National

National

ఢిల్లీకి పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్..! భారీ ఉగ్రకుట్ర భగ్నం..!

దేశంలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. నిఘా సంస్థల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. నేరుగా యుద్ధం చేసే సత్తా లేక ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ దాడులు చేయాలనే దాయాది ప్లాన్‌కు చెక్‌ పెట్టాయి భారత నిఘా సంస్థలు. ఈసారి వారి ఎత్తులకు పైఎత్తు వేయడంతో దేశ రాజధానిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇందుకోసం మూడు నెలల పాటు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించాయి ఇండియన్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీస్. ఓ పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌తో పాటు.. అతడికి సహకరించిన మరో…

NationalTechnology

గూగుల్ ఏఐ మోడ్… ఏదైనా చిటికెలోనే..!

ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసే దిశగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కీలక అడుగులు వేస్తోంది. తన వార్షిక డెవలపర్ల సమావేశం ‘గూగుల్ I/O 2025’లో భాగంగా, వినియోగదారుల కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత షాపింగ్ ఫీచర్లను ఆవిష్కరించింది. ఈ నూతన ఆవిష్కరణలు కొనుగోలు ప్రక్రియను మరింత వ్యక్తిగతంగా, సౌకర్యవంతంగా మార్చనున్నాయి.   గూగుల్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ AI షాపింగ్ ఫీచర్లకు జెమినీ AI సాంకేతికత మరియు గూగుల్ షాపింగ్ గ్రాఫ్…

National

పాక్ ఏజెంట్ కు పెళ్లి ప్రపోజల్ చేసిన యూట్యూబర్ జ్యోతి..!

దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూ సంచలనం సృష్టిస్తోంది.   గత వారం అదుపులోకి తీసుకున్న జ్యోతి మల్హోత్రాను అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు…

National

జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు..!

దేశ ద్రోహి,పాక్‌ గూఢచారి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ టూర్ కు సంబంధించిన వివరాలను పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పాకిస్థాన్ జర్నీ ఆహ్లాదకరంగా సాగిందని.. అక్కడ ఆతిథ్యం బాగుందని రాసుకొచ్చింది.   ఈ మేరకు జ్యోతి మల్హోత్రా.. తన డైరీలో పాకిస్థాన్ ను పొగుడుతూ రాసుకున్నట్లు పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు.…

National

ఇండియాలో పెరుగుతున్న కరోనా జేఎన్.1 కేసులు… వ్యాధి లక్షణాలు ఇవే..!

దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు. ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటం గమనార్హం.ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే, హాంకాంగ్,…

National

భారత సైన్యానికి కీలక అధికారాలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం..

పాకిస్థాన్ తో ఇటీవలి ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలకు కీలక అధికారాలను అప్పగించింది. అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సుమారు రూ.40,000 కోట్ల పరిమితితో అత్యవసర ఆయుధ సేకరణ (ఎమర్జెన్సీ ప్రొక్యూర్‌మెంట్ – ఈపీ) అధికారాలను త్రివిధ దళాలకు కల్పిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) కొద్ది రోజుల క్రితమే ఆమోదముద్ర వేసినట్లు…

National

పాక్ గూఢచర్యం కేసులో ప్రముఖ యూట్యూబర్‌తో జ్యోతి మల్హోత్రా అరెస్ట్..

హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్‌తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.   ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ…

National

మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ విజృంభిస్తున్న కేసులు..

ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్‌ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది.   హాంగ్‌కాంగ్‌లో ప్రస్తుతం వైరస్ కేసులు ‘చాలా ఎక్కువగా’ ఉన్నాయని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రంలోని అంటువ్యాధుల విభాగం అధిపతి అల్బర్ట్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇటీవల కాలంలో హాంగ్‌కాంగ్‌లో శ్వాసకోశ నమూనాల్లో…

National

రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు..! ‘భార్గవాస్త్ర’ ప్రయోగం విజయవంతం..!

దేశ రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. శత్రు డ్రోన్ల సమూహాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘భార్గవాస్త్ర’ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్) ఈ అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.   ఒడిశాలోని గోపాల్‌పుర్‌ వద్ద గల సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్షలు జరిగినట్లు ఆర్మీ ఎయిర్‌…

National

అప్పటి వరకు ఆ నీళ్లు ఇచ్చేదేలే..! పాక్ కు మరో షాక్..!

కాల్పుల విరమణ అమలులోకి రావడంతో పాకిస్తాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ని క్షమించేది లేదని అంటున్నారు భారతీయ అధికారులు. పాకిస్తాన్ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదని, ఉగ్రవాదాన్ని పూర్తిగా పక్కనపెట్టే వరకు ఆ దేశంపై జాలి చూపేది లేదని తేల్చి చెబుతున్నారు. తాజాగా సింధు జలాల పంపిణీ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. పాకిస్తాన్ కి సింధు జలాలు వదిలేది లేదని తేల్చి చెప్పారు.   యుద్ధం…