National

National

ఆవుపేడతో 3 లక్షల దీపాలు

రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు చెందిన శ్రీ కృష్ణ బలరామ్ గోసేవా ట్రస్టు ఈ దీపావళికి ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంది. హంగోనియా గోశాల నుంచి ఇందుకు అవసరమైన ఆవుపేడను సేకరించారు. జైపూర్ సమీపంలో ఈ గోసేవా ట్రస్టును రాజస్థాన్ ప్రభుత్వం, జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ 2016లో ఏర్పాటు చేసింది. 13,000 గోవులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. ఆవు పేడతో 3 లక్షల దీపాలు తయారు చేయడం వెనుక ఆవులను పరిరక్షించాలనే సందేశం…

APNationalTELANGANA

పొలిటికల్ యాడ్స్ రద్దు.. ఈసీ కీలక నిర్ణయం..

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచార అస్త్రం కీలకం. అయితే.. ప్రచారంలో భాగమైన కొన్ని పొలిటికల్‌ యాడ్స్‌ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. తాము అనుమతి ఇచ్చిన ప్రకటనలను మార్చేసి, ప్రసారం చేస్తున్నారంటూ 15 యాడ్స్‌ను ఈసీ రద్దు చేసింది. దీని వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా, క్రియేటివ్‌గా యాడ్స్ రూపొందించి ప్రచారం చేయడంతో ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని, అవి అలాగే కొనసాగితే ఓడిపోతామని భయపడే బీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు…

CINEMANational

ఓటీటీలకు షాక్.. కొత్త బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం..

భారత ప్రభుత్వం నూతన ప్రసార సేవల (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టింది. ఇది ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్‌తో సహా వివిధ ప్రసార సేవలకు నియంత్రణా ఫ్రేమ్‌వర్క్‌ను ఏకీకృతం చేస్తుంది. ఈ బిల్లు ఆమోదించబడిన తర్వాత, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలను కూడా కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నియంత్రిస్తుంది.   సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం కొత్త ముసాయిదా చట్టం గురించి తెలియజేస్తూ X…

National

ప్రజాప్రతినిధులపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

పబ్లిక్ సర్వెంట్స్ , ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి.. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,175 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 40 శాతం.. అంటే 2,116 కేసులు కనీసం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టుల డేటాను పిల్ ప్రస్తావించింది. పిటిషనర్ల అభ్యర్థనపై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్..ఈ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ కోసం ప్రత్యేక బెంచ్…

National

మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్: ప్రధాని మోడీ..

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రధాని మోడీ ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మార్చి 2020…

APHealthNationalTELANGANA

అందుబాటులోకి చికన్‌ గున్యా వ్యాక్సిన్‌..?

దోమల ద్వారా వ్యాప్తి చెందే చికన్‌గున్యాకు తొలి టీకా అందుబాటులోకి రానుంది. నవంబర్ నెలలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచంలో సగం దేశాలకు కలవరం కలిగిస్తున్న చికన్‌గున్యా మరిన్ని దేశాలకు పాకే ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో వ్యాక్సిన్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ఆమోదం తెలపడం ఊరటనిచ్చే విషయం.   ఫ్రెంచి డ్రగ్ కంపెనీ వాల్నెవా ఈ టీకాను తయారు చేసింది. తొలుత అమెరికా ట్రావెలర్లు, సీనియర్ సిటిజన్లకు…

National

81.5 కోట్ల మంది ఆధార్ డేటా చోరీ…

దేశజనాభాలో మూడోవంతు మంది ఆధార్ డేటా లీకైంది. 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అంగట్లో అమ్మకానికి ఉన్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి(ICMR) నుంచి ఈ డేటా చోరీ జరిగినట్టు తెలుస్తోంది.   డేటా చౌర్యానికి గురైన విషయం అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెక్యూరిటీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆధార్ లో నిక్షిప్తమైన 81.5 కోట్ల మంది బయోమెట్రిక్ వివరాలు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచినట్టు సైబర్ నేరగాళ్లు డార్క్‌వెబ్‌లో…

HealthNational

కోవిడ్ కారణంగా తీవ్రంగా బాధపడ్డారా..? అయితే మీకే ఈ అలెర్ట్..

కరోనా ప్రపంచాన్ని ఎంత దడదడలాడించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మాయదారి రోగం బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వ్యాక్సిన్స్ వచ్చాయన్న ధైర్యం ఉన్నా.. ఈ మహమ్మారి రూపం మార్చుకుని ఎలా అటాక్ చేస్తుందోనన్న ఆందోళన కూడా జనంలో ఉంది. కాగా ఇటీవల గుండెపోటు మరణాలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో.. కేవలం వయస్సు మీదపడిన వృద్ధులు మాత్రమే గుండెపోట్లతో ఎక్కువగా చనిపోయేవారు. కానీ ఇటీవలి కాలంలో ఫిట్‌గా…

National

భగవంత్ కేసరికి ఫేక్ కలెక్షన్స్.. అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు

భగవంత్ కేసరి కలెక్షన్స్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. బాలయ్య కొత్త సినిమామీ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఇక సినిమా టీం రోజు బాక్సాఫీస్ కలెక్షన్లను…

National

జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సంబంధం లేదు.. యూకే పార్లమెంట్‌లో పీఓకే ప్రొఫెసర్..

జమ్ము కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్‌కి సంబంధమే లేదని, పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కి చెందిన రాజకీయ కార్యకర్త, ప్రొఫెసర్ సజ్జాద్ రజా అన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లా చూస్తోందని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సౌకర్యాలను పొందే హక్కు ఉందని ఆయన అన్నారు. కొంతమంది బ్రిటీష్ ఎంపీలతో సహా పలువురు వక్తలు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీరీ పండిట్ల పోరాటాలు, జమ్మూ…