జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ఏర్పాటు..?
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 65.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా మారుస్తున్నారని తెలిపారు. ఎల్బీనగర్…

