సాంకేతిక సిబ్బందిని మాలేలో ప్రవేశపెడతామని విదేశాంగ కార్యదర్శి రణ్ ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.

NationalTELANGANA

రైల్వే టికెట్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు..

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్‌, జోన్‌ పరిధిలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లలోని టిక్కెట్‌ కౌంటర్లలో డిజిటల్‌ చెల్లింపులు అందుబాటులో తీసుకొచ్చారు. POS, UPI (ఫోన్ పే, Google Pay మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ నగదు రహిత విధానం వల్ల ప్రయాణికుల సమయం ఆదా కావడమే కాకుండా చిల్లర సమస్యలు ఉండవని అధికారుల తెలియజేశారు. త్వరలోనే అన్ని చోట్ల ఈ సౌకర్యాలను తీసుకొస్తామని రైల్వే శాఖ తెలిపింది.

National

‘భారత్ రైస్’ అమ్మకాలు నేటి నుంచే..

సామాన్యులకు ఊరట కలిగించే వార్త. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘భారత్ రైస్’ (Bharat Rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని మంగళవారం (ఫిబ్రవరి 8న) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.   రూ. 29కే కేజీ భారత్ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార…