National

National

దిగొచ్చిన టమాటా ధరలు.. ఇక డొంట్ వర్రీ..

రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భారీగా పెరిగిన ధరలతో కొంత మంది టమాటాలు వాడడమే మానేశారు. కానీ గత మూడు రోజులు టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతోనే టమాటా ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు టమాటా రాక పెరగడంతో ధరలు తగ్గాయి. హైదరాబాద్ లోని పలు రైతు బజారుల్లో కిలో టమాటా రూ.63 నుంచి రూ.70 పలుకుతోంది. ఇక రిటైల్ లో కిలో రూ.120 నుంచి రూ.140…

National

అడుగు రూ.లక్ష పైనే: అమ్ముడుపోని ఆ రెండు ప్లాట్లు

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లల్లో నిర్వహిస్తోన్న భూముల ఇ-వేలంపాటలు తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. మొన్నటి మొన్న కోకాపేట్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఇ-వేలంలో ఎకరం 100 కోట్ల రూపాయలను అధిగమించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట్‌ భూముల ధరలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. ఈ- ఆక్షన్‌లో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు స్థలాలను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర గరిష్ఠంగా 100 కోట్ల రూపాయలను అందుకుంది.…

NationalTELANGANA

కేంద్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వమే

కేంద్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని.. ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 75 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని కేటీఆర్ తెలిపారు. కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టామన్నారు. నేతన్నలకు 16 వేలకుపైగా…

National

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క నిర్ణయం 43 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. నిత్యం 45 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏటా రూ 3 వేల కోట్ల భారం పడనుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు కార్మికుల మనోభీష్టం నెరవేరింది. విలీనం బిల్లుకు…

NationalTELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా అన్ని వర్గాలను ఆకట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాల ప్రకటను సిద్దమయ్యారు. ఈ రోజు అసెంబ్లీలో ఉద్యోగుల పీఆర్సీ తో పాటుగా మధ్యంతర భృతి (ఐఆర్‌)ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. దీంతో పాటుగా మరిన్ని కీలక ప్రకటనలు చేయనున్నారు. నేటితో సమావేశాల ముగింపు: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఎన్నికల…

National

రైల్వే స్టేషన్లు భవిష్యత్‌లో ఇలా ఉండబోతోన్నాయ్..!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోన్నారు. ఒకేసారి దేశంలో 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మొత్తంగా 24,470 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఆయా రైల్వే స్టేషన్లన్నీ కూడా మల్టీ పర్పస్ సెంటర్లుగా ఆవిర్భవించనున్నాయి. సిటీ సెంటర్స్‌గా అభివృద్ధి చెందనున్నాయి. దీనికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రైల్వే శాఖ ఇదివరకే సిద్ధం…

National

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి.

హైదరాబాద్ : తెలంగాణ బీజేపి కార్యక్రమాల రూపకల్పనలో వేగం పెంచింది. అన్ని రంగాల్లో పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్ షాప్ కొనసాగుతోంది. వర్క్ షాప్ లో బీజేపీ శ్రేణులకు ఎంపి, బీజేపి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ జవదేకర్, బీజేపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్…

National

కేటీఆర్ వ్యాఖ్యలకు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

తెలంగాణ శాసన సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అమెరికాలో తాను విద్యత్ గురించి ఏం మాట్లాడాను, ఆ వ్యాఖ్యలను ఎలా వక్రీకరిస్తున్నారో శాసనసభలో శ్రీధర్ బాబు వివరణ ఇస్తుంటే మంత్రులు అడ్డుకుంటున్నారనన్నారు రేవంత్ రెడ్డి. సభలో వాస్తవాలు చెప్పే అవకాశం ఇవ్వనంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియకుండా ఉంటాయా అని రేవంత్ ప్రశ్నించారు. సీతక్క ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఉంటే సీతక్క…

National

ఎన్నికల బరిలో రాహుల్ సిప్లిగంజ్

రాహుల్ సిప్లిగంజ్ ఎన్నికల బరిలోకి దిగనున్నారా. బిగ్‌ బాస్ విన్నర్‌గా, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌గా పేరొందిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇందు కోసం ముందుగానే పార్టీతో పాటుగా నియోజకవర్గం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ పైన అధికార ప్రకటనకు రాహుల్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మంగళహాట్ ప్రాంతానికి చెందిన రాహుల్ సిప్లిగంజ్ రాజకీయంగా వార్తల్లో నిలుస్తున్నారు.…

National

ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ- విజ్ఞప్తి

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. రద్దీ అసాధారణ స్థాయిలో ఉంటోంది. కొద్దిరోజులుగా ఇవే పరిస్థితులు నెలకొంటోన్నాయి. విమానం ఎక్కే తమ ఆప్తులకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఖ్య భారీగా ఉంటోంది. ఫలితంగా- వాహనాల రాకపోకలు తరచూ స్తంభిస్తోన్నాయి. ప్రత్యేకించి- ఈ మధ్యకాలంలో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల రద్దీ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో ఉంటోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, న్యూజిలాండ్, ఇటలీల్లో సాధారణంగా ఆగస్టు/సెప్టెంబర్ నెలల్లో…