National

NationalSPORTS

ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌

ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. జనవరి 14న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీని కొలంబో మినహా 5 వేదికల్లో నిర్వహించనున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 4న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఇదిలా ఉంటే.. అండర్‌-19 ప్రపంచకప్‌ ఇది 15వ ఎడిషన్‌. ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరగనున్నాయి.  …

National

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు పంథాను మార్చాయి.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది. 2024 నుంచి అన్ని వీడియో షోలు, సినిమాల్లో ప్రకటనలను చేర్చుతున్నట్లు…

National

డానిష్ అలీని కలిసిన రాహుల్ గాంధీ.. కౌగిలించుకునే ఫొటో పోస్ట్

లోక్‌సభ ప్రత్యేక సమావేశాల చివరి రోజున బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి కించపరిచే పదజాలం వాడిన అంశం ఊపందుకుంది. ఈ విషయంపై రాజకీయ ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. డానిష్ అలీ ఇంటికి చేరుకున్న రాహుల్ గాంధీ.. అతన్ని కౌగిలించుకుని చాలాసేపు మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ ఎక్స్‌లో పంచుకున్నారు. అంతేకాకుండా ఆ ఫొటోను పోస్ట్…

APNational

సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప

తిరుమల/తిరుపతి: కలియుగ వైకుంఠదైవ శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో (tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు (brahmotsavam) దర్శనమిచ్చారు. తిరుమలలో కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప ! వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి (tirumala) వాహనసేవ కోలాహలంగా జరిగింది.…

National

చంద్రబాబు ప్రాణాలకు లోకేష్ నుండే ప్రమాదం: షాకింగ్ విషయం చెప్పిన వైసీపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు భద్రత విషయంలో టిడిపి నేతలు, నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతిచెందడంతో, చంద్రబాబు ఆరోగ్యంపై కూడా టిడిపి శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకి ప్రాణహాని ఉందని, జైల్లోనే చంద్రబాబును…

National

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా కెనడా మారిందని భారత్ తీవ్రం

న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా కెనడా మారిందని భారత్ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఖలిస్థాన్ ఉగ్రవాదుల అంశంపై కెనడా(Canada) వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది. కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి గురువారం మీడియాతో మాట్లాడారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని ధ్వజమెత్తారు. భద్రతాపరమైన పరిస్థితుల…

National

గరుడసేవకు భారీ బందోబస్తే, వేల సంఖ్యలో సీసీటీవీలు, 2 లక్షల మంది !

కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి (ttd) కొలువు తీరిన తిరుమలలో (tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) భాగంగా సెప్టెంబరు 22న శుక్రవారం జరుగనున్న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో (tirumala)వేచి ఉండే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. గరుడ సేవ దర్శనం కోసం (tirumala)ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌…

National

జనగణన, డీలిమిటేషన్ అప్పుడే: మహిళా బిల్లుపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పలు పార్టీలు రాజకీయాలు చేశాయని.. కానీ, బీజేపీ, నరేంద్ర మోడీకి అలా కాదని అన్నారు. మహిళలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పారు. జనగణన, డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు పట్టుబట్టడంపైనా అమిత్ షా స్పందించారు. వచ్చే(2024) సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో జనాభా…

National

పార్లమెంటులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది

న్యూఢిల్లీ: పార్లమెంటులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు(women’s reservation bill)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. నారీ శక్తి అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ బిల్లుపై దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం బుధవారం రాత్రి న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 454 మంది…

CINEMANational

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన హీరో విశాల్..

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికే ఇలా జరిగిందంటే తనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటని, తలుచుకుంటేనే భయమేస్తుందని హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా సినిమా మార్క్ ఆంటోనీ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరో విశాల్ చంద్రబాబు అరెస్టు గురించి…